శ్రీరాముని ఆశీస్సులతోనే స్పైసెస్​ బోర్డు సాకారమైంది : ధర్మపురి అర్వింద్

శ్రీరాముని ఆశీస్సులతోనే స్పైసెస్​ బోర్డు సాకారమైంది : ధర్మపురి అర్వింద్

నందిపేట, వెలుగు: జిల్లాలో పసుపు రైతులకు ఇచ్చిన హామీ మేరకు స్పైసెస్ బోర్డు ఆ అయోధ్య రాముడి ఆశీస్సులతోనే సాకారమైందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. పార్లమెంట్​ ఎన్నికల్లో భాగంగా మంగళవారం నందిపేట, డొంకేశ్వర్​ మండలాల్లో  ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డి తో కలిసి ప్రచారం నిర్వహించారు.  నందిపేట నందిచౌక్​ వద్ద నిర్వహించిన కార్నర్​మీటింగ్​ లో ఆయన మాట్లాడుతూ..  70 ఏళ్లలో గుర్తుకు రాని గల్ఫ్​ బోర్డు కాంగ్రెస్​ పార్టీకి ఇప్పుడు గుర్తుకు రావడం సిగ్గుచేటన్నారు. మోదీ విజన్​ ఉన్న నాయకుడని, ఆయన అడుగుజాడల్లో రైతులు ముందుకు వెళ్లాలన్నారు.  

కేంద్ర హోంమంత్రిపై ఫేక్​ వీడియో సృష్టించిన  కేసులో  రేపో మాపో కాంగ్రెస్ వాళ్లే సీఎం రేవంత్ రెడ్డిని జైలుకు పంపించబోతున్నారన్నారు. ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డి మాట్లాడుతూ..  మూడు నెలల్లో పెన్షన్లు, ఇళ్లు ఇప్పించే భాద్యత నాదే అన్నారు.  ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి నిజంగా హిందువే అయితే 60 ఏళ్లుగా శ్రీరాముడిని టెంటు కింద ఎందుకు ఉంచారో చెప్పాలన్నారు.  కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, కంచెట్టి గంగాధర్​, అసెంబ్లీ కన్వీనర్​ పాలెపు రాజు, మండల అధ్యక్షుడు భూతం సాయరెడ్డి, సురేందర్​, వీరేశం, రమేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-01T04:55:56Z dg43tfdfdgfd