Trending:


చెర్రి,బన్నీతో పాటు 142 మంది స్టార్స్ తో వాట్సాప్ గ్రూప్.. ఏం చాట్ చేస్తున్నారో తెలుసా

Tollywood: టాలీవుడ్ సినీ పరిశ్రమ ఇప్పుడు పాన్ వర్డ్ సినిమాలను విడుదల చేస్తూ ప్రపంచ స్థాయిలో సందడి చేస్తోంది. తెలుగు సినిమాల రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా స్టార్స్ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్నారు. భారీ బడ్జెట్ సినిమాల్లో స్టార్ యాక్టర్స్ కలిసి చరిత్ర సృష్టించిన ఉదాహరణ కూడా ఉంది. వాట్సాప్ గ్రూప్ గురించిన కొత్త సమాచారం బయటకు వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో 142 మంది తారల వాట్సాప్ గ్రూప్ కూడా ఉందని మంచు లక్ష్మి తెలిపింది. ఈ గ్రూప్‌లో రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి సహా చాలా మంది స్టార్స్ ఉన్నారనే సీక్రెట్‌ను బయటపెట్టింది లక్ష్మీ. వాట్సాప్ గ్రూప్‌లో రామ్ చరణ్ , రానా దగ్గుబాటితో సహా చాలా మంది స్నేహితులు ఉన్నారు. తమ సినిమాల టీజర్లు, ట్రైలర్లను కూడా గ్రూప్‌లో షేర్ చేస్తున్నారు. ఇది తప్పనిసరి. అంతే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటానని నటి మంచు లక్ష్మి తెలిపింది. ముంబైకి రమ్మని రానా చాలాసార్లు రకుల్ ప్రీత్‌కు ఫోన్ చేశాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ముంబైలోని రామ్ చరణ్ ఇంట్లో ఉండేందుకు అపార్ట్ మెంట్ దొరకకపోవడంతో చాలాసార్లు అక్కడే ఉండిపోయానని మంచు లక్ష్మి తెలిపింది. రామ్ చరణ్, రానా కలిసి పెరిగారు ఇప్పటికీ మా స్నేహం అలాగే ఉంది. ఇప్పుడు మా స్నేహితుల సర్కిల్ పెద్దది అని నటి చెప్పింది. మంచు లక్ష్మి ముంబైలోని రామ్ చరణ్ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని రామ్ చరణ్‌కి చెప్పేదాన్ని అంటూ ఆ సీక్రెట్ ని ఇప్పుడు బయటపెట్టింది. మంచు లక్ష్మి అనగనగా ఓ ధీరుడు సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఎన్నో సినిమాల్లో విలన్‌గా, హీరోయిన్‌గా నటించి తనదైన ముద్ర వేసుకుంది. తన ఛాలెంజింగ్ పాత్రకు ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో నటించింది మంచు లక్ష్మి. హారర్ వెబ్ సిరీస్ యక్షిణిలో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో కనిపించింది. సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో చాలా ఇంటర్వ్యూలలో యాక్టివ్‌గా ఉంటుంది మోహన్ బాబు కూతురు. ఎన్నో టాక్ షోలు, టీవీ షోలు కూడా చేసింది. ఇటీవల మంచు లక్ష్మి సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ ఈ టాలెంటెడ్ నటి టీవీ షోలు, సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. ఈ అమ్మడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. నిర్మాతగానూ మంచి పేరు తెచ్చుకుంది.


APSRTC Kashi Ayodhya Tour : కాశీ, అయోధ్య సహా 14 పుణ్య క్షేత్రాల సందర్శన- హిందూపురం నుంచి ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు

APSRTC Kashi Ayodhya Tour : ఏపీ, తెలంగాణలోని పుణ్య క్షేత్రాలతో పాటు కాశీ, అయోధ్య క్షేత్రాలు దర్శించుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ సర్వీస్ అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ లో 8 రోజుల్లో 14 పుణ్య క్షేత్రాలు దర్శించుకోవచ్చు.


Vijay Devarakonda: కల్కి కోసం.. విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఈ పేరును ప్రస్తుతమున్న జనరేషన్ కు పెద్దగా పరిచయం అవసరంలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా... ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. రౌడీ హీరోగా ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యాడు. ముందుగా చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ.. ఆ తర్వాత పెళ్లి చూపులు సిసినిమాతో తొలి హిట్ కొట్టాడు. గీతా గోవిందం, అర్జున్ రెడ్డి సినిమాలు విజయ్ దేవరకొండ కెరీర్‌‌ను మలుపు తిప్పాయి. ఇక ఆ తర్వాత... విజయ్ వెనక్కి తిరిగి చేసుకోలేదు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో స్పెషల్ రోల్ చేశాడు. జూన్ 27న విడుదలైన కల్కి 2898 AD చిత్రం విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 298.5 కోట్ల రూపాయలను వసూలు చేసి అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరియు దిశా పటానీ వంటి అనేక మంది తారలు ఉన్నారు. ప్రధాన తారాగణంతో పాటు, ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రామ్ గోపాల్ వర్మ, ఎస్ఎస్ రాజమౌళి , ఫరియా అబ్దుల్లా అతిధి పాత్రలు పోషించారు . ఈ అతిథి పాత్రలు అభిమానులలో భారీగా ఉత్సాహాన్ని సృష్టించాయి. ప్రస్తుతం భారతదేశంలో మోస్ట్ ట్రెండింగ్ నటుల్లో ఒకరైన విజయ్ దేవరకొండ ఈ సినిమాలో అర్జునుడిగా కీలక పాత్రలో కనిపించాడు. అయితే విజయ్ ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సినిమాలోని చాలా మంది అతిథి నటులు తమ పాత్రలకు ఎటువంటి ఫీజు లేకుండా పనిచేశారు. ఇందులో విజయ్ కూడా.. ఒకడు. విజయ్ కూడా కల్కి కోసం ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు. అయితే కల్కిలో విజయ్ రోల్ చిన్నది. కానీ కల్కి 2898 AD పార్ట్ 2లో మాత్రం విజయ్ దేవరకొండ పాత్ర ఎక్కువగా ఉంటుందని సమాచారం. ముఖ్యంగా కొన్ని కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లలో పొడిగించిన పాత్రను విజయ్ పోషించవచ్చని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్, సినిమాలో తన నటనకు 150 కోట్లు వసూలు చేశాడు, మొత్తం బడ్జెట్‌లో 25%.లీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరైన దీపికా పదుకొనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో తన పాత్ర కోసం 20 కోట్లు తీసుకుందని నివేదించబడింది. అమితాబ్ బచ్చన్: లెజెండరీ అమితాబ్ బచ్చన్ కూడా తన పాత్ర కోసం 20 కోట్లు వసూలు చేశాడు.


