మామయ్యకే మద్దతు.. బాలయ్యపై అలేఖ్య తారకరత్న ఎమోషనల్ పోస్ట్

అలేఖ్య తారకరత్న తాజాగా తన మద్దతు ఎవరికో చెప్పేసింది. తారకరత్న చనిపోయాక.. అలేఖ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యారు. తన గురించి, తన బాధ గురించి, తన భర్త గురించి చెబుతూ అందరినీ కదిలిస్తూ ఉంటోంది. ఇక తన పిల్లలకు సంబంధించిన అప్డేట్లను షేర్ చేస్తుంటారు. మధ్య మధ్యలో విజయసాయి రెడ్డి, నందమూరి బాలకృష్ణలతో దిగిన ఫోటోలను షేర్ చేస్తుంటారు. అలా ఇరువురితోనూ తమ బంధం ఉందని చెబుతూనే ఉంటారు.

ఇప్పుడు ఏపీలో ఎన్నికలు హీట్ ఎక్కాయి. వైసీపీ ఒక వైపు.. టీడీపీ, జన సేన, బీజేపీ కూటమి ఒక వైపు ఉందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తారకరత్న భార్య అలేఖ్య తన సపోర్ట్ గురించి చెప్పారు. అందరూ తనను తరుచూ అడుగుతూనే ఉంటారు.. మద్దతు ఎవరికి ఇస్తారని పదే పదే అడుగుతుంటారని చెప్పుకొచ్చారు.

View this post on Instagram

A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna)

]]>

ప్రేమ, మానవత్వం ఎటుంటే అటే.. మరీ ముఖ్యంగా నా ఫ్యామిలీకే నా మద్దతు.. అంటూ బాలయ్య గురించి పోస్ట్ వేసింది. ఆల్ ది బెస్ట్ మావయ్య.. నాకు, ఓబు, పిల్లలకు నువ్వంటే అంతులేని ప్రేమ మామయ్య అని చెప్పుకొచ్చారు. బాలయ్య బాబు ఉండగా.. మీకు దిగులు ఎందుకు అంటూ నందమూరి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య బాబు ఆ పిల్లల బాధ్యత కూడా తీసుకున్నాడు.. మీకేం కష్టం రాకుండా ఎప్పుడూ తోడుంటాడు అంటూ అభిమానులు చెబుతున్నారు. మొత్తానికి అలేఖ్య మాత్రం ఈ ఎన్నికల్లో తను ఎటు వైపుంటారో చెప్పేశారు. ఇక ఈ ఫోటోలో నందమూరి వారసుడు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ హైలెట్ అవుతున్నాడు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-20T07:26:00Z dg43tfdfdgfd