Trending:


హీరో రాజ్‌తరుణ్‌పై ప్రియురాలి ఫిర్యాదు

టాలీవుడ్‌ హీరో రాజ్‌తరుణ్‌ గతంలో రెడ్‌హ్యాండెడ్‌గా డ్రగ్స్‌ తీసుకుంటూ తన నివాసంలో పోలీసులకు దొరికిన విషయం మరవకముందే... తాజా గా మరో వివాదంలో చిక్కుకున్నాడు.


Robot: ఇదేం వింత భయ్యా.. పని ఒత్తిడిని భరించలేక రోబో ఏంచేసిందో తెలుసా..?

Robo work pressure: సౌత్ కొరియాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంత మంది మనుషుల మాదిరిగా రోబోలు కూడా ఇదేం పని చేయడంరా బాబు అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


కొత్తగా పెళ్లైంది.. అత్తవారింట్లో అడుగు పెట్టగానే విగత జీవుడిగా భర్త.. ఏం జరిగిందంటే?

Wedding Tragedy: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది అత్యంత మధురమైన ఘట్టం. యువతీ యువకులు ఎన్నో కలలు, ఆశలతో ఈ బంధంలోకి అడుగు పెడతారు. వివాహ వేడుక ముగియగానే కొత్త దంపతులు ఆనందకరమైన క్షణాలు గడపాలని ఆశపడతారు. అయితే ఇటీవల ఒక వధువుకు మాత్రం పెళ్లి ముగిసిన కొంత సేపటికే పెను విషాదం ఎదురైంది. ఆమె మెడలో తాళి కట్టిన భర్త వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ముగిశాక ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో వధువు గుండెలవిసేలా రోదిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఇటావా జిల్లా, రత్నపుర...


ఇయ్యాల కాళేశ్వరంపై అధికారుల అఫిడవిట్ల పరిశీలన!

ఇయ్యాల కాళేశ్వరంపై అధికారుల అఫిడవిట్ల పరిశీలన! మూడో విడత విచారణ కోసం హైదరాబాద్​కు వచ్చిన జస్టిస్​ ఘోష్​ హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణలో భాగంగా జ్యుడీషియల్​​ కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పినాకి చంద్ర ఘోష్.. అధికారులు సమర్పించిన​ అఫిడవిట్లను పరిశీలించనున్నారు. మూడో విడత విచారణ కోసం ఆయన​ శుక్రవారం హైదరాబాద్​కు వచ్చారు...


Anushka: ముగ్గురు స్టార్ హీరోలతో ఎఫైర్ పెట్టుకున్న అనుష్క.. ఏకంగా ఆయనతోనే..!

టాలివుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం. గత రెండు దశాబ్దాలుగా ఆమెకు సంబంధించి చిన్న చిన్న రూమర్స్ తప్ప పెద్ద కాంట్రవర్సీలు ఏం లేవు. రెబల్ట్ స్టార్ ప్రభాస్‌తో అనుష్క రిలేషన్ నడుపుతోందని తెగు వార్తలు వచ్చాయి. అయితే వాటిలో నిజం లేదని అర్థం అవుతుంది. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో కంటే ముందు మరో ముగ్గురు స్టార్స్‌తో ఎఫైర్ నడిపినట్లు నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. స్వీటీ తన సుదీర్ఘ కెరీర్‌లో స్టార్ హీరోస్‌తో పాటుగా, సాంకేతిక నిపుణులతో ఎఫైర్స్ నడిపారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్, తాను ఫ్రెండ్స్ అని ఎన్నిసార్లు చెప్పినా సరే అనుష్క రిలేషన్‌షిప్‌లో ఉందంటూ నెటిజన్లు మాత్రం కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. బాహుబలి సినిమా టైమ్‌లో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు వచ్చాయి. ప్రభాస్‌తో పాటుగా హీరో గోపీచంద్‌తో కూడా లవ్ ట్రాక్ నడిపారనే వార్తలు వైరల్ అయ్యాయి. వీరిద్దరి కాంబోలో వచ్చి లక్ష్యం సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత శౌర్యం సినిమాలో కలిసి నటించి మరో హిట్ కొట్టారు. దీంతో వీరిద్దరూ లవ్‌లో ఉన్నారనే వార్తలు రూమర్స్ వచ్చాయి. అయితే ఈ పుకార్లకు వీరిద్దరూ స్పందించలేదు. 2013లో గోపీచంద్ హీరో శ్రీకాంత్ మేనకోడలిని వివాహం చేసుకోవడంతో ఈ రూమర్స్‌కి చెక్ పడింది. అనుష్క డెబ్యూ మూవీ సూపర్. నాగార్జునతో అనుష్క మంచి అనుబంధం కలిగి ఉంది. వీరి కాంబోలో చాలా సినిమాలే వచ్చాయి. కింగ్ సినిమాలో నాగార్జున కోసం అనుష్క స్పెషల్ సాంగ్ చేయడంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని పుకార్లు వచ్చాయి. అయితే కొద్ది రోజులకు వీటికి కూడా బ్రేక్ పడింది. రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ కె కె సెంథిల్ కుమార్, అనుష్క శెట్టి కూడా ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. సెంథిల్ పెద్దవాళ్లతో మాట్లాడి స్వీటీని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట. ఆ తర్వాత సెంథిల్ రూహి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రభాస్, నాగార్జున, గోపీచంద్, సెంథిల్ కుమార్ లతో అనుష్క ఎఫైర్ నడిపారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఆయాకాలాల్లో అనుష్క ఈ రూమర్స్ ఫేస్ చేశారు.


నెయ్యిలో ముంచి, ఇడ్లీలన్నీ మాయం..ఎన్టీఆర్ తిండి పిచ్చి గురించి మహేష్ బాబుకి కూడా తెలిసిపోయింది

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు అని చాలా మందికి తెలుసు. బిర్యానీ లాంటి వంటకాలని తారక్ ఎంతగానో ఇష్టపడతారు. తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి ఈ అలవాటు వచ్చింది. టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు అని చాలా మందికి తెలుసు. బిర్యానీ లాంటి వంటకాలని తారక్ ఎంతగానో ఇష్టపడతారు. తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి ఈ అలవాటు వచ్చింది అని ఎన్టీఆర్ ఓ సందర్భంలో తెలిపారు. ఒక సారి ఎన్టీఆర్ కీరవాణితో తనకి ఇష్టమైన...


