చనిపోయిన తమ బంధువులను తలుచుకుని కుటుంబం సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హాథ్రస్లోని ఆస్పత్రి మార్చురీ బయట తమ బంధువు మృతదేహాన్ని చూసి ఓ వ్యక్తి విషణ్ణ వదనంతో కూర్చుని కనిపించారు.
తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో పడి ఉన్న బాధితుల వస్తువులు చిందరవందరగా పడిపోగా వాటిలో కొన్నింటిని ఒకచోటకు చేర్చారు.
భోలే బాబా సత్సంగ్ జరిగిన ప్రాంతం ఇదే. ఇక్కడి నేత చిత్తడిగా ఉండటం కూడా దుర్ఘటనలకు కారణమని అధికారులు భావిస్తున్నారు.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఫోరెన్సిక్ నిపుణుల తనిఖీలు నిర్వహించారు.
కాస్గంజ్లో కన్నీరుమున్నీరవుతున్న ఓ తల్లి
హథ్రస్లో ప్రమాదం జరిగిన ప్రాంతం
ప్రమాద ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులు, బాటిళ్లు, పేపర్లు
సత్సంగ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
చనిపోయిన వారి మృతదేహాల కోసం ఆస్పత్రి బయట వేచిచూస్తున్న బంధువులు, వారి నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు
ఓ మృతదేహం వద్ద రోదిస్తున్న వ్యక్తి
హాథ్రస్ ఘటనలో సోక్నా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)