Meera Nandan: సింపుల్గా గుళ్లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్
నటి మీరా నందన్.. అంటే చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు. కానీ, జై బోలో తెలంగాణ సినిమాలో హీరోయిన్ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మీరా నందన్. ఆ సినిమా మంచి విజయం సాధించినా.. తరువాత ఆమె పెద్దగా సినిమాలు చేయలేదు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. తాజాగా పెళ్లి చేసుకున్నారు.
యూకేలో చార్టెడ్ అకౌంటెంట్ గా చేస్తున్న శ్రీజు అనే వ్యక్తిని ఆమె వివాహం చేసుకున్నారు. అది కూడా చాల సింపుల్ గా గుడిలో చేసుకున్నారు. ప్రముఖ గురువాయుర్ దేవాలయంలో ఈ జంట ఏడడుగులు నడిచి.. వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం మీరా నందన్ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన ప్రముఖులు, నెటిజన్స్ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
©️ VIL Media Pvt Ltd. 2024-06-29T05:13:15Z dg43tfdfdgfd