Sonakshi Sinha: ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై‌ సోనాక్షి సిన్హా రియాక్షన్‌ - ఇకపై అసలు హాస్పిటల్‌కే వెళ్లం...

Sonakshi Sinha Reacts on her Pregnancy Rumours: సోనాక్షి సిన్హా ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. తన ప్రియుడు, మూవీ రైటర్‌ జహీర్ ఇక్బాల్‌ని పెద్దల సమక్షంలో వైవాహిక (Sonakshi Sinha Wedding) బంధంలోకి అడుగుపెట్టింది. జూన్‌ 23న జహీర్‌తో ఏడడుగులు వేసింది. ఇటీవల ఈ కొత్త జంట హనీమూన్‌కి కూడా వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అయ్యాయి. అయితే పెళ్లయిన వారంలో రోజులకే సోనాక్షి ఆస్పత్రిలో కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్‌ అంటూ...


Hyderabad | ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో గంజాయి కలకలం

Hyderabad | హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో గంజాయి కలకలం రేపింది. ఆరుగురు మెడికోలు గంజాయి సేవిస్తున్నట్లుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు మెడికోలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇద్దరు డ్రగ్‌ పెడ్లర్లను అరెస్టు చేశారు.


దుల్కర్ కమిటైన మరొ తెలుగు సినిమా, యాక్షన్ డైరక్టర్ తో ...

దుల్కర్ సల్మాన్ కు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. మళయాళంలో సినిమాలు చేస్తూనే ఇక్కడా తెలుగులో సినిమాలు కమిటవ్వుతున్నారు. దుల్కర్ ఉన్నాడంటే మినిమం గ్యారెంటీ అనే పేరు తెచ్చుకున్నారు. దానికి తోడు ఆయన కథల ఎంపిక కూడా డిఫరెంట్ గా ఉంటుంది. డబ్బింగ్ మూవీ కనులు కనులు దోచాయంటే నుంచి వరసగా ఆయన సినిమాలో తెలుగులో కూడా కమర్షియల్ గా వర్కౌట్ అవుతున్నాయి. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ చేస్తున్నాడు. సితార...


Tollywood: ఫ్రెండ్ కూతురుతో టాలీవుడ్ స్టార్ హీరో రొమాన్స్.. షాక్‌లో ఇండస్ట్రీ..!

మాములుగా ఒక స్టార్ హీరోకు ఆన్ స్క్రీన్ కెమెస్ట్రీకి పర్ఫెక్ట్‌గా కుదిరిపోయే హీరోయిన్‌ను సెట్ చేయోచ్చు. మీడియం రేంజ్ హీరోకు ఆ హీరోకు సరిపోయే హీరోయిన్‌ను సెట్ చేయోచ్చు.(Pc.Credits-Instagram@venkateshDaggubati) అయితే సీనియర్ హీరోకు మాత్రం ఇప్పుడు హీరోయిన్లను సెట్ చేయడం చాలా కష్టమైపోయింది. స్టార్ హీరోయిన్‌లు సీనియర్ హీరోలతో సినిమాలు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఇక చిన్న హీరోయిన్‌లను పెడదామంటే.. మరీ యంగ్‌గా ఉంటే అన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కవుట్ అవదు.(Pc.Credits-Instagram@venkateshDaggubati) తెలుగులో పెద్దగా పాపులారిటీ లేని, కొత్త హీరోయిన్‌లను పెడుతున్నారు. అలా సీనియర్ హీరో వెంకటేష్ సినిమాలో భార్య రోల్ కోసం తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్‌ను ఎంచుకున్నారు.(Pc.Credits-Instagram@venkateshDaggubati) ఐశ్వర్య రాజేష్ నిజానికి తెలుగమ్మాయి. వాళ్ల నాన్న రాజేష్ టాలీవుడ్‌లో ఒకప్పుడు మంచి హీరో. అయితే చెన్నైలోనే వీళ్ల ఫ్యామిలీ సెట్ అవడంతో.. అక్కడే అవకాశాల కోసం ట్రై చేసి.. ఇప్పుడు మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది.(Pc.Credits-Instagram@venkateshDaggubati) ఇక ఇదిలా ఉంటే.. వెంకటేష్, అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. గర్ల్ ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరీ నటిస్తుంది. కాగా ఐశ్వర్య రాజేష్ వాళ్ల నాన్న రాజేష్, వెంకటేష్ ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ అంట.(Pc.Credits-Instagram@aishwaryarajessh) కాగా ఇప్పుడు ఫ్రెండ్ కూతురుతో కొత్త సినిమాలో రొమాన్స్ చేయబోతున్నాడని సరదాగా నెటీజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇక అనీల్ రావిపూడితో ఇదవరకు చేసిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు మంచి హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు ముచ్చటగా వీళ్ల కాంబినేషన్‌లో మూడో సినిమా తెరకెక్కబోతుంది.(Pc.Credits-Instagram@aishwaryarajessh) దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా.. డిజాస్టర్‌గా నిలిచిపోయింది.(Pc.Credits-Instagram@venkateshDaggubati)


కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్​ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ రౌస్​ అవెన్యూ కోర్టు ఈ నెల 18 వరకు పొడిగించింది. దీంతో అప్పటి వరకు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నందున ఈ నెల 8న కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చే...


Raj Tarun Case: హీరో రాజ్‌ తరుణ్‌ కేసులో ట్విస్ట్‌ - అతడి ప్రియురాలు లావణ్యకు నోటీసులు జారీ

Notice to Raj Tarun Girlfriend Lavanya: టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్ తరుణ్‌ కేసులో పోలీసులు అతడి ప్రియురాలు లావణ్యకు షాకిచ్చారు. ఈ కేసు విషయంలో తిరిగి ఆమెకు నోటీసులు ఇచ్చి ట్విస్ట్‌ ఇచ్చారు. కాగా రాజ్ తరుణ్‌పై అతడి ప్రియురాలు లావణ్య చీటింగ్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రేమ పేరుతో తనని మోసం చేశాడని కోకాపేటకు చెందిన లావణ్య నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌లో రాజ్ తరుణ్‌పై ఫిర్యాదు చేసింది. పదకొండేళ్లుగా ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉన్నామని, సీక్రెట్‌గా...


రాజ్ తరుణ్ కేసు: లావణ్యకు షాకిచ్చిన పోలీసులు..