ఫ్లిప్‌కార్ట్‌లో చెప్పులు ఆర్డర్ చేస్తే ఎప్పుడు వచ్చాయో తెలుసా.. కస్టమర్ షాక్!

ముంబై: ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసిన చెప్పులు ఆరేళ్ల తర్వాత కస్టమర్‌కు చేరాయి. అయితే ముంబై నివాసి అహ్సాన్ ఖర్బాయికి ఫ్లిప్‌కార్ట్ సిబ్బంది నుండి ఓ కాల్ వచ్చింది. సార్ మీ పార్శిల్ వచ్చింది అని డెలివరీ బాయ్ చెప్పడంతో అహ్సాన్ షాక్ అయ్యాడు. విషయం ఏంటంటే అహ్సాన్ ఆరేళ్ల క్రితం బుక్ చేసుకున్న ఆర్డర్ సంగతి కూడా మర్చిపోయాడు. Ahsan Xలో ఆరేళ్ల తర్వాత వచ్చిన ఆర్డర్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేను ఆరేళ్ల క్రితం...


Guppedantha Manasu Serial Today July 5th: గుప్పెడంత మనసు సీరియల్: నీ తల్లిలానే పెళ్లి కాకుండానే సంసారం చేస్తావా: మనుతో దేవయాని, సరోజా వర్సెస్ వసు, బుక్కైపోయిన రంగ!

Guppedantha Manasu Today Episode వసుధార స్కూల్ దగ్గర రంగతో త్వరలోనే మీరే మీ నోటితో రిషి అని ఒప్పుకునేలా చేస్తానని ఛాలెంజ్ చేస్తుంది. రంగ వసు పడిపోతుంటే పట్టుకోవడం, వసు ఛాలెంజ్ చేయడం దూరం నుంచి చూసిన సరోజా బుజ్జితో వసు అన్నంత పని చేస్తుందని, తన బావని రిషిసార్‌లా మర్చేసేలా ఉందని టెన్షన్ పడుతుంది. ఇక బుజ్జి సరోజాతో ఎప్పుడు అన్న వెంట ఎందుకు పడతావ్ అని తనని సెట్ చేసుకోమని అంటాడు. దీంతో సరోజా బుజ్జిని చితక్కొడుతుంది. మను, ఏంజెల్ వసు గురించి...


Karthika Deepam 2 Serial July 6th: కార్తీకదీపం 2 సీరియల్: ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన దీప, తల్లిదండ్రులకు ఇచ్చిపడేసిన జ్యోత్స్న, కార్తీక్‌ దగ్గర దీప గాజులు!

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode దీప ఇంటికి వచ్చి బ్యాగ్‌ సర్దుకుంటుంది. జ్యోత్స్న దీప ఇన్న ఇంటి వైపు చూసి దీప హాస్పిటల్‌లో ఉంటే లైట్ వెలుగుతుంది ఏంటి అని చూస్తుంది. మీరు ఇచ్చిన గడువులోపే మీ డబ్బులు అందుతాయి అని పేపర్ మీద రాసి డబ్బులు దాచిన డబ్బాలో పెట్టి దీప బ్యాగ్ తీసుకొని వెళ్లిపోతుంది. జ్యోత్స్న దీపని చూసి ఉండు నీ పని చెప్తాను అని పరుగులు తీస్తుంది. దీప: మనసులో.. క్షమించండి అమ్మ చెప్పకుండా తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు...


Actor: మెగా హీరోపై రూ.125 కోట్ల బడ్జెట్.. వర్కవుట్ అవుతుందా..?

