ANANT AMBANI: అనంత్ అంబానీ చేతివాచీకి పెట్టిన ఖర్చుతో పదివేల కుటుంబాలు నెలరోజులు బతికేస్తాయి

అనంత్ అంబానీ పెళ్లి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వైరల్ గా మారింది. అనంత్ అంబానీ - రాధిక మర్చెంట్ నిశ్చితార్ధం, ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగా వైభవంగా జరిగాయి. ఇప్పుడు మరోసారి ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహిస్తున్నారు. పెళ్లికి ముందు అనంత్ అంబానీ ఆలయాలను సందర్శిస్తున్నారు. మహారాష్ట్రలోని నేరల్ లోని కృష్ణ కాళీ ఆలయాన్ని తాజాగా అనంత్ అంబానీ సందర్శించారు. అమ్మవారి ఆశీర్వాదాన్ని కోరుతూ ఆలయంలో హవన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత్ ధరించిన గడియారం అందరి దృష్టిని ఆకర్షించింది. దాని ధర తెలిస్తే అందరూ షాక్ అయిపోతారు.

అనంత్ అంబానీకి అద్భుతమైన వాచీలను సేకరించే అలవాటు ఉంది. వాటిలో ఖరీదైన పాటెక్ ఫిలిప్, రిచర్డ్ మిల్లే నుండి అరుదైన వాచీలు ఉన్నాయి. కృష్ణ కాళీ ఆలయ సందర్శన సమయంలో, అనంత్ రిచర్డ్ మిల్లే వాచీని పెట్టుకున్నారు. ఎరుపు రంగు కార్బన్ రిచర్డ్ మిల్లే వాచ్ (ఆర్ఎం 12-01 టూర్బిల్లాన్)ను ఆయన పెట్టుకున్నారు. దీని ధర రూ.6.91 కోట్లు (828,000 డాలర్లు) అని ఇన్స్టాగ్రామ్ పేజీ 'ది ఇండియన్ హోరాలజీ' తెలిపింది. ఇది లిమిటెడ్ ఎడిషన్ వాచ్. అంటే చాలా తక్కువగా మాత్రమే తయారుచేస్తారు. ఇప్పటివరకు 18 వాచీలు మాత్రమే రూపొందించారు.

మన దేశంలో కొన్ని కుటుంబాలు కేవలం నెలకు ఆరు వేల రూపాయలతో జీవిస్తున్నారు. అనంత్ అంబానీ వాచీ ఖరీదు ఆరుకోట్ల 91 లక్షల రూపాయలు. అంటే మనదేశంలోని పదివేల పేద కుటుంబాలు ఆ డబ్బులతో నెల రోజులు జీవిస్తాయి.

అంతకుముందు ఇషా అంబానీ తన సోదరుడి వివాహం సందర్భంగా కృష్ణ కాళీ ఆలయాన్ని సందర్శించారు. ఆనంద్ పిరమల్, ఇషాతో కలిసి హవన్ కార్యక్రమం నిర్వహించారు. అనంత్ అంబానీ ఈ నెలలో రాధికా మర్చంట్ ను వివాహం చేసుకోనున్నారు. జులై 12న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. జూలై 12 నుంచి 14 వరకు మూడు రోజుల పాటు వివాహ వేడుకలు జరగనున్నాయి. చిన్ననాటి స్నేహితులైన ఈ జంట తర్వాత ప్రేమికులగా మారారు. వారి ప్రేమకు కుటుంబసభ్యుల నుంచి సమ్మతి లభించింది.

అంచానీ కుటుంబ వివాహాలు, ఫంక్షన్లలో రాధికా ముందు నుంచే కనిపించడం మొదలుపెట్టింది. కానీ అంబానీ కుటుంబం వారి నిశ్చితార్థం వరకు వారి సంబంధాన్ని గోప్యంగా ఉంచింది.

2023 జనవరి 19న ముంబైలో జరిగిన గోల్ ధన వేడుకలో అనంత్, రాధిక నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత మార్చిలో జామ్ నగర్ లో గ్రాండ్ గా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. జూన్ లో ఇటలీలో విలాసవంతమైన విహారయాత్రకు స్నేహితులను, కుటుంబ సభ్యులను అంబానీ కుటుంబం తీసుకెళ్లింది.

2024-07-01T06:10:47Z dg43tfdfdgfd