రాజ్ తరుణ్ కేసు: లావణ్యకు షాకిచ్చిన పోలీసులు.. హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ అతడి గర్ల్ ఫ్రెండ్ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసు విషయంలో నార్సింగి పోలీసులు లావణ్యకే షాక్ ఇచ్చారు.రాజ్ తరుణ్ పై ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలంటూ లావణ్యకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. 91సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్...


వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న చిరుత, దాని పిల్లలు..వీడియో నెట్టింట వైరల్

వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న చిరుత, దాని పిల్లలు..వీడియో నెట్టింట వైరల్ తల్లి ప్రేమ ఎంత గొప్పది..మనుషుల్లోనే కాదు..జంతువుల్లో కూడా అది పుష్కలంగా దొరుకుతుందని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న ఆ పసికూనలకు తల్లి దగ్గరుండి ఆనందాన్ని పంచుతుంది. పుట్టిన తర్వాత తొలిసారి వర్షాన్ని చూసిన ఆ కూనలు ఆడుతూ, దుంకుతూ, పొర్లుతూ ...


రాంచరణ్ కి షాక్.. ఆ పాత్రలో ప్రభాస్ ని నటించమని చెబుతా.. కృష్ణంరాజు భార్య కామెంట్స్

శ్యామల దేవి మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆమె చేసిన కామెంట్స్ రాంచరణ్ ఫ్యాన్స్ కి షాకిచ్చేలా ఉన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత తనదైన శైలిలో కల్కి చిత్రంతో బాక్సాఫీస్ వద్ద జూలు విదిల్చాడు. బాహుబలి తర్వాత అంతటి విజయం కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి కల్కి విందు భోజనంలా మారింది. సలార్ హిట్ అయినప్పటికీ కొందరికి ఈ చిత్రం పూర్తి స్థాయిలో సంతృప్తి ఇవ్వలేదు. ప్రస్తుతం కల్కి జైత్ర యాత్ర బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది....


కవితతో కేటీఆర్, హరీశ్ ములాఖత్..బెయిల్ కోసం చర్చలు.?

కవితతో కేటీఆర్, హరీశ్ ములాఖత్..బెయిల్ కోసం చర్చలు.? ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో  ములాఖాత్ అయ్యారు బీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,మాజీ మంత్రి హరీష్ రావు.  కవితతో మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరలోనే బెయిల్ వస్తుందని ఇరువురు కవితకు భరోసా ఇచ్చారు. హైకోర్టు కవిత బెయిల్ అభ్యర్థన  తిరస్కరించడంతో...


|Pawan Kalyanపవన్ కళ్యాణ్ వారాహి ఏకాదశ దీక్ష

వారాహి ఏకాదశ దీక్షలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్


సందేశంతో ‘పౌరుషం’

సుమన్‌ తల్వార్‌, మేకా రామకృష్ణ, షెరాజ్‌, అశోక్‌ ఖుల్లార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పౌరుషం’. షెరాజ్‌ మెహ్ది దర్శకుడు. అశోక్‌ ఖుల్లార్‌, దేవేంద్ర నేగి నిర్మాతలు.


ఆమె నా ఫ్లాట్‌లోనే ఉంటుంది.. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదు: రాజ్ తరుణ్

Raj Tarun: యువ హీరో రాజ్ తరుణ్ తనపై ఫిర్యాదు చేసిన యువతి లావణ్యపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమె తనకు సంబంధించిన ఫ్లాట్‌లోనే నివాసం ఉంటుందని, అయితే ఏనాడూ ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. ఏడేళ్లుగా ఆమెతో తనకు ఎలాంటి శారీరక సంబంధం లేదని రాజ్ తరుణ్ చెప్పారు. ఆమె వ్యక్తిత్వం మంచిది కాదనే దూరంగా ఉన్నానని, ఇండస్ట్రీలో తనకున్న పరువు పోతుందనే ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నానని చెప్పుకొచ్చారు. డ్రగ్స్ కేసులో లావణ్య పేరు వెలుగులోకి వచ్చినప్పుడే తనకు నచ్చజెప్పానని.. ఆమె ఏమాత్రం మారలేదని రాజ్ తరుణ్ అన్నారు. ప్రతి విషయానికి ఆమె బెదిరించేదని.. ఇప్పుడు కూడా బెదిరింపు ధోరణితోనే తనపై కేసు పెట్టిందని చెప్పారు. కేసును చట్టపరంగా ఎదుర్కొంటానని మీడియా ప్రతినిధులతో అన్నారు. హీరో రాజ్ తరుణ్‌ తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడంటూ లావణ్య ఫిర్యాదు చేసింది. ‘రాజ్ తరుణ్ నా ప్రపంచం. నాకు న్యాయం చేయండి’ అంటూ నార్సింగి పోలీసులను ఆశ్రయించింది.


Shani Bhagwan: శనివారం రోజు ఈ తప్పులు అస్సలు చేయోద్దు.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?

Lord shani dev: శనిదేవుడిని కర్మ ప్రభువుగా చెప్తుంటారు. ఆయన మనం చేసిన మంచి, చెడులకు అదే విధంగా ఫలితాలు కూడా ఇస్తుంటారు. ద్వాదశ రాశులపై శనిప్రభావం ఎంతో కీలకంగా ఉంటుందని కూడా జ్యోతిష్యులు చెప్తుంటారు.


Narayana Murthy: రిషి సునాక్ ఓటమిపై ట్రోల్స్.. వారానికి 70 గంటలు పనిచేయలేదా అని నారాయణమూర్తిపై మీమ్స్

Narayana Murthy: ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బ్రిటన్ ఎన్నికల ఫలితాల వేళ ట్రోలర్స్, మీమర్స్‌కు మంచి స్టఫ్‌గా మారాయి. యువత వారానికి 70 గంటలు పనిచేయాలని గతేడాది నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీయగా.. అవే వ్యాఖ్యలు ప్రస్తుతం నారాయణమూర్తి, రిషి సునాక్‌లపై ట్రోల్స్, మీమ్స్ పేలేందుకు కారణం అయ్యాయి. బ్రిటన్ ఎన్నికల్లో అల్లుడు రిషి సునాక్ ఓడిపోవడంతో మామ నారాయణమూర్తిపై నెటిజన్లు...