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కెరీర్ గ్రాఫ్ పడుతూ లేస్తూ వస్తుంది. ఒకదశలో పూర్తిగా పడిపోయింది. ఇక మెగా మేనల్లుడి పని అవుట్ అనుకున్న టైమ్‌లో విరూపాక్షతో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. హిట్టంటే మళ్లీ ఆశా మాశీ హిట్టు కాదు. కొడితే బాక్సాఫీస్ దగ్గర రూ.90 కోట్ల రీ సౌండ్ వినిపించింది. ఆ తర్వాత మేనమామతో కలిసి బ్రో సినిమా చేశాడు. ఈ సినిమా కమర్షియల్‌గా ఫ్లాప్‌గా నిలిచింది. పైగా రీమేక్ అవడం.. సినిమా కూడా కాస్త బోరింగ్‌గా ఉండటంతో బెడిసికొట్టింది. మరోవైపు సినిమాపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఆగిపోలేదని వినిపిస్తుంది. ఇలాంటి అయోమయ పరిస్థితిలో మెగా మేనల్లుడికి సంబంధించిన కొత్త సినిమా అప్‌డేట్ సినీ లవర్స్‌ను ఎగ్‌జైట్ చేస్తుంది. సాయి ధరమ్ సాయి ధరమ్ తేజ్ తన కొత్త సినిమాను రోహిత్ కేపీ అనే కొత్త దర్శకుడితో చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ రిలీజవగా.. ఆడియెన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. సాయి ధరమ్ సాయి ధరమ్ తేజ్ తన కొత్త సినిమాను రోహిత్ కేపీ అనే కొత్త దర్శకుడితో చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ రిలీజవగా.. ఆడియెన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు హనుమాన్ వంటి అరివీర భయంకర హిట్టు కొట్టిన నిర్మాతలు.. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం అక్షరాల రూ.125 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నట్లు ఇన్ సైడ్ టాక్. మెగా హీరోపై అన్నేసి కోట్లు.. అందులోనూ ఇప్పటివరకు వంద కోట్ల గ్రాస్ కూడా లేని సాయి ధరమ్ తేజ్‌పై అన్ని కోట్ల బడ్జెట్ అంటే మేకర్స్ రిస్క్ చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు. అంతేకాకుండా డైరెక్టర్‌కి కూడా ఇది తొలి సినిమా. ఎంత గొప్ప కాన్సెప్ట్ అయినా సరే.. ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్‌పై నమ్మకంతో ఇంత ఇన్వెస్ట్ చేయడం అంటే మాములు విషయం కాదు. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు కాదు.. ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.


నాలో కొత్త కోణాన్ని చూస్తారు

రాజ్‌తరుణ్‌ హీరోగా ఏ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తిరగబడరాసామీ’. సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు.


Aswani Dutt: ఎన్టీఆర్ చేతిలోనే కాదు.. బాలయ్య చేతిలో కూడా దారుణంగా మోసపోయిన కల్కి నిర్మాత అశ్వినీదత్..

Aswani Dutt: ఏంటి ఎన్టీఆర్ చేతిలోనే కాదు.. బాలయ్య చేతిలో కల్కి నిర్మాత చలసాని అశ్వనీదత్ దారుణంగా మోసపోయాడా.. ? వినడానికి వింతగా ఉన్నా.. అశ్వనీదత్ మాత్రం.. నందమూరి బాబాయి, అబ్బాయిలతో తెరకెక్కించిన సినిమాలతో దారుణమైన పరాజయాలను అందుకున్నాడు.


Ashada Masam 2024: ఆషాఢ మాసం ప్రాముఖ్యతలేంటి.. ఈ కాలంలో శుభకార్యాలు ఎందుకు నిషేధించారో తెలుసా..

Ashada Masam 2024 తెలుగు పంచాంగం ప్రకారం, జూలై 6వ తేదీ శనివారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానుంది. ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలను చేయరు. అయితే పూజలకు, ఉపవాస దీక్షలకు ఈ మాసం ఎంతో పవిత్రమైనది. ఈ సందర్భంగా ఆషాడ మాసం విశిష్టత, పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


Virat Kohli | ‘బుమ్రా’ ఎనిమిదో వండ‌ర్.. ఎందుకో తెలుసా..?

Virat Kohli : పొట్టి ప్ర‌పంచ క‌ప్ విజేత‌ల స‌న్మాన స‌భ‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) జ‌ట్టు స‌భ్యుల‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు. పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను ఏకంగా 'ఎనిమిదో వింత‌'గా విరాట్ అభివ‌ర్ణించాడు.


Ambani Family: 50 జంటలకు పెళ్లిళ్లు.. రూ.1 లక్ష చెక్.. భారీ కానుకలు ఇచ్చిన అంబానీ ఫ్యామిలీ!

Ambani Family: ముకేశ్ అంబానీ కుటుంబం గొప్ప మనసు చాటుకుంది. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో భాగంగా 50 జంటలకు సామూహిక వివాహాలు చేసింది. అంతే కాకుండా ఒక్కో జంటకు స్త్రీ ధనం కింద రూ.1 లక్ష చెక్కు, ఏడాదికి సరిపడా సరుకులు, పెళ్లి సహా సహా భారీగా కానుకలు అందించింది. ఆ వివరాలు ఓసారి తెలుసుకుందాం.


Kalki 2898 AD | ‘క‌ల్కి 2898’ సినిమా రూ.1000 కోట్ల‌ను చేరుతుందా?

Kalki 2898 AD | క‌ల్కి, ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్.. ఇప్పుడు ఈ మూడు పేర్లు హాట్‌టాపిక్‌. ప్ర‌స్తుతం ఎక్క‌డా విన్నా క‌ల్కి 2898 ఏడీ గురించే చ‌ర్చ జ‌రుగుతుంది. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటున్న సంగ‌తి తెలిసిందే.


సండే స్పెషల్ బిర్యానీలో ప్లాస్టిక్ కవర్.. బాగా వేయించి మరీ ఇచ్చారు..!

సండే స్పెషల్ బిర్యానీలో ప్లాస్టిక్ కవర్.. బాగా వేయించి మరీ ఇచ్చారు..! సండే ఫుడ్ అంటే హైదరాబాదీలకు ఠక్కున గుర్తుకొచ్చేది బిర్యానీ.. అందులోనూ దమ్ బిర్యానీ అంటే హాట్ హాట్ గా లాగించేస్తారు జనం.. సండే రోజు హైదరాబాద్ లో హయ్యస్ట్ సేల్స్ సైతం బిర్యానీకే ఉంటాయి. అయితే ఇటీవల బిర్యానీలో అడ్డమైన చెత్త వస్తుంది.. ఫుడ్ సేఫ్ట్ అధికారులు తనిఖీలు చేసినా.. ఆయా రెస్ట...


