ఐశ్వర్య రాయ్, కత్రినా కాదు.. ఈ హీరోయిన్ని పెళ్లి చేసుకోవాలని కలలు కన్న సల్మాన్.. కానీ!
బాలీవుడ్ సూపర్స్టార్లలో సల్మాన్ ఖాన్ ఒకడు. సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్కి సంబంధించి సల్మాన్ ఖాన్ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. ముఖ్యంగా, సల్మాన్ చాలా మంది హీరోయిన్లతో రిలేషన్షిప్ మెయింటైన్ చేశాడనే రూమర్ ఉంది. దరితో అయితే దాదాపు పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయిన ఘటనలు ఉన్నాయి. సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్, కత్రినలని పెళ్లి చేసుకుందామని ట్రై చేసి విఫలమైన సంగతి తెలిసిందే. అయితే, వీరి కన్నా ముందు ఓ హీరోయిన్ని సల్లు భాయ్ మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడనే విషయం మీకు తెలుసా? అలనాటి బాలీవుడ్ హీరోయిన్ జుహి చావ్లాను సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఈ విషయాన్ని ఈ స్టార్ హీరోనే స్వయంగా వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే, జుహి చావ్లా తండ్రి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో అక్కడితో కథ ముగిసినట్లు సల్మాన్ చెప్పుకొచ్చాడు. ‘జుహి మనసు ఎంతో స్వచ్ఛమైనది. స్ఫూర్తిదాయకమైన అమ్మాయి. మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తారా అని జుహి వాళ్ల నాన్నను అడిగాను. కానీ, ఆయన నో చెప్పారు. దీనికి కారణమేంటో నాకు కూడా తెలియదు. నేను అడగలేదు. బహుశా వారికి సరిపోనేమో కావొచ్చు’ అని సల్మాన్ చెప్పాడు. కలిసి సినిమాలు చేయలేదుజుహి చావ్లా, సల్మాన్ ఖాన్ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. గోవింద, అనిల్ కపూర్, జుహి చావ్లా లీడ్ రోల్స్ చేసిన ‘దీవానా మస్తానా’ సినిమాలో సల్మాన్ కేమియోగా నటించాడు. జుహి చావ్లా వ్యాపారవేత్త జే మెహతాను పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు సంతానం. కానీ, సల్మాన్ ఖాన్ మాత్రం అలాగే బ్యాచిలర్గా మిగిలిపోయాడు. 58 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోకుండా ఉంటున్నాడు. సల్మాన్ మాట్లాడిన ఈ వీడియోను ఓ ఎక్స్(ట్విటర్) యూజర్ షేర్ చేయగా వైరల్ అవుతోంది. దీంతో ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. ‘హార్ట్ బ్రేకింగ్ మూమెంట్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో హీరోయిన్తో పెళ్లి క్యాన్సిల్సంగీత బిజ్లానీ అనే మరో హీరోయిన్ని కూడా సల్మాన్ పెళ్లి చేసుకుందామని ట్రై చేశాడు. పెళ్లి పత్రికలు కూడా ప్రింట్ చేయించి అతిథులకు పంచిపెట్టారు. కానీ, పెళ్లికి ముందు సల్మాన్ ఖాన్ చీటింగ్ చేయడంతో సంగీత పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ఈ విషయాన్ని సల్మానే ‘కాఫీ విత్ కరన్’ షోలో వెల్లడించాడు. కెరీర్పై సల్మాన్ ఫోకస్సల్మాన్ ఖాన్ కెరీర్ మునపటిలా లేదు. కిసీ కా భాయ్ కిసీ కా జాన్, టైగర్ 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో సల్మాన్ ఆశలన్నీ సికిందర్ సినిమాపైనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సత్యరాజ్, సునీల్ షెట్టి, రష్మిక మందన్న, తదితరులు ఇందులో కీ రోల్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా సినిమా రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.
2024-07-05T09:47:32Z
బ్రహ్మముడికి అంటే ఏమిటి? దానికి అంత ప్రాముఖ్యత ఉందా!
