తల్లి, అక్క మందలించారని సూసైడ్
వికారాబాద్, వెలుగు: తల్లి, అక్క మందలించారని ఓ యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లాలోని కరణ్ కోట పీఎస్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ ఐ విఠల్ రెడ్డి తెలిపిన ప్రకారం.. తాండూరు మండలం, మల్కాపూర్ కు చెందిన అక్కలపల్లి లాలమ్మ కొడుకు వెంకటప్ప(26) ఎలాంటి పని చేయకుండా ఇంటి వద్దనే ఉంటుండగా.. ఏదైనా పని చూసుకోవాలని పలుమార్లు తల్లి, అక్క మందలించారు.
దీంతో పని చేయమని చెబితే చనిపోతానంటూ వెంకటప్ప బెదిరించేవాడు. గురువారం ఉదయం మరోసారి తల్లి అక్క మందలించగా.. తను చనిపోతానంటూ ఇంట్లోంచి బయటికి వెళ్లిపోయాడు. గ్రామ శివారులో ఓ కుంటలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. డెడ్ బాడీని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి లాలమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
జీడిమెట్ల, వెలుగు: మనస్తాపం ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన ప్రకారం... విజయనగర్కాలనీకి చెందిన శ్రీదేవి కూతురు వైష్ణవి (20) ఇంజనీరింగ్థర్డ్ ఇయర్ చదువుతోంది. శ్రీదేవి భర్త సూర్యారావు మూడేండ్ల కిందట అనారోగ్యంతో చనిపోయాడు. తండ్రి మృతి తర్వాత వైష్ణమి ఎవరితో సరిగా మాట్లాడేది కాదు. నాన్న లేకుండా బతకడం కష్టంగా ఉందంటూ మనస్తాపం చెందేది. 4 నెలల నుంచి తలనొప్పి రావడంతో వైష్ణవి ఆరోగ్య పరంగా ఇబ్బంది పడుతుంది. బుధవారం సాయంత్రం తల్లి శ్రీదేవి వాకింగ్కు వెళ్లగా ఇంట్లో ఎవరూలేని సమయంలో బెడ్రూమ్లో వైష్ణవి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
©️ VIL Media Pvt Ltd. 2024-04-19T05:15:41Z dg43tfdfdgfd