YSR Anniversary: వైఎస్‌ విజయమ్మ పయనమెటు? జగన్‌ లేదా షర్మిల

YS Vijayamma Which Stand YS Jagan Or Sharmila: వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్‌ కుటుంబంలో మళ్లీ కుటుంబ వివాదం నడుస్తోందని సమాచారం. విజయవాడలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో షర్మిల నిర్వహించే కార్యక్రమానికి వైఎస్‌ విజయమ్మ వెళ్తుండడంతో మరోసారి వైఎస్‌ జగన్‌ ఒంటరి అయిపోయారు.


నాగ్ అశ్విన్ పై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారా,కారణం?

జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ యుద్దం మొదలవుతుందో తెలియదు. వాటికి ప్రత్యేకమైన కారణాలంటూ కూడా ఉండవు. ఏదో చిన్న ఇష్యూని పట్టుకుని దాన్ని పెద్దది చేసి ట్విట్టర్ లో పోస్ట్ లు, కామెంట్ లు వర్షం కురిపిస్తూంటారు. గత రెండు రోజులుగా కల్కి చిత్రం పై ప్రశంశలు వర్షం కురిపిస్తున్న ట్విట్టర్ లో ఓ వర్గం నాగ్ అశ్విన్ ని టార్గెట్ చేయటం మొదలెట్టారు. అందుకు కారణం చిరంజీవి...


నెయ్యిలో ముంచి, ఇడ్లీలన్నీ మాయం..ఎన్టీఆర్ తిండి పిచ్చి గురించి మహేష్ బాబుకి కూడా తెలిసిపోయింది

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు అని చాలా మందికి తెలుసు. బిర్యానీ లాంటి వంటకాలని తారక్ ఎంతగానో ఇష్టపడతారు. తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి ఈ అలవాటు వచ్చింది. టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు అని చాలా మందికి తెలుసు. బిర్యానీ లాంటి వంటకాలని తారక్ ఎంతగానో ఇష్టపడతారు. తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి ఈ అలవాటు వచ్చింది అని ఎన్టీఆర్ ఓ సందర్భంలో తెలిపారు. ఒక సారి ఎన్టీఆర్ కీరవాణితో తనకి ఇష్టమైన...


Narayana Murthy: రిషి సునాక్ ఓటమిపై ట్రోల్స్.. వారానికి 70 గంటలు పనిచేయలేదా అని నారాయణమూర్తిపై మీమ్స్

Narayana Murthy: ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బ్రిటన్ ఎన్నికల ఫలితాల వేళ ట్రోలర్స్, మీమర్స్‌కు మంచి స్టఫ్‌గా మారాయి. యువత వారానికి 70 గంటలు పనిచేయాలని గతేడాది నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీయగా.. అవే వ్యాఖ్యలు ప్రస్తుతం నారాయణమూర్తి, రిషి సునాక్‌లపై ట్రోల్స్, మీమ్స్ పేలేందుకు కారణం అయ్యాయి. బ్రిటన్ ఎన్నికల్లో అల్లుడు రిషి సునాక్ ఓడిపోవడంతో మామ నారాయణమూర్తిపై నెటిజన్లు...


girl shot dead | నాలుగేళ్ల బాలికపై కాల్పులు.. బుల్లెట్‌ గాయాలతో మృతి

girl shot dead | తండ్రి కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన నాలుగేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు గన్‌తో కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి రక్తం ముడుగుల్లో పడి మరణించింది.


‘మట్కా’ కోసం రెమ్యునరేషన్ సగానికి సగం తగ్గించుకున్న వరుణ్ తేజ్?

తనకు మార్కెట్ ఓ మాదిరిగా ఉన్నప్పుడు భారీ బడ్జెట్ తో సినిమా ప్లాన్ చేస్తే...అందుకు తగినట్లు హీరోలు తమ రెమ్యునరేషన్ లు తగ్గించుకుని సహకరిస్తే నిర్మాతలు ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలగుతారు. బడ్జెట్ సమస్యలతో ముందుకు వెళ్లలేకపోతోందని వార్తలు వచ్చిన మట్కా మూవీ ఇప్పుడు షూటింగ్ జోరందుకుంది. అందుకు కారణం వరుణ్ తేజ తన రెమ్యునరేషన్ సగానికి సగం తగ్గించుకోవటమే కాకుండా మిగతా టీమ్ చేత కూడా సాధ్యమైన మేరకు తగ్గించుకుని సహకరించమని కోరినట్లు సమాచారం. అసలు వరుణ్ తేజ...


Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: జున్ను నీ కొడుకే అని మిత్రతో చెప్పిన వివేక్.. లక్ష్మీని చూసేసిన జాను!

chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: వివేక్, జానుల జాతకాలు కలిశాయని, ఇద్దరి మనసులు కలిశాయని అలాంటి వాళ్లని కలపడానికి నువ్వు ఎందుకు ఆలోచించడం లేదు అని అరవింద దేవయానిని అడుగుతుంది. దానికి దేవయాని కోపంగా జాహ్నవికి తన కొడుకు చేత తాళి కట్టించుకోవడానికి తమ ఇంటికి కోడలు అవ్వడానికి ఎలాంటి అర్హత లేదు అని మండిపడుతుంది. అసలు దాన్ని నా కోడలిగా ఎప్పటికీ ఊహించుకోలేను అని అంటుంది. ఇక అక్కడే ఉన్న వివేక్‌కి తాను చూసిన అమ్మాయితో పెళ్లికి...


