హీరో సిద్దార్థ్ పెళ్లి చేసుకోబోతున్న అదితి రావ్ హైదరీ మొదటి భర్త ఎవరో తెలుసా?

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరీ, (Siddharth-Aditi Rao Hydari) హీరో సిద్ధార్ద్ ప్రేమించుకుంటున్నారనే టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా సిద్దార్థ్- అదితిరావు హైదరీ సహజీవనం చేస్తున్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో.. తాజాగా తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయ మండపంలో వీరి పెళ్లి జరిగిందని రూమర్స్ వినిపించాయి.
అది పెళ్లికాదని.. కేవలం ఎంగేజ్‌మెంట్ అని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఈ ఇద్దరూ తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాము నిశ్చితార్థం చేసుకున్నామని ధృవీకరించారు. అంతేకాదు కొన్ని ఫోటోలను కూడా పంచుకున్నారు. దీంతో ఇవి వైరల్ అవుతున్నాయి
అయితే అదితి మొదటి భర్త గురించి మీకు తెలుసా?అదితి రావ్ హైదరీ మొదటి భర్త సినిమాల్లో తన కెరీర్‌ను ప్రారంభించాడు. కానీ సినిమాల్లో మాత్రం గుర్తింపు పొందలేకపోయాడు. కానీ OTTలో అతడికి పెద్ద గుర్తింపు వచ్చింది.
అదితి రావు హైదరీ మొదటి వివాహం ప్రముఖ నటుడు సత్యదీప్ మిశ్రాతో 2002లో జరిగింది. పెళ్లి సమయానికి చాలా ఏళ్లు తమ పెళ్లి గురించి ఇంటర్వ్యూలలో ఎక్కడా ప్రస్తావించని అదితీ..2013లో ఓ ఇంటర్వ్యూలో తాము విడాకులు తీసుకున్నట్లు తెలిపింది.
సత్యదీప్ మిశ్రా సినీ ఇండస్ట్రీలోకి రాకముందు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS)ఆఫసర్ గా, కార్పోరేట్ ప్రపంచంలో లాయర్‌గా కూడా చాలా కాలం పనిచేశారు.
అదితి మొదటి భర్త సత్యదీప్ ముంబైలో అడ్వర్టైజింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించాడు. అతని మొదటి సినిమా షూటింగ్ 'చిల్లర్ పార్టీ'. కానీ 'నో వన్ కిల్డ్ జెస్సికా' సినిమాతో అతనికి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో అతను రాణి ముఖర్జీతో కలిసి కనిపించాడు. ఈ సినిమా తర్వాత అతని నట జీవితం ఊపందుకుంది.
సత్యదీప్‌కి సినిమాల్లో అంతగా గుర్తింపు రాకపోవడంతో OTT వైపు మొగ్గు చూపాడు. అతని కెరీర్‌లో ఇప్పటివరకు 'ఇల్లీగల్ సీజన్ వన్', MX ప్లేయర్ కోసం 'థింకిస్థాన్', 'జెహనాబాద్ - లవ్ అండ్ వార్', నెట్‌ఫ్లిక్స్ షో 'మసాబా మసాబా'లో కనిపించాడు.
అదితి రావ్ హైదరీతో విడాకుల తర్వాత సత్యదీప్ మిశ్రా.. 2013 జనవరి 27న అగ్ర నటి నీనా గుప్తా కుమార్తె మసాబా గుప్తాను వివాహం చేసుకున్నాడు..ఇది మసాబాకు కూడా రెండో వివాహం. మసాబా మొదటి వివాహం నిర్మాత మధు మంతెనతో జరిగింది.

2024-03-28T17:14:54Z dg43tfdfdgfd