Bellamkonda Sai Srinivas | టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఛత్రపతి వంటి భారీ డిజాస్టర్ తర్వాత టైసన్ నాయుడు అనే సినిమా చేస్తున్న సాయి శ్రీనివాస్ తాజాగా మరో ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశాడు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా ప్రాజెక్ట్ #BSS11. ఈ ప్రాజెక్ట్ నేడు అధికారికంగా లాంచ్ అయ్యింది.
షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించనున్నాడు. హారర్ మిస్టరీ కాన్సెప్ట్తో వస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించబోతుంది. ఇక ఈ మూవీ లాంచ్కి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక టైసన్ నాయుడు సినిమా విషయానికి వస్తే.. భీమ్లానాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. 14 రీల్స్ బ్యానర్పై భారీ బడ్జెట్ తో రామ్ ఆచంట – గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనే సీరియస్ పోలీస్ పాత్రలో బెల్లంకొండ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
ఇవి కూడా చూడండి..
2024-07-01T10:13:13Z dg43tfdfdgfd