మలయశ్రీకి సాహిత్య పురస్కారం

మలయశ్రీకి సాహిత్య పురస్కారం

కరీంనగర్, వెలుగు: ప్రముఖ సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ మలయశ్రీకి తెలంగాణ సారస్వత పరిషత్తు డాక్టర్ ఎం.శ్రీధర్ రెడ్డి సాహితీ పురస్కారాన్ని ప్రకటించింది. ఈయన శాంతిపథం(నాటకం), తిరుగుబాటు, నిర్ణయం(నవల),  కాకతీయుల నాటి సామాజిక జీవితం, బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్, తెలుగులో లేఖా సాహిత్యం, పాల మనసులు(బాలగేయాలు) తదితర అనేక రచనలు చేశారు. సుమారు 40 ఏళ్లపాటు హైస్కూల్, కాలేజీల్లో తెలుగు టీచర్ గా, లెక్చరర్ గా పని చేశారు. బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ లో పురస్కారాన్ని అందజేయనున్నట్లు సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి జుర్రు చెన్నయ్య వెల్లడించారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-30T03:36:47Z dg43tfdfdgfd