స్టూడియోలో విష్ణు ప్రియ స్టెప్పులు

యాంకర్ విష్ణు ప్రియ తాజాగా తన ఇన్ స్టాలో ఓ వీడియోను వదిలింది. తన మాస్టర్‌తో కలిసి డ్యాన్స్ స్టూడియోలో స్టెప్పులు వేసింది. తన రిహార్సల్స్‌కి సంబంధించిన వీడియోని ఇలా వదలడంతో ఆమె వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి. ఆహా ఏం గ్రేస్ రా బాబు అనుకునేలా ఎంతో సింపుల్‌గా స్టెప్పులు వేసింది. రజినీకాంత్ శ్రియా శివాజీ సినిమాలోని వాజీ వాజీ పాటకు విష్ణు ప్రియ ఇలా స్టెప్పులు వేసింది.


బావిలో విషవాయువులు పీల్చి ఐదుగురు మృతి

బావిలో విషవాయువులు పీల్చి ఐదుగురు మృతి వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చత్తీస్​గఢ్​లోని చంపా జిల్లాలో ఘోరం భద్రాచలం, వెలుగు: నిరుపయోగంగా ఉన్న బావిలోకి దిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితోసహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చత్తీస్​గఢ్​లోని జాంజ్‌‌‌‌‌‌‌‌గిర్-చంపా జిల్లాలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. కికిర్దా గ్రామానికి చెందిన రామచంద్ర జైస్వా...


Bimbisara 2: బింబిసార ప్రీక్వెల్ నుంచి వశిష్ఠ ఎందుకు తప్పుకున్నట్టు..? మరో దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్..

Bimbisara 2: కళ్యాణ్ రామ్.. నందమూరి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినా.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎపుడు ఇమేజ్ బిల్డప్స్ కు పోకుండా.. సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. తాజాగా ఈయన తన పుట్టినరోజు సందర్బంగా బింబిసార 2 సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. అయితే వశిష్ఠ ప్లేస్ లో కొత్త దర్శకుడితో ఈ ప్రీక్వెల్ చేస్తుండటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.


Kalki 2898 AD: హిందీలోనే కాదు, ఆ రాష్ట్రంలో కూడా ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్ల సునామీ - ఇది ఊహించి ఉండరు

‘Kalki 2898 AD’s Collections In Tamil Nadu: ప్రభాస్, దీపికా పదుకొణె హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 ఏడీ 2898 AD’. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తోంది. భారత్ తో పాటు ఓవర్సీస్ లోనూ అద్భుతంగా వసూళ్లను సాధిస్తోంది. సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ. 700 కోట్లు క్రాస్ చేసింది. 8వ రోజు కూడా మంచి వసూళ్లను అందుకుంది. భారత్ లో రూ. 22.5 కోట్లు సాధించింది. తెలుగులో రూ....


బ్రహ్మముడికి అంటే ఏమిటి? దానికి అంత ప్రాముఖ్యత ఉందా!

హిందువులు వివాహ వేడుకలలో అనేక ఆచారాలు, సంప్రదాయాలతో పాటిస్తుంటారు. తాళిబొట్టు కట్టడం, మెట్టెలు పెట్టడం, ఏడడుగులు నడవడం వంటి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఆచారాల ద్వారా ఇద్దరు వ్యక్తులు పవిత్రమైన అనుబంధంలోకి అడుగు పెడతారు. హిందూ వివాహాల్లో అలాంటి ఒక ముఖ్యమైన సంప్రదాయం బ్రహ్మముడి (గత్‌బంధన్). ఈ ఆచారంలో వధువు దుపట్టాను వరుడు ధరించే పింక్ స్కార్ఫ్‌/కండువా/పంచెతో కలిపి ముడి వేస్తారు. ఇది వారి ఐక్యతను సూచిస్తుంది. జీవితాంతం కలిసి ఉండాలనే కోరికను సూచిస్తుంది. బ్రహ్మముడి ప్రాముఖ్యత : బ్రహ్మముడి అనేది జీవితాన్ని కలిసి గడపాలని నిర్ణయించుకున్న ఇద్దరి వ్యక్తుల మధ్య ఏర్పడిన పవిత్రమైన బంధానికి సింబల్‌గా నిలుస్తుంది. ఈ ఆచారంలో వరుడి కండువా (పొడవైన స్కార్ఫ్), మహిళ దుపట్టాను ఒక పవిత్రమైన దారంతో కలిపి ముడి వేస్తారు. ఈ ముడి ద్వారా తాము లైఫ్ లాంగ్ ఒకటిగా ఉంటామని వధూవరులు ప్రమాణం చేస్తారు. దీని ద్వారా ఒకరినొకరు గౌరవించుకుంటామని, ప్రేమించుకుంటామని కూడా ప్రామిస్ చేస్తారు. ఒక యువకుడు, ఒక యువతి ఒకరితో ఒకరు జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ బంధాన్ని పవిత్రంగా గుర్తించడానికి ఒక ముడిని కడతారు. ఇది వధూవరుల మధ్య జీవితాంతం నెలకొనే అవినాభావ బంధాన్ని సూచిస్తుంది. హిందూ వివాహాల్లో బ్రహ్మముడి : హిందూ వివాహంలో, వరుడి సోదరి బ్రహ్మముడిని కడుతుంది. ఈ ముడి ద్వారా వధువును కొత్త కుటుంబ సభ్యురాలిగా అంగీకరిస్తున్నామని వరుడు, అతడి కుటుంబ సభ్యులు తెలియజేస్తారు. పెళ్లిలో వధూవరులు తమ మెడల చుట్టూ కండువాలను మార్చుకోవడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ స్కార్ఫ్స్‌ వారి మధ్య ఏర్పడిన శాశ్వత బంధాన్ని సూచిస్తాయి. వరుడు తన భార్యకు కండువాను బహుమతిగా ఇవ్వడం ద్వారా, ఆమెను తన జీవితంలో ఒక భాగంగా స్వీకరిస్తానని, ఎల్లప్పుడూ రక్షిస్తానని, ఆమెను ప్రేమిస్తానని వాగ్దానం చేస్తాడు. వధువు తన భర్తకు తన స్కార్ఫ్‌ను బహుమతిగా ఇవ్వడం ద్వారా, అతడిని గౌరవిస్తానని, అతడికి విధేయురాలిగా ఉంటానని, అతనితో కలిసి జీవితాన్ని పంచుకుంటానని వాగ్దానం చేస్తుంది. మరణం వరకు ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, గౌరవించుకోవడానికి, మద్దతు ఇవ్వడానికి వారు ప్రమాణం కూడా చేస్తారు. ఈ ఆచారం జరిగిన తర్వాత, కొత్త దంపతులు తాము మానసికంగా, భావోద్వేగపరంగా, శారీరకంగా ఒకరితో ఒకరు కలిసి ఉంటామని నమ్ముతారు. ఇది ఒకే ఆత్మగా మారిన ఇద్దరి వ్యక్తుల సంబంధాన్ని సూచిస్తుంది. బ్రహ్మముడి ద్వారా, వధూవరులు తమ ఆనందాలు, బాధలు, ఆస్తులు, బాధ్యతలను పంచుకునే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటారు. బ్రహ్మముడి సమయంలో వరుడి పొడవైన కండువాకు ఐదు పవిత్ర వస్తువులు జోడిస్తారు. అవి నాణెం, పువ్వు, బియ్యం, పసుపు, దుర్వా గడ్డి. ఈ వస్తువులు వారి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తాయి. నాణెం డబ్బుపై ప్రతి ఒక్కరికీ సమాన హక్కు ఉందని, అందరి అవసరాలకు అనుగుణంగా దానిని ఉపయోగించాలని సూచిస్తుంది. పూలు, వధూవరులు ఒకరితో ఒకరు సంతృప్తిగా ఉంటారని సూచిస్తాయి. పసుపు, వధూవరులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తుంది. దుర్వా గడ్డిలాగా వధూవరులు ఇద్దరూ చిర యువ, ఉత్సాహంగా ఉండాలని సూచిస్తుంది. బియ్యం , జంటలో ఎవరూ ఆకలితో బాధపడకుండా ఉండేంతగా తినాలని సూచిస్తుంది. మూడు ముడులు : బ్రహ్మముడిలో మూడు ముడుల్లో ప్రతి ముడికి ఓ ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. మొదటి ముడి హక్కులను సూచిస్తుంది. దంపతులు ఒకరిపై ఒకరు హక్కులు కలిగి ఉంటారని ఈ ముడి అర్థం. రెండో ముడి బంధాన్ని తెలియజేస్తుంది. మూడో ముడి, ప్రపంచాన్ని సూచిస్తుంది. ప్రపంచంలోని అందరినీ గౌరవించాలని ఈ ముడి తెలుపుతుంది. అగ్ని దేవుడు పవిత్రత, శక్తికి చిహ్నం. కొత్త దంపతులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా, దేవుడి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు.


