యూ ట్యూబ్ స్టోరీ రైటర్ ​సూసైడ్

యూ ట్యూబ్ స్టోరీ రైటర్ ​సూసైడ్

గచ్చిబౌలి, వెలుగు :  ఆర్థిక ఇబ్బందులతో ఓ యూట్యూబ్​స్టోరీ రైటర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాయదుర్గం ఇన్​స్పెక్టర్​వెంకన్న తెలిపిన ప్రకారం.. మణికొండ పంచవటి కాలనీలోని విక్రమ్​ హైట్స్​లో యూ ట్యూబ్​ స్టోరీ రైటర్ ​దాసరి సాయి ప్రశాంత్​(45) ఉంటున్నాడు. అతడికి పెండ్లి కాలేదు. సోమవారం మధ్యాహ్నం నుంచి బంధువులు, స్నేహితులు ఫోన్​ చేస్తున్నా అతడు స్పందించడంలేదు. 

మంగళవారం సాయంత్రం అపార్ట్​మెంట్​వాచ్​మెన్​కు మరోసారి కాల్​చేశారు. సాయి ప్రశాంత్ ​ప్లాట్​కు వెళ్లి చూడగా ఫ్యాన్​కు ఉరేసుకుని చనిపోయి కనిపించాడు. అపార్ట్​మెంట్​వాసులు పోలీసులు సమాచారం అందించారు. డెడ్ బాడీని  పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. సాయి ప్రశాంత్​ కొంతకాలంగా ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నట్టు పోలీసుల ఎంక్వైరీలో తేలింది.  ఇంట్లో ప్రశాంత్ సూసైడ్​ నోట్​లభించింది. అప్పులతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావించారు. అతని సోదరుడు కంప్లయింట్ చేయగా  కేసు నమోదు చేశామని రాయదుర్గం పోలీసులు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-24T05:13:25Z dg43tfdfdgfd