యశ్తో స్క్రీన్ చేసుకోబుతున్న నయనతార
హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఇరవై ఏళ్లు దాటినా ఇప్పటికీ అదే గ్లామర్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది నయనతార. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరుస ఆఫర్స్తో దూసుకెళుతోంది నయన్. తాజాగా మరో శాండిల్ వుడ్ ప్రాజెక్టులో భాగమవుతున్నట్టు తెలుస్తోంది. ‘కేజీయఫ్’తో పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న యశ్తో ఆమె స్ర్కీన్ షేర్ చేసుకోబోతోందట.
గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ పేరుతో రూపొందుతున్న చిత్రంలో నయనతార పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. ఈ పాత్ర కోసం ముందుగా కరీనా కపూర్ను సెలెక్ట్ చేయగా, ఆమె రిజెక్ట్ చేయడంతో నయన్ను ఎంపిక చేశారట మేకర్స్. త్వరలోనే ఈ ప్రాజెక్టులో ఆమె ఆన్ బోర్డు కానుందని తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబోతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. డ్రగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రానికి ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్స్ అప్స్’ అనేది ట్యాగ్లైన్. కె. వెంకట్ నారాయణ, యష్ నిర్మిస్తున్నారు. మరోవైపు నయనతార నటించిన 75వ మూవీ ‘టెస్ట్’ రిలీజ్కు రెడీ అవుతోంది. ఇదొక స్పోర్ట్స్ డ్రామా. క్రికెట్ బ్యాక్డ్రాప్లో రూపొందించిన ఈ చిత్రంలో మాధవన్, సిద్ధార్థ్, జై కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-06T04:00:16Z dg43tfdfdgfd