రామగుండం పవర్ ​ప్లాంట్​ సింగరేణికా..జెన్​కో కా?

రామగుండం పవర్ ​ప్లాంట్​ సింగరేణికా..జెన్​కో కా? ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సింగరేణి వైపే మొగ్గు చూపే చాన్స్​ జెన్​కో ప్లాంట్​ మూసేసిన నేపథ్యంలో తమకే ఇవ్వాలంటున్న 26 సంఘాల లీడర్లు  జెన్​కో, ట్రాన్స్​కో సీఎండీ రిజ్వీకి వినతిపత్రం  సర్కారు నిర్ణయంపై ఉత్కంఠ గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండంలో1971లో విద్యుత్​ఉత్పత్తి ప్రారంభించి 52 ఏ...


Actress: 27 ఏళ్ల వయసులోనే రూ. 1000 కోట్ల ఆస్థికి వారసురాలు.. ఎన్టీఆర్ హీరోయినా మజాకా!

తెలుగు చిత్రసీమలో ప్రముఖ నటి చిన్ననాటి ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిన్నారి ఓ స్టార్ హీరోయిన్ కూతురు. అంతేకాదు ఈ వారసురాలైన నటి నికర విలువ రూ. 1000 కోట్లు దాటిందని అంటున్నారు. ఇంతకీ చిన్న వయస్సులోనే.. ఇంత పెద్ద ఆస్తికి వారసురాలిగా మారి.. ఇంత గొప్పగా జీవించే ఆ 27 ఏళ్ల నటి ఎవరో తెలుసా..? ఈమె తల్లి 80వ దశకంలో మోస్ట్ పాపులర్ అయిన హీరోయిన్, తెలుగు, తమిళ్, హిందీ పరిశ్రమలో అనేక సినిమాల్లో నటించింది. అంతేకాదు తండ్రి కూడా పెద్ద సినిమా నిర్మాత. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ యంగ్ హీరోయిన్.. యువత హృదయాలను దోచుకున్న భామ జాన్వీ కపూర్. బాలీవుడ్‌లో అగ్ర కథానాయికలలో ఒకరైన నటి జాన్వీ కపూర్ చిన్నతనంలోనే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతోంది. అతను ఇటీవలే Mr. & శ్రీమతి. మహి సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న దేవర చిత్రంతో జాన్వీ సౌత్ ఇండియన్ సినిమాలో నటిగా అరంగేట్రం చేస్తోంది. ఎన్టీఆర్ సరసన.. ఈ భామ దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా కూడా కమిట్ అయింది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటివరకు బాలీవుడ్ వరకు మాత్రమే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు.. సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. తెలుగుతో పాటు.. త్వరలో తమిళ చిత్రసీమలోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది జాన్వీకపూర్.


Aswani Dutt: ఎన్టీఆర్ చేతిలోనే కాదు.. బాలయ్య చేతిలో కూడా దారుణంగా మోసపోయిన కల్కి నిర్మాత అశ్వినీదత్..

Aswani Dutt: ఏంటి ఎన్టీఆర్ చేతిలోనే కాదు.. బాలయ్య చేతిలో కల్కి నిర్మాత చలసాని అశ్వనీదత్ దారుణంగా మోసపోయాడా.. ? వినడానికి వింతగా ఉన్నా.. అశ్వనీదత్ మాత్రం.. నందమూరి బాబాయి, అబ్బాయిలతో తెరకెక్కించిన సినిమాలతో దారుణమైన పరాజయాలను అందుకున్నాడు.


YS Birth Anniversary YSRCP : వైఎస్ 75వ జన్మదిన వేడుకలకు వైఎస్ఆర్‌సీపీ భారీ ఏర్పాట్లు - క్యాడర్ అంతా పాల్గొనేలా కార్యక్రమాలు

YCP is making arrangements for YS 75th birth anniversary : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించేందుకు వైసీపీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఊరిలోనూ వైసీపీ అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టాలని మాజీ మంత్రి పేర్ని నాని పిలుపునిచ్చారు. ఆస్పత్రుల్లో పండ్లు పంపిణ చేయడం, మొక్కలు నాటడం, రక్తదానం చేయడం, పిల్లలకు స్కూల్ బుక్స్ పంపిణీ చేయడం వంటి సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ప్రజలకు మేలు...


