శ్రీరాముడితో పాటు భరత శత్రుజ్ఞులు కొలువై ఉన్న ఏకైక దేవాలయం ఇదే
మన దేశంలో చాలా రామాలయాలు చూసి ఉంటాం, లేదా వాటి గురించి వినే ఉంటాం కానీ ఇక్కడ మనం చూసే రామాలయం అన్నిటితో పోల్చుకుంటే కొంత విభిన్నంగా ఉంటుంది. ఎందుకంటే మనకు రామాలయం అనగానే గుర్తుకొచ్చే దేవుళ్ళు రాముడు, సీత,లక్ష్మణుడు హనుమంతుడు, మాత్రమే గుర్తుకొస్తారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో దాదాపు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రామాలయంలో రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, భరత శత్రజ్ఞులతో తోపాటు హనుమంతుడు, గరుగ్మంతుడు ఒకే రాయి పైన వెలవడడం ఈ ఆలయం ప్రత్యేకత. ఇక ఇదే విషయంపై ఆలయ పూజారి రామకృష్ణ చార్యులు లోకల్ 18 తో మాట్లాడుతూ..ఈ దేవాలయ అర్చకత్వం అనేది పూర్వీకుల నుండి వస్తుందని దాదాపు 70 సంవత్సరాల నుండి ఈ రాములవారికి మేము పూజలు చేస్తున్నామని,వారి పూర్వీకులు చెప్పిన ప్రకారం దాదాపు 300 సంవత్సరాల క్రితం ఆలయము, ఈ ఆలయంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా శ్రీరాముడు తన ముగ్గురు తమ్ముళ్ళతో స్వయంభుగా వెలిశాడు.. ఈ స్వామివారికి పూజలు అందించడం వారి వంశం పూర్వజన్మ సుకృతం అని గత డెబ్బై సంవత్సరాల నుండి స్వామివారికి వారే స్వయంగా నిత్య కైంకర్యాలు సమర్పిస్తున్నారని గ్రామ పెద్దల ఇతరుల దాతల ద్వారా దేవాలయానికి కొంచెం మరమ్మత్తులు చేయించారని ఈ స్వామి వారిని మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుస్తారని గ్రామ ప్రజలు ఏ శుభకార్యం చేయాలన్నా ఈ శ్రీరాముని దర్శించుకున్న తర్వాతే ఏ కార్యక్రమాన్నా మొదలు పెడతారని చెప్పారు. ఇది ఎంత పురాతనమైందో తెలుసుకోవడానికి పురావర్త శాఖ వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ వారికి కూడా అంతుచిక్కలేదని ఈ దేవాలయంలో రాముడు లక్ష్మణుడు భరత శత్రజ్ఞులతో స్వయంభుగా వెలసిన దేవాలయం దేశంలోనే ఇదొక్కటే ఉందన్నారు.
2024-07-02T04:50:16Z
బ్రహ్మముడికి అంటే ఏమిటి? దానికి అంత ప్రాముఖ్యత ఉందా!