బ్లాక్‌ డెవిల్‌ లుక్‌లో శ్రీముఖి హల్‌చల్‌.. బుల్లితెర రాములమ్మని ఇలా ఎప్పుడైనా చూశారా?

శ్రీముఖి ప్రస్తుతం తెలుగులో స్టార్‌ యాంకర్‌గా రాణిస్తుంది. సుమ, రష్మిని మించి ఆమె షోస్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది. తనదైన యాంకరింగ్‌తో అలరిస్తుంది. వినోదాన్ని పంచుతుంది. `పటాస్‌` షోతో పాపులర్‌ అయ్యింది శ్రీముఖి. ఆ తర్వాత ఒకటి అర షోస్‌తో కెరీర్‌ని నెట్టుకొచ్చింది. ఒకానొక దశలో ఆమె జీరో అయిపోయింది. ఖాళీగా ఉంటూ సోషల్‌ మీడియాలో హడావుడి చేసింది. రీల్స్, వీడియోలు, ఫోటోలతో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంది. కానీ ఆ వెంటనే బౌన్స్ బ్యాక్‌ అనేలా ఆమె భారీ ప్లానింగ్‌తో...


కన్నకొడుకు దూరమైనా కనికరించని నందమూరి కుటుంబం, తారకరత్న భార్యకు కష్టాలు, ఇంత కఠినమా?

తారకరత్న మరణంతో ఒంటరైన అలేఖ్యరెడ్డికి కష్టాలు కొనసాగుతున్నాయి. కొడుకు మరణం తర్వాత కూడా ఆమెను నందమూరి కుటుంబం దగ్గరకు తీయలేదు. ఈ మేరకు అలేఖ్య లేటెస్ట్ సోషల్ మీడియా కామెంట్ ఆమె దీన స్థితిని తెలియజేస్తుంది. తారకరత్న మరణం ఊహించని విషాదం. చిన్న వయసులోనే ఆయన కన్నుమూశారు. 2023 జనవరిలో నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర కుప్పం వేదికగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. బెంగుళూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇరవై...


Mega Hero: మెగా హీరో సంచలన నిర్ణయం... అచ్చం ప్రభాస్ లాగానే!

మెగా హీరోల్లో కాస్త డిఫరెంట్‌గా అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలతో అలరిస్తుంటాడు వరుణ్ తేజ్. రిజల్ట్ సంగతి పక్కన పెడితే వరుణ్ సినిమాలు కాస్త యూనిక్‌గా, కొత్త కాన్సెప్ట్‌తో ఉంటాయి. ఇక ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఫేస్ చేస్తున్నాడు. గద్దల కొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ మళ్లీ ఇప్పటివరకు ఒక్క హిట్టు కూడా కొట్టలేదు. రీసెంట్‌గా రిలీజైన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఎబో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. కమర్షియల్‌గా మాత్రం భారీ ఫ్లాప్‌గా మిగిలింది. ప్రస్తుతం ఈ కుర్ర హీరో మట్కా అనే పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు ఆడియెన్స్‌లో మంచి అటెన్షన్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాను పలాస దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 20వ సెంచరీలో జరిగిన గ్యాంబ్లింగ్ స్కామ్స్ గురించి ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో వరుణ్ కాస్త నెగెటీవ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. 1958 నుంచి 1982 మధ్య ఈ కథ నడుస్తుందని ఇన్ సైడ్ టాక్. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ తన రెమ్యునరేషన్‌ను సగం తగ్గించుకున్నట్లు సమాచారం. ఇన్ సైడ్ రిపోర్ట్స్ ప్రకారం వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రతీ సినిమాకు రూ.12 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడట. కాగా ఈ సినిమా కోసం సగం రెమ్యునరేషన్‌ను కట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ముందుగా అనుకున్న దానికంటే మేకింగ్‌కు ఎక్కువ ఖర్చవడంతో.. నిర్మాతలను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.. రూ.6 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను కట్ చేసుకున్నాడట. గతంలో కూడా ఆపరేషన్ వాలెంటైన్ సినిమా కోసం సగం రెమ్యునరేషన్ వెనక్కు ఇచ్చేశాడట. ఇలా సినిమా కోసం ఏది చేయడానికైనా వరుణ్ తేజ్ రెడీగా ఉంటాడట. రీసెంట్‌గా కల్కీ సినిమా కోసం ప్రభాస్ సైతం తన రెమ్యునరేషన్‌ను తగ్గించుకున్నాడు. ప్రతీ సినిమాకు రూ.150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్... కల్కీ కోసం మాత్రం రూ.80 కోట్లు మాత్రమే తీసుకున్నాడు.


కోదండరెడ్డివి సిగ్గుమాలిన మాటలు

ఖమ్మం జిల్లా చింతకానిలో ఆత్మహత్య చేసుకున్న రైతు గురించి కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు కోదండరెడ్డి సిగ్గుమాలిన మాటలు మాట్లాడారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాత మధుసూదన్‌ మండిపడ్డారు.


