షాకిస్తున్న ఛార్మి లేటెస్ట్ లుక్.. ఇలా మారిపోయిందేంటి

హీరోయిన్ ఛార్మి గురించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో ఛార్మి శ్రీ ఆంజనేయం, మాస్, లక్ష్మీ, పౌర్ణమి, చిన్నోడు, రాఖీ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

హీరోయిన్ ఛార్మి గురించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో ఛార్మి శ్రీ ఆంజనేయం, మాస్, లక్ష్మీ, పౌర్ణమి, చిన్నోడు, రాఖీ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోల సరసన నటించే అవకాశం అందుకుంది. అయితే ఛార్మి ఎక్కువకాలం హీరోయిన్ గా కొనసాగలేకపోయింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో అవకాశం వస్తున్నప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. 

గత కొన్నేళ్లుగా ఛార్మి.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలసి సినిమా నిర్మాణంలో బిజీగా ఉంది. వీళ్ళిద్దరూ సినిమా నిర్మాణంలో పార్ట్నర్స్ అయిపోయారు.  పూరి జగన్నాద్, ఛార్మి గురించి ఎన్నో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. వారిద్దరూ ప్రొఫెషనల్ గా పార్ట్నర్స్ గా కోనసాగుతున్నారు. అదే సమయంలో పర్సనల్ లైఫ్ గురించి కూడా రూమర్స్ ఉన్నాయి. 

అయితే ఛార్మి లేటెస్ట్ లుక్ నెటిజన్లకు షాకిచ్చే విధంగా ఉంది. ఛార్మి తాజాగా బ్లాక్ డ్రెస్ ధరించిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్ లో ఛార్మి బాగా బరువు పెరిగి బొద్దుగా కనిపిస్తోంది. దీనితో నెటిజన్లు ఛార్మి లుక్ చూసి షాక్ అవుతున్నారు. ఛార్మి ఫిట్ నెస్ మీద కంట్రోల్ లేకుండా పోయినట్లు ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఈ ఫోటో లో ఛార్మి తన పెట్ ని ఎత్తుకుని కనిపిస్తోంది. ఛార్మి తరచుగా జిమ్ వర్కౌట్స్ చేస్తున్న దృశ్యాలని సోషల్ మీడియా షేర్ చేస్తూ ఉంటుంది. అయినా ఇలా బొద్దుగా ఎందుకు మారింది అంటూ అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతం ఛార్మి, పూరి జగన్నాధ్ ఇద్దరూ డబుల్ ఇస్మార్ట్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఏడాది చివర్లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి విశేషాన్ని ఛార్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.  

2024-04-19T08:45:45Z dg43tfdfdgfd