వేల మంది అమ్మాయిలతో ఎంపీ అశ్లీల వీడియోలు.. హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పలు సమస్యలపై తన గొంతు విప్పుతూ ఉంటుంది సినీ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur). సినీ ఇండస్ట్రీతో పాటు తాజా రాజకీయాల పరిణామాలపై కూడా స్పందిస్తూ ఓపెన్ కామెంట్స్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా బర్నింగ్ టాపిక్ అయిన ప్రజల్వ్ రేవణ్ణ అంశంపై రియాక్ట్ అవుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. జేడీఎస్ యువనేత, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న సమయంలో పూనమ్ ఓ సంచలన వీడియో పోస్ట్ చేసింది.

వేలాది మంది మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసే ఇలాంటి దుర్మార్గులను వదిలిపెట్టొద్దని, ఇలాంటి వాళ్లను ఓటు వేస్తే దేశంలో ఆడబిడ్డలకు రక్షణ ఉండదని చెప్పింది. ఒక మంత్రి కొడుకు ఫోన్ ట్యాపింగ్‌ చేసి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడితే.. మరో మంత్రి కొడుకు అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని చెబుతూ ఫైర్ అయింది. ఓ మంత్రి కుమారుడైన ప్రజ్వల్ రేవణ్ణ 2,800 మంది మహళలను లైంగిక వేధింపులకు గురిచేసి, బలవంతంగా అశ్లీల వీడియోలు చాలా దారుణమైన విషయమని చెప్పింది.

డబ్బు, అధికారం ఉన్న అతన్ని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారని, ఇప్పుడతను జర్మనీలో హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పిన పూనమ్.. అతడికి శిక్ష పడుతుందా? లేదా అని కూడా చెప్పలేమంటూ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది. మీరందరికీ చేతులు జోడించి ప్రార్ధిస్తున్నా ఇలాంటి నీచుడికి ఓటు వేయొద్దు. ఎవరికి ఓటు వేయాలో ఆలోచించండి, మహిళలకు రక్షణ కల్పించే వారికే ఓటు వేయండి అని చెప్పింది. కాగా.. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దారుణాలపై కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేగడంతో జేడీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.

2024-04-30T09:37:12Z dg43tfdfdgfd