Supritha: ఎగిసెగిసి పడుతున్న లేలేత అందాలు.. బ్యూటీ పోజులకు కుర్రాళ్ళు క్లీన్ బౌల్డ్

కుర్రకారులో హీటు పెంచే ఫొటోస్ షేర్ చేయడంలో ముందు వరుసలో ఉంటుంది సురేఖావాణి డాటర్ సుప్రిత. మరికొద్ది రోజుల్లో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్న ఈ చిన్నది.. తాజాగా బోల్డ్ లుక్స్‌ వదిలి కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేసింది. దీంతో ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. నిత్యం సోషల్ మీడియాలో హవా నడిపిస్తూ ఫాలోయింగ్ పెంచుకునే సుప్రిత.. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. ఇలా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారి సినిమాల్లోకి రాకముందే తన ట్రెండ్ సెట్ చేసి పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు పార్టీలు చేస్తూ మస్త్ మస్త్ ఎంజాయ్ చేస్తుంటుంది సుప్రిత. పబ్బులు, నైట్ ఈవెంట్స్ లో మజా చేయడం అమ్మడి నైజం. రీసెంట్ గా IPL మ్యాచెస్ స్టేడియంలలో కూడా రచ్చ రచ్చ చేస్తూ వార్తల్లో నిలిచింది ఈ యంగ్ లేడీ. ఇకపోతే సురేఖా వాణి, సుప్రితలు చేసుకునే వీకెండ్ పార్టీల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. స్నేహితులతో కలిసి చిల్ కావడం, టైం దొరికితే చాలు గోవాకు పయనమై అక్కడి అందాలకు తమ గ్లామర్ డోస్ యాడ్ చేయడం లాంటివి చేస్తుంటారు. బ్యాంకాక్, దుబాయ్ అంటూ చెలరేగిపోతుంటారు. ఏ మాత్రం అవకాశం దొరికినా తన తల్లి సురేఖా వాణితో కలిసి టూర్స్ వేస్తూ చిల్ అవుతూ ఉంటుంది సుప్రిత. బీచ్ లొకేషన్స్ చుట్టేయడంతో పాటు పార్టీలు, పబ్బుల్లో చిల్ అవుతూ ఉంటుంది. కురచ దుస్తులతో యువతకు మైకం తెప్పిస్తూ ఉంటుంది. సినిమా అవకాశాలు పట్టేయడమే లక్ష్యంగా సుప్రిత ఇలా రెచ్చిపోతుందనే టాక్ అయితే ఉంది. అంతకుముందు తన కూతురు సినీ ఎంట్రీ గురించి మాట్లాడిన సురేఖా వాణి.. తనకు సినీ ఎంట్రీ ఇష్టముంటే అడ్డు చెప్పనని చెప్పిన సంగతి తెలిసిందే. ఓ సెలబ్రిటీ డాటర్ గా సినిమాల్లో క్లిక్ కాకముందే బాగా పాపులర్ అయింది సుప్రిత. రీసెంట్ గానే ఓ సినిమాలో హీరోయిన్ గా కూడా ఛాన్స్ పట్టేసింది సుప్రిత. బిగ్ బాస్ అమర్ దీప్ తో కలిసి ఓ సినిమా చేస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా, తన తీరుతో ఎన్నోసార్లు ట్రోల్ల్స్ బారిన పడింది సుప్రిత. అయితే ఎంతమంది ఎలా ట్రోల్ చేసిన తన లైఫ్ తన ఛాయిస్ అన్నట్లుగా దూసుకెళ్తున్న ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు అందాల తెర ఎత్తేస్తూ హల్చల్ చేస్తోంది.


బ్రహ్మముడికి అంటే ఏమిటి? దానికి అంత ప్రాముఖ్యత ఉందా!

