యూ ట్యూబ్ స్టోరీ రైటర్ సూసైడ్
గచ్చిబౌలి, వెలుగు : ఆర్థిక ఇబ్బందులతో ఓ యూట్యూబ్స్టోరీ రైటర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాయదుర్గం ఇన్స్పెక్టర్వెంకన్న తెలిపిన ప్రకారం.. మణికొండ పంచవటి కాలనీలోని విక్రమ్ హైట్స్లో యూ ట్యూబ్ స్టోరీ రైటర్ దాసరి సాయి ప్రశాంత్(45) ఉంటున్నాడు. అతడికి పెండ్లి కాలేదు. సోమవారం మధ్యాహ్నం నుంచి బంధువులు, స్నేహితులు ఫోన్ చేస్తున్నా అతడు స్పందించడంలేదు.
మంగళవారం సాయంత్రం అపార్ట్మెంట్వాచ్మెన్కు మరోసారి కాల్చేశారు. సాయి ప్రశాంత్ ప్లాట్కు వెళ్లి చూడగా ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయి కనిపించాడు. అపార్ట్మెంట్వాసులు పోలీసులు సమాచారం అందించారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. సాయి ప్రశాంత్ కొంతకాలంగా ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నట్టు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. ఇంట్లో ప్రశాంత్ సూసైడ్ నోట్లభించింది. అప్పులతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావించారు. అతని సోదరుడు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేశామని రాయదుర్గం పోలీసులు తెలిపారు.
©️ VIL Media Pvt Ltd. 2024-04-24T05:13:25Z dg43tfdfdgfd