కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా మారి `చారి 111` చిత్రంలో నటించారు. జేమ్స్ బాండ్ మూవీస్ తరహాలో ఈ చిత్రాన్ని కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. బాండ్ స్టయిల్ ఫాలో అయినా, ఆద్యంతం నవ్వులు పూయించేలా ఈ మూవీని తీర్చిదిద్దారు దర్శకుడు టీజీ కీర్తి కుమార్. మార్చి 1న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ఫర్వాలేదనిపించుకుంది. వెన్నెల కిశోర్తోపాటు మురళీ శర్మ, సత్య, తాగుబోతు రమేష్ల కామెడీకి మంచి ప్రశంసలు దక్కాయి. హీరోయిన్ సంయుక్త విశ్వనాథన్ గ్లామర్, యాక్షన్ సినిమాకి ప్లస్ అయ్యింది.
ఇదిలా ఉంటే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్లో నడుస్తుంది. థియేటర్లోకి వచ్చిన నెల రోజులకంటే ముందే ఓటీటీలోకి వచ్చిందీ మూవీ. అయితే ఇప్పటికీ ఇది ట్రెండింగ్లో ఉండటం విశేషం. కామెడీ ఎంటర్టైనర్ జోనర్లో ఈ మూవీ టాప్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. థియేటర్లో ఈ మూవీని ఫ్యామిలీ ఆడియెన్స్ చూడలేదు. దీంతో ఓటీటీలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి వ్యూస్ రికార్డు స్థాయిలో నమోదు కావడం విశేషం.
పెద్ద పెద్ద హీరోల సినిమాలను మించి వెన్నెల కిశోర్ నటించిన `చారి 111` కి మంచి ఆదరణ దక్కుతుండటం మరో విశేషం. ఇప్పటి వరకు ఈ మూవీకి సుమారు 70 మిలియన్స్ కి పైగా వ్యూస్ మినిట్స్ నమోదు అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికీ ఇది టాప్ 10లో రన్ అవుతుండటం విశేషం. ఇది మున్ముందు మరింతగా రచ్చ చేసే అవకాశం ఉంది.
మరి `చారి111` కథ విషయానికి వస్తే.. రుద్రనేత్ర పేరుతో ఆర్మీ ఆఫీసర్ ప్రసాద్రావు(మురళీ శర్మ) నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఎజెన్సీను ఏర్పాటుచేస్తాడు ముఖ్యమంత్రి (శుభలేఖ సుధాకర్) . హైదరాబాద్లోని ఓ మాల్లో బాంబ్బ్లాస్ట్ జరుగుతుంది. ఈ కేసును రుద్రనేత్రకు చెందిన స్పెషల్ ఏజెంట్ చారి (వెన్నెలకిషోర్) చేపడతాడు. సీరియస్ ఇష్యూను సిల్లీగా మార్చేసి రచ్చ రచ్చ చేస్తుంటాడు చారి. ఈ బాంబు బ్లాస్ట్ కేసులోని అసలైన నేరస్తులను చారి కనిపెట్టాడా? కెమికల్ క్యాప్సుల్స్తో బాంబు బ్లాస్ట్లకు పాల్పడుతోన్న రావణ్కు ప్రసాదరావుతో ఉన్న సంబంధం ఏమిటి? చారితో పాటు మరో ఏజెంట్ ఈషా (సంయుక్త విశ్వనాథన్) రావణ్ను పట్టుకున్నారా? సీరియస్ కేసు సాల్వ్ చేసే క్రమంలో చారికి ఏమైందనేది ఈ మూవీ స్టోరీ. ఆద్యంతం ఫన్నీగా ఈ మూవీ సాగుతుంది.
2024-04-24T18:10:01Z dg43tfdfdgfd