శంకర్ భారీ స్కెచ్.. తదుపరి మూడు చిత్రాల గురించి హింట్, అన్నీ విజువల్ వండర్సే..

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. జూలై 12న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శంకర్ తన తదుపరి చిత్రాల గురించి హింట్ ఇచ్చారు. భారతీయుడు 2 రిలీజ్ అయ్యాక శంకర్ రాంచరణ్ తో తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రాన్ని పూర్తి చేయనున్నారు. 

ఆ తర్వాత మూడు భారీ చిత్రాలు చేయాలనేది తన డ్రీం అని శంకర్ తెలిపారు. ఆ ముందు చిత్రాల నేపథ్యం గురించి కూడా శంకర్ హింట్ ఇచ్చారు. ఈ మూడు చిత్రాలకు భారీగా విజువల్ ఎఫెక్ట్స్ అవసరం. టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉండే చిత్రాలు అవి అని శంకర్ అన్నారు. 

గేమ్ ఛేంజర్ తర్వాత చారిత్రాత్మక నేపథ్యం ఉన్న భారీ చిత్రాన్ని ప్రారంభిస్తానని శంకర్ అన్నారు. ఆ తర్వాత జేమ్స్ బాండ్ తరహాలో సాగే భారీ యాక్షన్ చిత్రం చేస్తానని అన్నారు. ఈ చిత్రం జేమ్స్ బాండ్ స్టైల్ లో మాత్రమే ఉంటుంది. కానీ జేమ్స్ బాండ్ మూవీ కాదు అని శంకర్ తెలిపారు. 

ఆ తర్వాత 2012 యుగాంతం అనే హాలీవుడ్ మూవీ తరహాలో భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం చేస్తానని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో ఈ చిత్రాలని తెరకెక్కిస్తానని శంకర్ అన్నారు. శంకర్ లాంటి డైరెక్టర్ ముందు భారీ చిత్రాలని ఫిక్స్ చేశారు అంటే నెక్స్ట్ పదేళ్ల వరకు ఆయన ప్లానింగ్ రెడీ అయిపోయినట్లే. 

2024-07-03T16:59:24Z dg43tfdfdgfd