మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఇంట్లో చొరబడ్డ దొంగలు
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రిపగలు తేడా లేకుండా దోచుకుంటున్నారు. పట్టపగలు ఇండ్లలో మనుషులు ఉన్నా ధైర్యంగా చోరీకి పాల్పడుతున్నారు. ఎదురు తిరిగితే దాడులు చేస్తున్నారు. లేటెస్ట్ గా ఒంగోలులో ఏపీ మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు ఇద్దరు దుండగులు. ఈ ఘటన సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఒంగోలులో మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఇంట్లోకి ఏప్రిల్ 27 అర్థరాత్రి 12 గంటల 43 నిముషాలకు ఇద్దరు దొంగలు చొరబడ్డారు. ముఖానికి మాస్కులు ధరించి కాపలాగా ఉన్న వాచ్ మెన్ పై దాడికి యత్నించారు. కిందపడేసి కొట్టారు. వాచ్ మెన్ దొంగలను ప్రతిఘటిస్తూ కేకలు వేయటంతో దుండగులు పరారయ్యారు. వాచ్ మెన్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకుంటామని చెప్పారు.
©️ VIL Media Pvt Ltd. 2024-04-28T07:59:46Z dg43tfdfdgfd