హిందువులు వివాహ వేడుకలలో అనేక ఆచారాలు, సంప్రదాయాలతో పాటిస్తుంటారు. తాళిబొట్టు కట్టడం, మెట్టెలు పెట్టడం, ఏడడుగులు నడవడం వంటి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఆచారాల ద్వారా ఇద్దరు వ్యక్తులు పవిత్రమైన అనుబంధంలోకి అడుగు పెడతారు. హిందూ వివాహాల్లో అలాంటి ఒక ముఖ్యమైన సంప్రదాయం బ్రహ్మముడి (గత్బంధన్). ఈ ఆచారంలో వధువు దుపట్టాను వరుడు ధరించే పింక్ స్కార్ఫ్/కండువా/పంచెతో కలిపి ముడి వేస్తారు. ఇది వారి ఐక్యతను సూచిస్తుంది. జీవితాంతం కలిసి ఉండాలనే కోరికను సూచిస్తుంది. బ్రహ్మముడి ప్రాముఖ్యత : బ్రహ్మముడి అనేది జీవితాన్ని కలిసి గడపాలని నిర్ణయించుకున్న ఇద్దరి వ్యక్తుల మధ్య ఏర్పడిన పవిత్రమైన బంధానికి సింబల్గా నిలుస్తుంది. ఈ ఆచారంలో వరుడి కండువా (పొడవైన స్కార్ఫ్), మహిళ దుపట్టాను ఒక పవిత్రమైన దారంతో కలిపి ముడి వేస్తారు. ఈ ముడి ద్వారా తాము లైఫ్ లాంగ్ ఒకటిగా ఉంటామని వధూవరులు ప్రమాణం చేస్తారు. దీని ద్వారా ఒకరినొకరు గౌరవించుకుంటామని, ప్రేమించుకుంటామని కూడా ప్రామిస్ చేస్తారు. ఒక యువకుడు, ఒక యువతి ఒకరితో ఒకరు జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ బంధాన్ని పవిత్రంగా గుర్తించడానికి ఒక ముడిని కడతారు. ఇది వధూవరుల మధ్య జీవితాంతం నెలకొనే అవినాభావ బంధాన్ని సూచిస్తుంది. హిందూ వివాహాల్లో బ్రహ్మముడి : హిందూ వివాహంలో, వరుడి సోదరి బ్రహ్మముడిని కడుతుంది. ఈ ముడి ద్వారా వధువును కొత్త కుటుంబ సభ్యురాలిగా అంగీకరిస్తున్నామని వరుడు, అతడి కుటుంబ సభ్యులు తెలియజేస్తారు. పెళ్లిలో వధూవరులు తమ మెడల చుట్టూ కండువాలను మార్చుకోవడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ స్కార్ఫ్స్ వారి మధ్య ఏర్పడిన శాశ్వత బంధాన్ని సూచిస్తాయి. వరుడు తన భార్యకు కండువాను బహుమతిగా ఇవ్వడం ద్వారా, ఆమెను తన జీవితంలో ఒక భాగంగా స్వీకరిస్తానని, ఎల్లప్పుడూ రక్షిస్తానని, ఆమెను ప్రేమిస్తానని వాగ్దానం చేస్తాడు. వధువు తన భర్తకు తన స్కార్ఫ్ను బహుమతిగా ఇవ్వడం ద్వారా, అతడిని గౌరవిస్తానని, అతడికి విధేయురాలిగా ఉంటానని, అతనితో కలిసి జీవితాన్ని పంచుకుంటానని వాగ్దానం చేస్తుంది. మరణం వరకు ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, గౌరవించుకోవడానికి, మద్దతు ఇవ్వడానికి వారు ప్రమాణం కూడా చేస్తారు. ఈ ఆచారం జరిగిన తర్వాత, కొత్త దంపతులు తాము మానసికంగా, భావోద్వేగపరంగా, శారీరకంగా ఒకరితో ఒకరు కలిసి ఉంటామని నమ్ముతారు. ఇది ఒకే ఆత్మగా మారిన ఇద్దరి వ్యక్తుల సంబంధాన్ని సూచిస్తుంది. బ్రహ్మముడి ద్వారా, వధూవరులు తమ ఆనందాలు, బాధలు, ఆస్తులు, బాధ్యతలను పంచుకునే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటారు. బ్రహ్మముడి సమయంలో వరుడి పొడవైన కండువాకు ఐదు పవిత్ర వస్తువులు జోడిస్తారు. అవి నాణెం, పువ్వు, బియ్యం, పసుపు, దుర్వా గడ్డి. ఈ వస్తువులు వారి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తాయి. నాణెం డబ్బుపై ప్రతి ఒక్కరికీ సమాన హక్కు ఉందని, అందరి అవసరాలకు అనుగుణంగా దానిని ఉపయోగించాలని సూచిస్తుంది. పూలు, వధూవరులు ఒకరితో ఒకరు సంతృప్తిగా ఉంటారని సూచిస్తాయి. పసుపు, వధూవరులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తుంది. దుర్వా గడ్డిలాగా వధూవరులు ఇద్దరూ చిర యువ, ఉత్సాహంగా ఉండాలని సూచిస్తుంది. బియ్యం , జంటలో ఎవరూ ఆకలితో బాధపడకుండా ఉండేంతగా తినాలని సూచిస్తుంది. మూడు ముడులు : బ్రహ్మముడిలో మూడు ముడుల్లో ప్రతి ముడికి ఓ ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. మొదటి ముడి హక్కులను సూచిస్తుంది. దంపతులు ఒకరిపై ఒకరు హక్కులు కలిగి ఉంటారని ఈ ముడి అర్థం. రెండో ముడి బంధాన్ని తెలియజేస్తుంది. మూడో ముడి, ప్రపంచాన్ని సూచిస్తుంది. ప్రపంచంలోని అందరినీ గౌరవించాలని ఈ ముడి తెలుపుతుంది. అగ్ని దేవుడు పవిత్రత, శక్తికి చిహ్నం. కొత్త దంపతులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా, దేవుడి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు.
