లిఫ్ట్ గుంతలో పడి పూజారి మృతి
సికింద్రాబాద్, వెలుగు: ప్రమాదవశాత్తు రన్నింగ్ లిఫ్ట్ గుంతలో పడి ఓ పూజారి మృతి చెందాడు. తుకారాంగేట్ ఇన్ స్పెక్టర్ ఆంజనేయులు తెలిపిన ప్రకారం.. బోడుప్పల్ కు చెందిన నర్సింహమూర్తి(55) పూజారిగా చేస్తుంటారు. మంగళవారం ఉదయం మారేడుపల్లి ఫాస్ట్ హైస్కూల్ వద్ద ఓ అపార్ట్మెంట్లోని ప్రీతం ఇంట్లో ఏడాది మాసికం పూజ చేసేందుకు వెళ్లాడు. అపార్ట్ మెంట్ పై అంతస్తుకు వెళ్లేందుకు గ్రౌండ్ ఫ్లోర్ లో లిఫ్ట్ కోసం చూస్తున్నాడు. లిఫ్ట్ కిందకు రాకముందే డోర్ తెరిచిన నర్సింహమూర్తి ప్రమాదవశాత్తు లిఫ్ట్ గుంతలో పడిపోయాడు. వెంటనే లిఫ్ట్ అతనిపై పడింది. దీంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు వెళ్లి డెడ్బాడీని గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ ఆంజనేయులు తెలిపారు.
©️ VIL Media Pvt Ltd. 2024-07-03T01:48:04Z dg43tfdfdgfd