మళ్లీ రీ రిలీజ్ చేయండన్న నెటిజన్.. దండం పెట్టేసిన దర్శకుడు

టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలను రీ రిలీజ్ చేయడం కామన్.. కానీ అప్పుడు డిజాస్టర్లు, ఫ్లాప్ అయిన చిత్రాలను మళ్లీ విడుదల చేసి సెలెబ్రేట్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఆరెంజ్ సినిమా అప్పుడు ఫ్లాప్. రీ రిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక సిద్దార్థ్ ఓయ్ చిత్రం అప్పుడు అంతగా పట్టించుకోలేదెవ్వరూ. కానీ ఈ ఏడాది వాలెంటైన్స్ డేకి వదిలితే థియేటర్లు నిండిపోయాయి. అలా రీ రిలీజ్‌లు ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

ఆనంద్ రంగా ట్విట్టర్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. ఓయ్ రీ రిలీజ్‌ను సోషల్ మీడియాలో బాగానే ఆస్వాధించాడు. ప్రతీ ఒక్కరికీ రిప్లై ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. గుండు నాయాలా అని తిడితే కూడా లైట్ తీసుకున్నాడు. అవును నాది గుండు అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ఇక ఈ మూవీ విడుదలై నేటికి పదిహేనేళ్లు అయిందంటూ తాజాగా ఆనంద్ రంగా ట్వీట్ వేశాడు. దానికి నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతూ వస్తున్నారు.

ఓయ్ సినిమాకు సీక్వెల్ తీయమని ఓ నెటిజన్ అడిగితే.. ఎవరు యాక్ట్ చేస్తారు? ఎవరు నిర్మిస్తారు? అని అనేశాడు. అంటే తీసేవాడు లేడని, నటించే వాడు ముందుకు రాడని చెప్పకనే చెప్పేసినట్టుగా కనిపిస్తోంది. మళ్లీ ఓయ్ సినిమాను రీ రిలీజ్ చేయండని మరో నెటిజన్ అడిగాడు. దెబ్బకు దండం పెట్టేశాడు ఆనంద్ రంగా.

మళ్లీ ఓ మంచి సినిమాను తీయండని నెటిజన్ కోరాడు. తప్పకుండా అని ఆనంద్ రంగా బధులిచ్చాడు. స్టోరీ డిమాండ్ చేసింది అనే కారణం తప్పా.. ఇంకేదైనా చెప్పండి.. అసలు వైజాగ్‌లో సినిమాను ఎందుకు షూట్ చేశారు? అని ఓ నెటిజన్ అడిగాడు. తనకు వైజాగ్ అంటే చాలా ఇష్టమని, అందుకే షూట్ చేసినట్టుగా చెప్పుకొచ్చాడు. మరి ఆనంద్ రంగా మళ్లీ తన ప్రాజెక్టుతో ఎప్పుడు ముందుకు వస్తాడో చూడాలి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-03T09:57:55Z dg43tfdfdgfd