2024-07-05T13:03:08Z
Vijay Devarakonda: కల్కి కోసం.. విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?
విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఈ పేరును ప్రస్తుతమున్న జనరేషన్ కు పెద్దగా పరిచయం అవసరంలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా... ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. రౌడీ హీరోగా ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యాడు. ముందుగా చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ.. ఆ తర్వాత పెళ్లి చూపులు సిసినిమాతో తొలి హిట్ కొట్టాడు. గీతా గోవిందం, అర్జున్ రెడ్డి సినిమాలు విజయ్ దేవరకొండ కెరీర్ను మలుపు తిప్పాయి. ఇక ఆ తర్వాత... విజయ్ వెనక్కి తిరిగి చేసుకోలేదు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో స్పెషల్ రోల్ చేశాడు. జూన్ 27న విడుదలైన కల్కి 2898 AD చిత్రం విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 298.5 కోట్ల రూపాయలను వసూలు చేసి అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరియు దిశా పటానీ వంటి అనేక మంది తారలు ఉన్నారు. ప్రధాన తారాగణంతో పాటు, ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రామ్ గోపాల్ వర్మ, ఎస్ఎస్ రాజమౌళి , ఫరియా అబ్దుల్లా అతిధి పాత్రలు పోషించారు . ఈ అతిథి పాత్రలు అభిమానులలో భారీగా ఉత్సాహాన్ని సృష్టించాయి. ప్రస్తుతం భారతదేశంలో మోస్ట్ ట్రెండింగ్ నటుల్లో ఒకరైన విజయ్ దేవరకొండ ఈ సినిమాలో అర్జునుడిగా కీలక పాత్రలో కనిపించాడు. అయితే విజయ్ ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సినిమాలోని చాలా మంది అతిథి నటులు తమ పాత్రలకు ఎటువంటి ఫీజు లేకుండా పనిచేశారు. ఇందులో విజయ్ కూడా.. ఒకడు. విజయ్ కూడా కల్కి కోసం ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు. అయితే కల్కిలో విజయ్ రోల్ చిన్నది. కానీ కల్కి 2898 AD పార్ట్ 2లో మాత్రం విజయ్ దేవరకొండ పాత్ర ఎక్కువగా ఉంటుందని సమాచారం. ముఖ్యంగా కొన్ని కీలకమైన ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లలో పొడిగించిన పాత్రను విజయ్ పోషించవచ్చని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్, సినిమాలో తన నటనకు 150 కోట్లు వసూలు చేశాడు, మొత్తం బడ్జెట్లో 25%.లీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరైన దీపికా పదుకొనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో తన పాత్ర కోసం 20 కోట్లు తీసుకుందని నివేదించబడింది. అమితాబ్ బచ్చన్: లెజెండరీ అమితాబ్ బచ్చన్ కూడా తన పాత్ర కోసం 20 కోట్లు వసూలు చేశాడు.
2024-06-30T06:42:44Z