CHANDRABABU | మీ కష్టాలు చూసి చలించిపోయా.. పింఛన్‌దారులకు చంద్రబాబు ఎమోషనల్‌ లేఖ

Chandrababu | ఎల్లుండి నుంచి ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ జరగనుండటంతో పింఛన్‌దారులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ లక్ష్యమని తెలిపారు. జూలై 1వ తేదీ నుంచి ఇంటి దగ్గరే పింఛన్లు అందిస్తామని పేర్కొన్నారు.

ఆర్థిక సమస్యలు ఉన్నా ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నామని పింఛన్‌దారులకు రాసిన లేఖలో చంద్రబాబు తెలిపారు. చెప్పినట్లుగా ఒకేసారి పెన్షన్‌ను రూ.వెయ్యి పెంచామని పేర్కొన్నారు. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా రూ.819 కోట్ల భారం పడనుందని చెప్పారు.

పెన్షన్ల విషయంలో గత ప్రభుత్వం ఎంతో క్షోభ పెట్టిందని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మూడు నెలలు మీ కష్టాలు చూసి చలించిపోయానని అన్నారు. మండుటెండలో, వడగాడ్పుల మధ్య మీరు పడిన ఆగచాట్లు చూశానని అన్నారు. ఏప్రిల్‌ నెల నుంచే పింఛన్‌ పెంపును వర్తింపజేస్తానని మాట ఇచ్చానని.. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకూ పెంపును వర్తింపజేసి అందజేస్తున్నామని పేర్కొన్నారు.

2024-06-29T05:23:12Z dg43tfdfdgfd