స్టార్ హీరోయిన్ డైవర్స్ కన్ఫామ్.. కూతురితోనే ఉంటానంటున్న 35ఏళ్ల నటి
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన మరో నటి ఇప్పుడు వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పింది. భర్త నుంచి విడాకులు తీసుకొని ..సింగిల్ గా ఉంటున్నట్లుగా మెసేజ్ పెట్టింది. ఇంతకీ ఆ నటి ఎవరో కాదు మలయాళ నటి రేఖిత కురుప్ . భామగా ప్రసిద్ధి చెందిన ఈ నటి డైవర్స్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వ్యాపారవేత్త అరుణ్ జగదీష్తో వైవాహిక జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా అప్లోడ్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో భామ "నేను ఎంత బలంగా ఉన్నానో నాకు ఎప్పుడూ తెలియదు" అని క్యాప్షన్లో రాసింది. ఎక్కడ నేను ఒంటరి తల్లి అయ్యే వరకు నాకు ఉన్న ఏకైక ఎంపిక బలం తన కూతురే అని ఉంది. ఈ మాటలు తన జీవిత భాగస్వామి నుండి భామ విడాకుల వార్తను బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. క్యాప్షన్తో పంచుకున్న ఫోటోలో నటి తన కుమార్తె గౌరీ పిళ్లైతో కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపించింది. 35 ఏళ్ల నటి సుందరి కన్నల్ ట్రాక్ను తీసుకుంది. అయితే, ఈ వార్తలకు సంబంధించి అధికారిక ధృవీకరణ లేదు. అయితే ఈ భామ సోషల్ మీడియా పోస్ట్లో కొన్ని మార్పులు చేసి విడాకుల పుకారు ఇప్పుడు దుమారం రేపుతోంది. భామ తాజా పోస్ట్కు మద్దతిస్తున్నారు ఫాలోవర్స్. మీ పాప ఆ వయస్సులో ఉన్నప్పుడు, మీరు ఎంత బలంగా ఉన్నారో తెలిసినప్పుడు మీ గురించి చాలా గర్వపడాలని కామెంట్ చేశారు. మరొకరు ఈ భామ బలంగా ఉండాలని కోరుకుంటూ, “ఒంటరి తల్లి కావడం అంత తేలికైన పని కాదు. మరికొందరు కూడా ఆయన దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. భామ విడాకుల నిర్ధారణ వివాహ ఫోటోను సోషల్ మీడియా నుండి తొలగించారు. అలాగే, తన భర్తతో కలిసి వెకేషన్ ఫోటోలను కూడా తొలగించింది. నటి ఇప్పుడు తన కుమార్తెతో ఉన్న ఫోటోలను మాత్రమే పోస్ట్ చేస్తుంది. అయితే ఇంతకుముందు ఆమె ఫ్యామిలీ ఫోటోలను పోస్ట్ చేసేది. పెళ్లి తర్వాత 35 ఏళ్ల నటి సినీ పరిశ్రమను వదిలి తన భర్త వ్యాపారంలో చేరుతుందని పుకార్లు వచ్చాయి. ఈ భామ తన సొంత దుస్తుల బ్రాండ్ను కూడా ప్రారంభించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అరుణ్ కూడా కనిపించారు. ఈ వేడుకలో నటులు అబూ సలీం, రియాజ్ ఖాన్, దర్శకుడు నాదిర్షా తదితరులు పాల్గొన్నారు. కొట్టాయంలో జరిగిన హిందూ సంప్రదాయ వివాహ వేడుకలో నివేద్యం నటి అరుణ్తో ముడి పడింది. తమ కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో కలకాలం కలిసి ఉంటామని ఇద్దరూ ప్రమాణం చేశారు. ఈ భామ తన పెళ్లి రోజు ఎరుపు రంగు కాంచీపురం చీరలో మెస్మరైజింగ్ గా కనిపించింది. అయితే భామ డైవర్స్ వార్తపై ఇప్పటికి క్లారిటీ రానప్పటికి తాజాగా పెట్టిన పోస్ట్ తో మాత్రమే ఫాలోవర్స్, ఫ్యాన్స్ భర్తతో విడిపోయిందని డిసైడ్ అవుతున్నారు.