హిందువులు వివాహ వేడుకలలో అనేక ఆచారాలు, సంప్రదాయాలతో పాటిస్తుంటారు. తాళిబొట్టు కట్టడం, మెట్టెలు పెట్టడం, ఏడడుగులు నడవడం వంటి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఆచారాల ద్వారా ఇద్దరు వ్యక్తులు పవిత్రమైన అనుబంధంలోకి అడుగు పెడతారు. హిందూ వివాహాల్లో అలాంటి ఒక ముఖ్యమైన సంప్రదాయం బ్రహ్మముడి (గత్‌బంధన్). ఈ ఆచారంలో వధువు దుపట్టాను వరుడు ధరించే పింక్ స్కార్ఫ్‌/కండువా/పంచెతో కలిపి ముడి వేస్తారు. ఇది వారి ఐక్యతను సూచిస్తుంది. జీవితాంతం కలిసి ఉండాలనే కోరికను సూచిస్తుంది. బ్రహ్మముడి ప్రాముఖ్యత : బ్రహ్మముడి అనేది జీవితాన్ని కలిసి గడపాలని నిర్ణయించుకున్న ఇద్దరి వ్యక్తుల మధ్య ఏర్పడిన పవిత్రమైన బంధానికి సింబల్‌గా నిలుస్తుంది. ఈ ఆచారంలో వరుడి కండువా (పొడవైన స్కార్ఫ్), మహిళ దుపట్టాను ఒక పవిత్రమైన దారంతో కలిపి ముడి వేస్తారు. ఈ ముడి ద్వారా తాము లైఫ్ లాంగ్ ఒకటిగా ఉంటామని వధూవరులు ప్రమాణం చేస్తారు. దీని ద్వారా ఒకరినొకరు గౌరవించుకుంటామని, ప్రేమించుకుంటామని కూడా ప్రామిస్ చేస్తారు. ఒక యువకుడు, ఒక యువతి ఒకరితో ఒకరు జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ బంధాన్ని పవిత్రంగా గుర్తించడానికి ఒక ముడిని కడతారు. ఇది వధూవరుల మధ్య జీవితాంతం నెలకొనే అవినాభావ బంధాన్ని సూచిస్తుంది. హిందూ వివాహాల్లో బ్రహ్మముడి : హిందూ వివాహంలో, వరుడి సోదరి బ్రహ్మముడిని కడుతుంది. ఈ ముడి ద్వారా వధువును కొత్త కుటుంబ సభ్యురాలిగా అంగీకరిస్తున్నామని వరుడు, అతడి కుటుంబ సభ్యులు తెలియజేస్తారు. పెళ్లిలో వధూవరులు తమ మెడల చుట్టూ కండువాలను మార్చుకోవడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ స్కార్ఫ్స్‌ వారి మధ్య ఏర్పడిన శాశ్వత బంధాన్ని సూచిస్తాయి. వరుడు తన భార్యకు కండువాను బహుమతిగా ఇవ్వడం ద్వారా, ఆమెను తన జీవితంలో ఒక భాగంగా స్వీకరిస్తానని, ఎల్లప్పుడూ రక్షిస్తానని, ఆమెను ప్రేమిస్తానని వాగ్దానం చేస్తాడు. వధువు తన భర్తకు తన స్కార్ఫ్‌ను బహుమతిగా ఇవ్వడం ద్వారా, అతడిని గౌరవిస్తానని, అతడికి విధేయురాలిగా ఉంటానని, అతనితో కలిసి జీవితాన్ని పంచుకుంటానని వాగ్దానం చేస్తుంది. మరణం వరకు ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, గౌరవించుకోవడానికి, మద్దతు ఇవ్వడానికి వారు ప్రమాణం కూడా చేస్తారు. ఈ ఆచారం జరిగిన తర్వాత, కొత్త దంపతులు తాము మానసికంగా, భావోద్వేగపరంగా, శారీరకంగా ఒకరితో ఒకరు కలిసి ఉంటామని నమ్ముతారు. ఇది ఒకే ఆత్మగా మారిన ఇద్దరి వ్యక్తుల సంబంధాన్ని సూచిస్తుంది. బ్రహ్మముడి ద్వారా, వధూవరులు తమ ఆనందాలు, బాధలు, ఆస్తులు, బాధ్యతలను పంచుకునే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటారు. బ్రహ్మముడి సమయంలో వరుడి పొడవైన కండువాకు ఐదు పవిత్ర వస్తువులు జోడిస్తారు. అవి నాణెం, పువ్వు, బియ్యం, పసుపు, దుర్వా గడ్డి. ఈ వస్తువులు వారి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తాయి. నాణెం డబ్బుపై ప్రతి ఒక్కరికీ సమాన హక్కు ఉందని, అందరి అవసరాలకు అనుగుణంగా దానిని ఉపయోగించాలని సూచిస్తుంది. పూలు, వధూవరులు ఒకరితో ఒకరు సంతృప్తిగా ఉంటారని సూచిస్తాయి. పసుపు, వధూవరులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తుంది. దుర్వా గడ్డిలాగా వధూవరులు ఇద్దరూ చిర యువ, ఉత్సాహంగా ఉండాలని సూచిస్తుంది. బియ్యం , జంటలో ఎవరూ ఆకలితో బాధపడకుండా ఉండేంతగా తినాలని సూచిస్తుంది. మూడు ముడులు : బ్రహ్మముడిలో మూడు ముడుల్లో ప్రతి ముడికి ఓ ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. మొదటి ముడి హక్కులను సూచిస్తుంది. దంపతులు ఒకరిపై ఒకరు హక్కులు కలిగి ఉంటారని ఈ ముడి అర్థం. రెండో ముడి బంధాన్ని తెలియజేస్తుంది. మూడో ముడి, ప్రపంచాన్ని సూచిస్తుంది. ప్రపంచంలోని అందరినీ గౌరవించాలని ఈ ముడి తెలుపుతుంది. అగ్ని దేవుడు పవిత్రత, శక్తికి చిహ్నం. కొత్త దంపతులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా, దేవుడి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు.


Maha Lakshmi Rajyoga: కుజ - చంద్ర గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి జూన్ 30 నుంచి ముట్టిందల్లా బంగారమే..

Maha Lakshmi Rajyoga: జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈరోజు మేష రాశిలో కుజ గ్రహంతో పాటు చంద్రగ్రహణం సంయోగం జరగబోతోంది. దీని కారణంగా జాతకంలో ఈ రెండు రాశుల శుభ స్థానంలో ఉన్నవారు ఊహించని లాభాలతో పాటు ఆర్థికంగా లాభపడతారు. ఇందులో మీ రాశి కూడా ఉందా? చెక్ చేసుకోండి..


కొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా

కొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ 2024-–25 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సులో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది. సీట్లు: యూనివర్సిటీ పాలిటెక్నిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు-120; అనుబంధ పాలిటెక్నిక్‌‌‌‌‌‌...


AP News | కారు గిఫ్ట్‌ ఇచ్చిన జనసైనికులు.. వద్దని వెనక్కి పంపిన జనసేన ఎమ్మెల్యే

AP News | జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై జనసైనికులు తమ ప్రేమను చాటుకున్నారు. నిరుపేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు కారు కొనుక్కునే స్థోమత కూడా లేదని తెలుసుకున్న జనసైనికులు చేయి చేయి కలిపారు.


Pawan kalyan: రూ.30లక్షలతో బాత్ టబ్ ఎవడైనా పెట్టుకుంటాడా?

deputy cm pawankalyan fires on ex cm ysjagan on rushikonda palace pa


Shalini Pandey: అబ్బాయిలతో రూమ్‌ షేర్ చేసుకున్న అర్జున్ రెడ్డి బ్యూటీ.. అలా దుస్తులు మార్చుకున్నా..!