హిందువులు వివాహ వేడుకలలో అనేక ఆచారాలు, సంప్రదాయాలతో పాటిస్తుంటారు. తాళిబొట్టు కట్టడం, మెట్టెలు పెట్టడం, ఏడడుగులు నడవడం వంటి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఆచారాల ద్వారా ఇద్దరు వ్యక్తులు పవిత్రమైన అనుబంధంలోకి అడుగు పెడతారు. హిందూ వివాహాల్లో అలాంటి ఒక ముఖ్యమైన సంప్రదాయం బ్రహ్మముడి (గత్బంధన్). ఈ ఆచారంలో వధువు దుపట్టాను వరుడు ధరించే పింక్ స్కార్ఫ్/కండువా/పంచెతో కలిపి ముడి వేస్తారు. ఇది వారి ఐక్యతను సూచిస్తుంది. జీవితాంతం కలిసి ఉండాలనే కోరికను సూచిస్తుంది. బ్రహ్మముడి ప్రాముఖ్యత : బ్రహ్మముడి అనేది జీవితాన్ని కలిసి గడపాలని నిర్ణయించుకున్న ఇద్దరి వ్యక్తుల మధ్య ఏర్పడిన పవిత్రమైన బంధానికి సింబల్గా నిలుస్తుంది. ఈ ఆచారంలో వరుడి కండువా (పొడవైన స్కార్ఫ్), మహిళ దుపట్టాను ఒక పవిత్రమైన దారంతో కలిపి ముడి వేస్తారు. ఈ ముడి ద్వారా తాము లైఫ్ లాంగ్ ఒకటిగా ఉంటామని వధూవరులు ప్రమాణం చేస్తారు. దీని ద్వారా ఒకరినొకరు గౌరవించుకుంటామని, ప్రేమించుకుంటామని కూడా ప్రామిస్ చేస్తారు. ఒక యువకుడు, ఒక యువతి ఒకరితో ఒకరు జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ బంధాన్ని పవిత్రంగా గుర్తించడానికి ఒక ముడిని కడతారు. ఇది వధూవరుల మధ్య జీవితాంతం నెలకొనే అవినాభావ బంధాన్ని సూచిస్తుంది. హిందూ వివాహాల్లో బ్రహ్మముడి : హిందూ వివాహంలో, వరుడి సోదరి బ్రహ్మముడిని కడుతుంది. ఈ ముడి ద్వారా వధువును కొత్త కుటుంబ సభ్యురాలిగా అంగీకరిస్తున్నామని వరుడు, అతడి కుటుంబ సభ్యులు తెలియజేస్తారు. పెళ్లిలో వధూవరులు తమ మెడల చుట్టూ కండువాలను మార్చుకోవడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ స్కార్ఫ్స్ వారి మధ్య ఏర్పడిన శాశ్వత బంధాన్ని సూచిస్తాయి. వరుడు తన భార్యకు కండువాను బహుమతిగా ఇవ్వడం ద్వారా, ఆమెను తన జీవితంలో ఒక భాగంగా స్వీకరిస్తానని, ఎల్లప్పుడూ రక్షిస్తానని, ఆమెను ప్రేమిస్తానని వాగ్దానం చేస్తాడు. వధువు తన భర్తకు తన స్కార్ఫ్ను బహుమతిగా ఇవ్వడం ద్వారా, అతడిని గౌరవిస్తానని, అతడికి విధేయురాలిగా ఉంటానని, అతనితో కలిసి జీవితాన్ని పంచుకుంటానని వాగ్దానం చేస్తుంది. మరణం వరకు ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, గౌరవించుకోవడానికి, మద్దతు ఇవ్వడానికి వారు ప్రమాణం కూడా చేస్తారు. ఈ ఆచారం జరిగిన తర్వాత, కొత్త దంపతులు తాము మానసికంగా, భావోద్వేగపరంగా, శారీరకంగా ఒకరితో ఒకరు కలిసి ఉంటామని నమ్ముతారు. ఇది ఒకే ఆత్మగా మారిన ఇద్దరి వ్యక్తుల సంబంధాన్ని సూచిస్తుంది. బ్రహ్మముడి ద్వారా, వధూవరులు తమ ఆనందాలు, బాధలు, ఆస్తులు, బాధ్యతలను పంచుకునే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటారు. బ్రహ్మముడి సమయంలో వరుడి పొడవైన కండువాకు ఐదు పవిత్ర వస్తువులు జోడిస్తారు. అవి నాణెం, పువ్వు, బియ్యం, పసుపు, దుర్వా గడ్డి. ఈ వస్తువులు వారి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తాయి. నాణెం డబ్బుపై ప్రతి ఒక్కరికీ సమాన హక్కు ఉందని, అందరి అవసరాలకు అనుగుణంగా దానిని ఉపయోగించాలని సూచిస్తుంది. పూలు, వధూవరులు ఒకరితో ఒకరు సంతృప్తిగా ఉంటారని సూచిస్తాయి. పసుపు, వధూవరులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తుంది. దుర్వా గడ్డిలాగా వధూవరులు ఇద్దరూ చిర యువ, ఉత్సాహంగా ఉండాలని సూచిస్తుంది. బియ్యం , జంటలో ఎవరూ ఆకలితో బాధపడకుండా ఉండేంతగా తినాలని సూచిస్తుంది. మూడు ముడులు : బ్రహ్మముడిలో మూడు ముడుల్లో ప్రతి ముడికి ఓ ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. మొదటి ముడి హక్కులను సూచిస్తుంది. దంపతులు ఒకరిపై ఒకరు హక్కులు కలిగి ఉంటారని ఈ ముడి అర్థం. రెండో ముడి బంధాన్ని తెలియజేస్తుంది. మూడో ముడి, ప్రపంచాన్ని సూచిస్తుంది. ప్రపంచంలోని అందరినీ గౌరవించాలని ఈ ముడి తెలుపుతుంది. అగ్ని దేవుడు పవిత్రత, శక్తికి చిహ్నం. కొత్త దంపతులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా, దేవుడి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు.
2024-07-05T13:03:08Z