శిరీష్‌ భరద్వాజ్‌ చివరగా కూతురుని చూడాలనుకున్నాడు.. అడిగితే పంపించలేదు.. తల్లి సంచలన వ్యాఖ్యలు

శ్రీజ మాజీ భర్త శిరీష్‌ భరద్వాజ్‌ గత నెలలో అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూతురు నివృతిని చూడాలనుకున్నాడట. కానీ పంపించలేదట. 

 

శ్రీజ మొదటి భర్త శిరీష్‌ భరద్వాజ్‌ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశాడు. ఆయన లివర్స్, లంగ్స్ పాడవడంతో కన్నుమూసినట్టు ప్రచారం జరిగింది. కానీ గుండెపోటు(కార్డియక్‌ అరెస్ట్)తో చనిపోయినట్టు శిరీష్‌ భరద్వాజ్‌ తల్లి స్పష్టం చేసింది. తాను తాగుడుకి బానిసై చనిపోయినట్టు వస్తోన్న వార్తలను ఆమె ఖండించింది. అందరు తాగినట్టే తాగేవాడు తప్ప, బాధతో ఎక్కువగా తాగేవాడు కాదని తెలిపింది. 

ఇదిలా ఉంటే చనిపోవడానికి నెల రోజుల వరకు బాగానే ఉన్నాడని, దుబాయ్‌లో బర్త్ డే కూడా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. అక్కడి నుంచి వచ్చాక హెల్త్ సమస్య వచ్చిందని, దీంతో జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందాడని చెప్పింది శిరీష్‌ మదర్‌.  నెల రోజులుగా ఆ ఆసుపత్రిలోనే ఉన్నాడని, ఉన్నట్టుండి కార్డియక్‌ అరెస్ట్ కావడంతో మృతి చెందనట్టు తెలిపింది శిరీష్‌ తల్లి. లంగ్స్, లివర్‌ డ్యామేజీతో చనిపోయాడనే వార్తలు నిజం,  అలాగే ఏఐజీలో ఛాయిన్‌ చేశారని, చెన్నైలో ట్రీట్‌ మెంట్‌ తీసుకున్నాడని వస్తోన్న వార్తలు నిజం కావని తెలిపింది శిరీష్‌ తల్లి. 

 

ఈ సందర్బంగా తన కొడుకు లేకపోవడం పట్ల ఆమె బాధని వ్యక్తం చేసింది. అయితే ఆయనకు కొడుకు ఉన్నాడనే రూమర్‌ని ఖండించిన ఆమె, అవన్నీ అబద్దమని, కూతురు నివృతి మాత్రమే ఉందని, ఇప్పుడు శ్రీజ ఫ్యామిలీ(చిరంజీవి ఫ్యామిలీ)తోనే ఉంటున్నట్టు చెప్పింది.  శిరీష్‌కి కూతురు అంటే ఎంతో ఇష్టమని, అచ్చు శిరీష్‌లాగే ఉంటుందని, నివృతిని చూడాలనిపిస్తుందని తెలిపింది. పంపిస్తే చూడాలని ఉందని తన ఆవేదన వ్యక్తం చేసింది. 

 

శిరీష్‌ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూతురుని చూడాలనిపిస్తుందని అడిగాడట. దీంతో పాపని పంపించమని  శ్రీజ, మెగా ఫ్యామిలీని అడిగారట. తెలిసిన వాళ్ల ద్వారా అడిగిపించామని, కానీ వాళ్లు పంపించలేదని తెలిపింది శిరీష్‌ తల్లి. దీంతో కొడుకు ఎంతో బాధపడ్డాడని చెప్పింది. ఏ తండ్రి అయినా కూతురుని దూరం చేసుకోవాలనుకోడని చెప్పింది. నివృతి మా వంశం, మా పాప, నా మొదటి మనవరాలు, ఆమెని చూడాలని నాకూ ఉంటుంది. కానీ పంపించడం లేదని, పెద్ద వాళ్లు కదా అని చెప్పింది. ఆమెని కలిస్తే, పాపతో మాట్లాడాల్సి వస్తే ఏం చెబుతారని అడగ్గా, మీ నాన్నగారు ఇది, నేను నానమ్మని, ఇది మన ఫ్యామిలీ` అని చెబుతా అని తెలిపింది శిరీష్‌ తల్లి.  

శ్రీజ, శిరీష్‌ విడిపోవడానికి సంబంధించిన ఆమె మాట్లాడుతూ, కారణాలు తెలియదని, అది గుర్తు లేదని, చాలా ఏళ్లు అయిపోయిందని తెలిపింది. శ్రీజపై ప్రశంసలు కురిపించింది. మంచి అమ్మాయని, చాలా ఇన్నోసెంట్‌ అని, బాగా ఉండేదని తెలిపింది. విడిపోవడానికి కారణాలు మాత్రం చెప్పేందుకు ఆసక్తి చూపించలేదు, తన మనవరాలిని మాత్రం చూడాలని ఉందనే కోరికని వెల్లడించింది శిరీష తల్లి. 

2024-07-03T10:58:41Z dg43tfdfdgfd