వాటికి సాయి పల్లవి సర్జరీ చేయించుకుందా? శరీరంలో మార్పు గమనించారా? క్లారిటీ ఇదే!

హీరోయిన్ సాయి పల్లవి సర్జరీ చేయించుకున్నారన్న వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆమె శరీరంలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో... స్వయంగా క్లారిటీ ఇచ్చింది. 

 

హీరోయిన్స్ కి కావాల్సిన మొదటి లక్షణం అందం. చూడగానే కట్టిపడేసే ఒడ్డు పొడుగు, చక్కని రూపం ఉన్నవాళ్లను ప్రేక్షకులు ఇష్టపడతారు. వాళ్ళ ను ఆరాధిస్తారు. అయితే కేవలం అభినయంతో అభిమానులను సంపాదించుకునే హీరోయిన్స్ కూడా ఉంటారు. వారిలో సాయి పల్లవి ఒకరు. 

 

చెప్పాలంటే సాయి పల్లవి హీరోయిన్ మెటీరియల్ కాదు. పర్సనాలిటీ, బ్యూటీ పరంగా చూస్తే సాయి పల్లవి మిగతా హీరోయిన్స్ కంటే ఎక్కడో ఉంది. కానీ ఆమె సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. సాయి పల్లవి సహజ సౌందర్యాన్ని ఇష్టపడే అభిమానులు ఉన్నారు. 

సాయి పల్లవి ఈ జెనరేషన్ హీరోయిన్స్ లో చాలా ప్రత్యేకం. ఆమె దాదాపు మేకప్ లేకుండానే నటిస్తారు. గ్లామరస్ రోల్స్ కి దూరం. హీరో ఎవరైనా? రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చినా?... పాత్ర నచ్చితేనే చేస్తుంది. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే సింపుల్ గా రిజెక్ట్ చేస్తుంది. 

 

అయితే సాయి పల్లవి సర్జరీ చేయించుకున్నారన్న ఓ వార్త తెరపైకి వచ్చింది. అందం కోసం చాలా మంది హీరోయిన్స్ శరీరంలోని కొన్ని భాగాలకు సర్జరీ చేయించుకున్నారు. అలాగే సాయి పల్లవి సర్జరీ చేయించుకున్నారన్న చర్చ మొదలైంది. 

సాయి పల్లవికి ముఖం నిండా మొటిమలు ఉంటాయి. మొదటి చిత్రం నుండే సాయి పల్లవి మొటిమలతో కనిపిస్తుంది. ప్రస్తుతం సాయి పల్లవిని చూస్తే మొటిమలు లేవు. గతంతో పోల్చితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. వాటికి చికిత్స తీసుకున్నారా? మీ ముఖాన ఉండాల్సిన మొటిమలు ఏమయ్యాయని? అడగ్గా ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చింది. 

 

ప్రేమమ్ మూవీ టైం లో నా ముఖం మీద ఎక్కువగా మొటిమలు ఉండేవి. నాకు ఆ చిత్రంలో ఆఫర్ రావడానికి కారణం కూడా మొటిమలే. ఇప్పుడు నా ముఖం మీద మొటిమలు లేవు. అందుకు ఏదైనా చికిత్స తీసుకున్నారా? థెరపీ వాడారా? అని అడుగుతున్నారు. నిజానికి నేను ఎలాంటి చికిత్స తీసుకోలేదు. 

టీనేజ్ అమ్మాయిలకు మొటిమలు రావడం సాధారణం. వాటికి చికిత్స అవసరం లేదు. వయసు పెరిగేకొద్దీ వాటంతటికి అవే పోతాయి. నేను ఆర్గానిక్ ఫుడ్, అలోవెరా జెల్ వాడతాను. అందుకే నా జుట్టు ఒత్తుగా ఉంటుంది... అని సాయి పల్లవి చెప్పుకొచ్చారు. 

 

సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్యకు జంటగా తండేల్ మూవీ చేస్తుంది. ఈ చిత్రం చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. సాయి పల్లవి చేతిలో ఉన్న భారీ ఆఫర్ రామాయణం. రన్బీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా సాయి పల్లవి సీత పాత్ర చేస్తుంది. 

2024-05-02T01:54:25Z dg43tfdfdgfd