సాగర్ ను సందర్శించిన శ్రీలంక మీడియా ప్రతినిధులు

సాగర్ ను సందర్శించిన శ్రీలంక మీడియా ప్రతినిధులు హాలియా, వెలుగు : కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన15  రోజుల శిక్షణలో భాగంగా శ్రీలంకకు చెందిన 30 మంది మీడియా ప్రతినిధులు శుక్రవారం నాగార్జునసాగర్​ను  సందర్శించారు. విజయ విహార్ వద్ద శ్రీలంక మీడియా ప్రతినిధులకు మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాసరావు, నల్గొండ జిల్లా సమాచారశాఖ సహాయ సంచాలకుడు వెంక...


ఇండియన్ సినిమా సరికొత్త రారాజు మనోడే.. దెబ్బకు బాలీవుడ్ స్టార్స్‌కు చెమటలు

‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో ప్రభాస్ తన రికార్డులు తానే తిరగరాస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. రిలీజైన తొలి 6 రోజుల్లోనే రూ.600 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డులు సృష్టిస్తోంది. సినిమాలో భైరవ పాత్రలో నటించిన ప్రభాస్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశ, విదేశాల నుంచి అభిమానులు వచ్చి సినిమాను చూస్తుంటే అందరూ షాక్ అవుతున్నారు. ప్రభాస్ అంకితభావం అతడిని ఇండియన్ సూపర్ స్టార్‌గా నిలబెట్టిందని పలువురు ప్రశంసిస్తున్నారు. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సినిమాలు : ప్రతి సినిమాతో ప్రభాస్ ఇండస్ట్రీలో ఓ బెంచ్‌మార్క్ సెట్ చేస్తున్నాడు. రీసెంట్‌గా వచ్చిన కల్కితో ఇండియాలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిపాడు. బాహుబలి, సలార్ తర్వాత కల్కి సినిమాతో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు. మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాల్లో ప్రభాస్‌వే మూడున్నాయి. ఇలా ఎవ్వరూ సాధించని ఫీట్‌ని చేరుకున్న ఏకైక హీరోగా ప్రభాస్ నిలిచాడు. కల్కీ చూడటానికి జపాన్ నుంచి ఇండియాకు : బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రభాస్ మూవీ రిలీజ్ అవుతుందంటే చాలు ఫ్యాన్స్‌లో ఎక్కడలేని ఉత్సాహం కలుగుతుంది. లాస్ట్ ఇయర్ సలార్ సినిమాతో ప్రభాస్ హిట్ కొట్టాడు. ఈ సినిమాకు వరల్డ్‌వైడ్‌గా పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ‘కల్కి 2898 ఏడీ’పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ మూవీని చూడటానికి జపాన్ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఇండియాకి వచ్చారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద ‘రెబెల్ ట్రక్‌’ పక్కన నిలబడుతూ ఫొటోలు దిగారు. ఈ విషయాన్ని మూవీ టీం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇంత అభిమానాన్ని సంపాదించడం ప్రభాస్‌కి ఎలా సాధ్యమైందని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఐకానిక్ ఇన్‌ఫ్లూయెన్సర్ : ఇండియాలో ప్రభాస్ స్టార్‌డమ్‌ని ఎవరూ మ్యాచ్ చేయలేరు. ప్రభాస్ పనితీరే ఇందుకు నిదర్శనం. ఎంచుకున్న ప్రతి పాత్రపై ఎంతో డెడికేషన్ చూపిస్తాడు. పాత్ర ఏదైనా ప్రాణం పెట్టి చేస్తాడు. అందుకే, కాంటెంపరరీ సినిమాలో ప్రభాస్ అత్యంత ఐకానిక్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా నిలుస్తున్నాడు. పని విషయంలో స్ట్రిక్ట్ : పని విషయంలో ప్రభాస్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడు. ఇచ్చిన క్యారెక్టర్‌కి నూటికి నూరు శాతం న్యాయం చేయడానికి శ్రమిస్తాడు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు. ఈ పట్టుదల, సంకల్పం, సినిమా మీదున్న ప్యాషన్.. డార్లింగ్‌ని స్టార్‌గా మలిచాయి. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌ని ప్రభాస్ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. వ్యక్తిగతంగానూ ‘డార్లింగే’ : ప్రొఫెషనల్ కెరీర్ సంగతి అటుంచితే ప్రభాస్ వ్యక్తిగతంగా చాలా మంచివాడు. ఎంతో మంది చిన్నారులకు సాయం చేస్తాడు. ఇక, సెలబ్రిటీలకు మర్యాదలు చేయడంలో ప్రభాస్ తర్వాతే ఎవరైనా. ప్రభాస్‌తో నటించే ప్రతి ఒక్క కో స్టార్ ఈ విషయాన్ని చెబుతారు. ఎన్నో ఇంటర్వ్యూలలో ప్రభాస్ గొప్పతనం గురించి వివరిస్తారు. అలా, ప్రభాస్ మానవత్వం, నిజాయితీ ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానాన్ని సంపాదించి పెట్టాయి.


కొడాలి నానిపై మరో కేసు..

కొడాలి నానిపై మరో కేసు.. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతలపై కేసుల పరంపర కొనసాగుతోంది. మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది.గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి నానిపై కేసు నమోదయ్యింది. గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రబాకర్ అనే వ్యక్తి నానిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తన తల్లి మరణానికి కొడాలి నాని కార...


Hathras stampede | హథ్రస్‌ తొక్కిసలాటపై తొలిసారి మీడియా ముందుకు భోలే బాబా.. ఏమన్నారంటే..?

Hathras stampede | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హథ్రస్‌(Hathras) తొక్కిసలాట ఘటనపై సత్సంగ్ నిర్వహించిన భోలే బాబా (Bhole Baba) తొలిసారి మీడియా ముందుకు వచ్చారు.


ఈ పజిల్‌ను 15 సెకన్లలో సాల్వ్ చేస్తారా? సాధిస్తే మీరు తెలివైనవారే!