Shalini Pandey: అబ్బాయిలతో రూమ్‌ షేర్ చేసుకున్న అర్జున్ రెడ్డి బ్యూటీ.. అలా దుస్తులు మార్చుకున్నా..!


శ్రీరాముడితో పాటు భరత శత్రుజ్ఞులు కొలువై ఉన్న ఏకైక దేవాలయం ఇదే

మన దేశంలో చాలా రామాలయాలు చూసి ఉంటాం, లేదా వాటి గురించి వినే ఉంటాం కానీ ఇక్కడ మనం చూసే రామాలయం అన్నిటితో పోల్చుకుంటే కొంత విభిన్నంగా ఉంటుంది. ఎందుకంటే మనకు రామాలయం అనగానే గుర్తుకొచ్చే దేవుళ్ళు రాముడు, సీత,లక్ష్మణుడు హనుమంతుడు, మాత్రమే గుర్తుకొస్తారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో దాదాపు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రామాలయంలో రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, భరత శత్రజ్ఞులతో తోపాటు హనుమంతుడు, గరుగ్మంతుడు ఒకే రాయి పైన వెలవడడం ఈ ఆలయం ప్రత్యేకత. ఇక ఇదే విషయంపై ఆలయ పూజారి రామకృష్ణ చార్యులు లోకల్ 18 తో మాట్లాడుతూ..ఈ దేవాలయ అర్చకత్వం అనేది పూర్వీకుల నుండి వస్తుందని దాదాపు 70 సంవత్సరాల నుండి ఈ రాములవారికి మేము పూజలు చేస్తున్నామని,వారి పూర్వీకులు చెప్పిన ప్రకారం దాదాపు 300 సంవత్సరాల క్రితం ఆలయము, ఈ ఆలయంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా శ్రీరాముడు తన ముగ్గురు తమ్ముళ్ళతో స్వయంభుగా వెలిశాడు.. ఈ స్వామివారికి పూజలు అందించడం వారి వంశం పూర్వజన్మ సుకృతం అని గత డెబ్బై సంవత్సరాల నుండి స్వామివారికి వారే స్వయంగా నిత్య కైంకర్యాలు సమర్పిస్తున్నారని గ్రామ పెద్దల ఇతరుల దాతల ద్వారా దేవాలయానికి కొంచెం మరమ్మత్తులు చేయించారని ఈ స్వామి వారిని మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుస్తారని గ్రామ ప్రజలు ఏ శుభకార్యం చేయాలన్నా ఈ శ్రీరాముని దర్శించుకున్న తర్వాతే ఏ కార్యక్రమాన్నా మొదలు పెడతారని చెప్పారు. ఇది ఎంత పురాతనమైందో తెలుసుకోవడానికి పురావర్త శాఖ వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ వారికి కూడా అంతుచిక్కలేదని ఈ దేవాలయంలో రాముడు లక్ష్మణుడు భరత శత్రజ్ఞులతో స్వయంభుగా వెలసిన దేవాలయం దేశంలోనే ఇదొక్కటే ఉందన్నారు.


Telangana Police | తొలిసారి ‘బాహుబలి’ బారికేడ్లు

నిరుద్యోగ మార్చ్‌ పేరిట తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం టీజీపీఎస్సీని ముట్టడిని అడ్డుకోవడానికి రాష్ట్రంలో తొలిసారిగా బాహుబలి బారికేడ్లను ప్రయోగించారు.


ఆ హౌలాగాన్ని చూసి ఎవరూ ఓట్లెయ్యలే

ఆ హౌలాగాన్ని చూసి ఎవరూ ఓట్లెయ్యలే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​ బండగట్టుకుని బాయిల దుంకిండు: కేటీఆర్​  దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ పోటీచేయాలని సవాల్ జగిత్యాల, వెలుగు: ‘ఆ హౌలాగాన్ని చూసి ఎవరూ ఓట్లెయ్యలేదు.. మీరంతా కలిసి  కష్టపడితే ఒక్కడు ఎమ్మెల్యే అయ్యిండు.. రాజకీయాల్లో హత్యలు ఉండవు..  ఆత్మహత్యలే  ఉంటయ్. జగిత్యాల ఎమ్మెల్యే బండకట్టుకొని బాయిలో దుంకి ఆత...


SEBEX 2 | భారత సాయుధ బలగాలకు గేమ్‌ ఛేంజర్‌.. విధ్వంసం సృష్టించే సెబెక్స్‌-2

సైనిక బలగాల శక్తిని మరింత పెంచే, అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని భారత్‌ తయారుచేసింది. నాగపూర్‌కు చెందిన ‘ఎకనమిక్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌' సంస్థ అభివృద్ధి చేసిన ‘సెబెక్స్‌-2’ను భారత నేవీ విజయవంతంగా పరీక్షించింది.


Bhole Baba: ప‌రారీలో భోలే బాబా.. కొన‌సాగుతున్న పోలీసుల సెర్చ్ ఆప‌రేష‌న్‌

Bhole Baba: భోలే బాబా పరారీలో ఉన్నారు. స‌త్సంగ్ తొక్కిస‌లాట త‌ర్వాత అత‌ని ఆచూకీ లేదు. అత‌ని కోసం పోలీసులు వెతుకుతున్నారు. రామ్ కుటీర్ ట్ర‌స్టు ఆశ్ర‌మంలో పోలీసులు సోదాలు చేశారు. మ‌రోవైపు తొక్కిస‌లాట మృతుల సంఖ్య 121కి చేరింది.