సీఎస్ శాంతి కుమారి పేరుతో ఫేక్ కాల్స్
తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సోమవారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేశారు. తన పేరు, ఫ్రొపైల్ ఫొటో ఉపయోగించి కొందరు ఇతరులకు ఫేక్ కాల్స్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు +977-984-4013103 మొబైల్ నంబర్ తో తన పేరుమీదుగా నకిలీ కాల్స్ చేస్తున్నారని సీఎస్ శాంతి కుమారి సైబర్ క్రైం కేసు నమోదు చేశారు. పోలీసులు ఈ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
©️ VIL Media Pvt Ltd. 2024-04-29T12:34:15Z dg43tfdfdgfd