Viral Puzzle: ఈ రోజుల్లో పజిల్స్, బ్రెయిన్ టీజర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో డిఫికల్ట్ పజిల్స్ సెలెక్ట్ చేసి తరచుగా మీకు మేం సవాల్ విసురుతున్నాం. ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్, ఛాలెంజింగ్ బ్రెయిన్ టీజర్‌తో మీ ముందుకు వచ్చాం. ఈ ఛాలెంజ్‌ను సాల్వ్‌ చేయడానికి 15 సెకన్ల సమయం మాత్రమే ఉంది. ఫ్రైస్, బర్గర్, కోక్‌తో కూడిన ఈ పజిల్ మీ మ్యాథ్స్ స్కిల్స్‌ను టెస్ట్‌ చేస్తుంది. దీన్ని సాల్వ్ చేయడం ద్వారా లాజికల్, రీజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్...


Sumalatha: దర్శన్ నా కొడుకులాంటి వాడు - అభిమాని హత్య ఘటనపై సుమలత షాకింగ్ కామెంట్స్

Sumalatha About Darshan: రేణుకా స్వామి అనే వ్యక్తి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ విషయం సినీ పరిశ్రమలోనే సంచలనంగా మారింది. ఒక్కసారిగా కన్నడ ప్రేక్షకులంతా దర్శన్‌ను తిడుతూ పోస్టులు పెట్టడం ప్రారంభించారు. కానీ కొందరు ఫ్యాన్స్ మాత్రం ఈ హీరోకు సపోర్ట్‌గా నిలబడ్డారు. దర్శన్ అలా చేసి ఉండడని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పలువురు సినీ సెలబ్రిటీలు సైతం దర్శన్‌కు సపోర్ట్ చేశారు. అలాంటి వారి లిస్ట్‌లో అలనాటి నటి...


Andhra Pradesh: జైలు నుంచి ఖైదీ పరారీ, వార్డెన్‌ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు!

Rajampet Jail | రాజంపేట: సినిమాల్లో కామెడీ కోసం కొందరు ఖైదీలు పారిపోయే సీన్లు చూస్తుంటాం. మరికొన్ని సినిమాల్లో పోలీసులకు చెప్పి మరీ ఖైదీలు తప్పించుకోవడం చూసి ఉంటారు. కానీ అప్పుడప్పుడు రియల్ గానూ కొందరు ఖైదీలు పోలీసుల కళ్లు గప్పి పరారవుతుంటారు. సరిగ్గా అలాంది ఘటనే అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలులో జరిగింది. ఓ ఖైదీ రాజంపేట జైలు నుంచి పరార్ కావడంతో పోలీసులు టెన్షన్ పడుతున్నారు. రైల్వే కోడూరుకు చెందిన భాషా జైలు నుంచి పరారైన ఖైదీగా గుర్తించారు....


డైరెక్టర్ రాజమౌళిపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. దేని గురించో తెలుసా?

తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకువెళ్లిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేసిన రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'తో ఏకంగా అంతర్థాతీయ గుర్తింపు సాధించారు. తాజాగా ఆయనపై ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. 'మోడ్రన్ మాస్టర్స్' పేరుతో స్ట్రీమింగ్ కానున్న ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంత కష్టపడ్డారు, ఆయన గురించి ప్రముఖులు ఏమనుకుంటున్నారు అనే విషయాలను చూపించబోతున్నారు. ఆగస్టు 2 నుంచి...


నిరుద్యోగులకు శుభవార్త... ఇంటర్వ్యూకి హజరైతే చాలు జాబ్ పక్కా..!!

జాబ్ మేళా అంటేమొదటి ప్రాధాన్యత ఇచ్చేది ఆవ్యక్తి స్కిల్, వే ఆఫ్ స్టైల్, మాట్లాడే తీరు, ఇచ్చే సమాధానం,మాట్లాడే భాష, వారి చదువు సంధ్యలు , పొందిన మార్కులు వీటిని ఆధారం చేసుకొని ఇంటర్వ్యూస్ తీసుకొంటారు. వీరు అడిగే క్రమాన్ని చక్కగా వివరణ ఇస్తే జాబ్ పక్కా... ఒక్కసారి జాబ్ వరిస్తే మంచి సంవత్సర ప్యాకేజ్ తో ను వర్క్ ఎక్సపీరియన్స్ తో ఉన్నత పదవులను కూడ అధికమించవచ్చు.అదేవిధంగా ఎంతో మంది నిరుద్యోగులు ఉదోగ్యం కోసం ఆరాట పడుతుంటారు. వీరి ప్రతిభను బట్టి జాబ్స్...


Viral News: ఊళ్లో తగవు తీర్చలేక తలలు పట్టుకున్న పోలీసులు, ఇట్టే పరిష్కరించిన బర్రె

Buffalo Settles Village Dispute: ఊళ్లో పంచాయితీ తీర్చాలంటే పెద్దలు వస్తారు. రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది డిసైడ్ చేస్తారు. అక్కడా రాజీ కుదరకపోతే పోలీసులు, కోర్టుల చుట్టూ తిరుగుతారు. ఓ ఊళ్లో ఇద్దరి మధ్య జరిగిన గొడవకి బర్రె పరిష్కారం చూపించి ఆ తగవు తీర్చింది. యూపీలోని ప్రతాప్‌గఢ్‌లో జరిగిందీ ఘటన. ఈ బర్రె నాదంటే నాదంటూ ఇద్దరు పంచాయితీ పెట్టుకున్నారు. చివరకు ఆ బర్రె అసలు యజమాని ఇంటికి నడుచుకుంటూ వెళ్లిపోయింది. అక్కడితో...


Mohan babu - Rajinikanth: ఒకే విమానంలో పాపారాయుడితో పెదరాయుడు.. రజినీతో మోహన్ బాబు పిక్ వైరల్..

Mohan babu - Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇద్దరు మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే కదా. వీరి స్నేహానికి దాదాపు 40 యేళ్లకు పైగా చరిత్ర ఉంది.తాజాగా ఈ ఇద్దరు లెజెండ్స్ ఒక విమానంలో కలిసి ప్రయాణం చేస్తూ ఓ ఫోటో క్లిక్ అనిపించారు.


మీ భార్యకు షాపింగ్ పిచ్చి వుందా..! అయితే సుధామూర్తి మాటలు మీకోసమే..!!

Sudha Murthy : ఆమె ఇన్ఫిసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి భార్య. బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ అత్త. వేలకోట్ల ఆస్తులను కలిగిన శ్రీమంతురాలు. కానీ ఆమెను చూస్తే సాధారణ మధ్యతరగతి మహిళలా కనిపిస్తారు... ఎక్కడా ధనవంతురాలన్న దర్పం ప్రదర్శించరు. ఈ సింప్లిసిటీనే ఆమెను రాజ్యసభ వరకు చేర్చింది. తాజాగా రాజ్యసభలో మహిళ ఆరోగ్యం, మన చారిత్రక కట్టడాల గురించి ఆమె చేసిన మొదట స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. దీంతో సుధామూర్తి గురించి తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి...


Karthika Deepam 2 Serial July 6th: కార్తీకదీపం 2 సీరియల్: ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన దీప, తల్లిదండ్రులకు ఇచ్చిపడేసిన జ్యోత్స్న, కార్తీక్‌ దగ్గర దీప గాజులు!

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode దీప ఇంటికి వచ్చి బ్యాగ్‌ సర్దుకుంటుంది. జ్యోత్స్న దీప ఇన్న ఇంటి వైపు చూసి దీప హాస్పిటల్‌లో ఉంటే లైట్ వెలుగుతుంది ఏంటి అని చూస్తుంది. మీరు ఇచ్చిన గడువులోపే మీ డబ్బులు అందుతాయి అని పేపర్ మీద రాసి డబ్బులు దాచిన డబ్బాలో పెట్టి దీప బ్యాగ్ తీసుకొని వెళ్లిపోతుంది. జ్యోత్స్న దీపని చూసి ఉండు నీ పని చెప్తాను అని పరుగులు తీస్తుంది. దీప: మనసులో.. క్షమించండి అమ్మ చెప్పకుండా తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు...


Mukul Roy | బాత్‌రూమ్‌లో జారిపడ్డ టీఎంసీ నేత ఆరోగ్యం విషమం : వైద్యులు

Mukul Roy | బాత్‌రూమ్‌లో జారిపడి తలకు గాయంతో ఆసుపత్రిలో చేరిన తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) పార్టీ సీనియర్‌ నేత, రైల్వే మాజీ మంత్రి ముకుల్‌ రాయ్‌ (Mukul Roy) ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా (critical) ఉన్నట్లు వైద్యులు తాజాగా వెల్లడించారు.


ఎంబీఏ చదివి సైబర్‌‌‌‌ నేరాల బాట పట్టిన ఏపీ వ్యక్తి

ఎంబీఏ చదివి సైబర్‌‌‌‌ నేరాల బాట పట్టిన ఏపీ వ్యక్తి సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 35 మంది నుంచి రూ. 45 లక్షలు వసూలు ఏపీకి చెందిన యువకుడు అరెస్ట్ హనుమకొండ, వెలుగు: ఎంబీఏ చదివిన ఓ యువకుడు ఈజీ మనీ కోసం మోసాల బాట పట్టాడు. సాఫ్ట్‌‌‌‌ వేర్‌‌‌‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి రూ. 45 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చే...


Anasuya Bharadwaj: గుంటూరు మిర్చిలా యాంకర్ అనసూయ.. చీరలో ఒంపు సొంపులు

ప్రస్తుతం బుల్లితెర యాంకర్లలో బాగా క్రేజ్ ఉన్నది అనసూయకే. ఎందుకంటే అప్పడెప్పుడో జబర్దస్త్ యాంకర్‌గా చేసినప్పటి నుంచి ఇప్పుడు సినిమాలు చేస్తూ బిజీ అయినా కూడా ఇప్పటికీ బుల్లితెర ప్రేక్షకుల్లో అనసూయ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే తాజాగా ఆమె పార్టిసిపేట్ చేస్తున్న కొత్త షోకి మంచి రీచ్ వస్తుంది.


విశ్వక్ సేన్‌తో అనుదీప్?.. మొత్తానికి సెట్ చేసుకున్నాడా

Vishwak sen anudeep kv project విశ్వక్ సేన్, అనుదీప్ కలిసి ఓ సినిమాను చేయబోతోన్నారనే టాక్ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. అసలే అనుదీప్ ప్రిన్స్ తరువాత ఓ ప్రాజెక్ట్‌ని సెట్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. జాతి రత్నాలు ఊపుతో ప్రిన్స్‌ను తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించాడు. అది రెండు భాషల్లో బోల్తా కొట్టేసింది. దీంతో అనుదీప్ మూడో ప్రాజెక్ట్‌కు అడ్రస్ లేకుండాపోయింది. మధ్యలో రవితేజ ప్రాజెక్ట్ వినిపించింది. కానీ తాజాగా విశ్వక్ సేనుడితో సినిమా అని...


Warangal : ఎంబీఏ చదివి సైబర్‌ నేరాలు - నిరుద్యోగుల నుంచి లక్షలు స్వాహా, చివరికి ఇలా దొరికిపోయాడు..!

Warangal Crime News : ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన వ్యక్తిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. హన్మకొండకు చెందిన ఓ నిరుద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడి అసలు బాగోతం బట్టబయలైంది.


Samantha | సమంత పోస్టుపై డాక్టర్ల ఫైర్‌

మరోసారి సమంత హాట్ టాపిక్‌గా మారింది. సమంత పెట్టిన పోస్టుపై కొందరు డాక్టర్లు, నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకీ సమంత పెట్టిన పోస్టు ఏంటి? ఎందుకు ఆమెపై అలా కొందరు సీరియస్ అవుతున్నారు. ఇక్కడ తెలుసుకుందాం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ భామ ఇటు టాలీవుడ్‌తో పాటు.. కోలీవుడ్ అటు బాలీవుడ్‌లో కూడా బిజీగా మారింది.


Bonalu 2024: హైదారాబాద్ లో బోనాల సంబురం.. తొలి బొనం గోల్గొండలోనే ఎందుకు సమర్పిస్తారు.. ఈ స్టోరీ మీకు తెలుసా..?

Hyderabad bonalu 2024: తెలంగాణలో బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించారు. ఈ క్రమంలో ఇప్పటికే బోనాల పండుగకు భాగ్యనగరం ముస్తాబైంది. రేపు (ఆదివారం7 వ తేదీ) తొలిబోనంను గోల్గోండ ఎల్లమ్మతల్లికి సమర్పిస్తారు.