2024-05-10T02:09:58Z
శ్రీశైలం వెళ్లినప్పుడు ఇలా చేస్తే అరిష్టాలన్నీ పోతాయ్.. అనుకున్నవి జరగాల్సిందే
నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంభిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ఆలయ ఈవో డి.పెద్ది రాజు ఆధ్వర్యంలో వీరభద్ర స్వామికి విశేష పూజ కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం అమావాస్య ఘడియలు రావడంతో శ్రీశైల మహాక్షేత్రంలో లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీ బయలు వీరభద్రస్వామికి విశేష పూజలు నిర్వహించారు. ప్రతి మంగళవారం, అమావాస్య రోజుల్లో శ్రీ బయలు వీరభద్రస్వామి వారికి శ్రీశైల దేవస్థానం వేద పండితులు, అర్చకులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీశైలం బయలు వీరభద్ర స్వామి వారి పరోక్ష సేవ ద్వారా 21 మంది భక్తులు ఈ విశేష పూజలను చేస్తారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుండి కూడా భక్తులు ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరభద్ర స్వామికి ప్రతి అమావాస్య రోజులలో విశేష అర్చనను నిర్వహించడం సంప్రదాయబద్ధంగా వస్తూ ఉంది. కావున అమావాస్య రోజున భక్తులు కూడా పరోక్ష సేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశాలు దేవాదాయ శాఖ అధికారులు కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల భక్తులు కూడా ఈ పూజలు జరిపిస్తున్నారు. ఈ పూజాధికాల కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వహించేందుకు ముందుగా మహాగణపతి పూజ జరిపించారు. ఈ పూజ కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు ముందుగా పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధ జలాలతో వీరభద్ర స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. ఈ స్వామి ఆరాధనతో గ్రహ దోషాలు నివారిస్తారన్నారు. అరిష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పారు, ఎంత క్లిష్ట సమస్యలైనా పరిష్కారం అవుతాయని, ప్రమాదాలు నివారించబడతాయన్నారు. సర్వ కార్యానుకూలత లభిస్తుందని స్పష్టం చేశారు, ప్రజల అభీష్టం సిద్ధిస్తుందని పండితులు తెలిపారు. ఈ పరోక్ష సేవ కోసం ఆన్ లైన్ ద్వారా భక్తులు రూ.1,116 సేవా రుసుము చెల్లించాల్సి ఉంటుదన్నారు. భక్తులు సేవా రుసుము www.srisailadevasthanam.org లేదా aptemples.ap.gov.in ద్వారా చెల్లించాల్సి ఉంటుందన్నారు. కాగా, ఈ పరోక్ష సేవ ప్రత్యక్ష ప్రాసారాన్ని వీక్షించేందుకు వీలుగా సేవాకర్తలకు ప్రసార వివరాలు, ప్రసారాల సమయం తదితర వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తామని శ్రీశైలం ఈఓ డీ పెద్ది రాజు అన్నారు. సేవా కర్తలతోపాటు భక్తులు కూడా శ్రీశైల టీవీ/ యూ-ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు అన్నారు. కనుక భక్తులందరు కూడా ఈ పరోక్ష సేవను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాల కోసం దేవస్థానం సమాచార కేంద్రం ఫోన్ నంబర్లు 8333901351 / 52 / 53 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చునని చెప్పారు. నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంకం మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ఆలయ ఈవో డి.పెద్ది రాజు గారి ఆధ్వర్యంలో వీరభద్ర స్వామికి విశేష పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ పూజాదికాలలో పంచామృతాలతోను. బిల్వోధవ కం కుంకుమేదకం. హరిద్రోదకం. భష్మోదకం. గందోదకం. పుష్పోదకం. శుద్ధ జలాలతో వీరభద్ర స్వామి వారికి అభిషేకం నిర్వహించబడుతుంది శ్రీశైలం బయలు వీరభద్ర స్వామి వారి పరీక్ష సేవ ద్వారా 21 మంది భక్తులు ఈ విశేష పూజలను జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక తమిళనాడు నుండి కూడా భక్తులు ఈ పూజా కార్యక్రమాన్ని జరిపించుకుంటారు వీరభద్ర స్వామికి ప్రతి అమావాస్య రోజులలో విశేష అర్చనను నిర్వహించడం సంప్రదాయబద్ధంగా వస్తూ ఉంది కావున అమావాస్య రోజున భక్తులు కూడా పరోక్ష సేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశాలు దేవాదియ శాఖ అధికారులు కల్పించారు. పూజా అధికారులు ఈ పూజ కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
2024-05-10T11:55:08Z
ఎన్టీఆర్ ఫ్యాన్స్కు భారీ శుభవార్త.. తెలిస్తే ఎగిరిగంతేస్తారు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించి ప్యాన్ ఇండియా రేంజ్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ సినిమాలో ఆయన కొమురం భీమ్ పాత్రలో ఒదిగిపోయారు. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు.. జాన్వీ హీరోయిన్గా చేస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 5న వస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా వాయిదా పడింది. Photo : Twitter ఈ చిత్రాన్ని అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా తెలిపారు. అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై సుధాకర్ మిక్కిలినేని, కే. హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇక అది అలా ఉంటే, ఈ సినిమా ప్రమోషన్స్లో ఫస్ట్ లిరికల్ త్వరలో విడుదలకానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి టీమ్ ఒక ప్రకటనను కూడా ఇచ్చింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నా.. ఈ పాట అతి త్వరలో విడుదలకానుందని అంటున్నారు. మే 20న తారక్ పుట్టినరోజు కానుకగా వస్తుందని టాక్. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రటకన రానుంది.. Photo : Twitter ఇక ఈ సినిమా ఓవర్ సీస్ డీల్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. దేవర సినిమా ఓవర్సీస్ రైట్స్ 27 కోట్ల మేరకు క్లోజ్ అయ్యి బజ్ వినిపిస్తోంది. ఇక నైజాలో మాత్రం 50 కోట్ల రేంజ్లో రేట్ కోట్ చేస్తున్నారట నిర్మాతలు.. అయితే ఈ రైట్స్ కోసం దిల్ రాజు గట్టిగానే ప్రయత్నం చేస్తు్న్నారట. అంతేకాదు దాదాపుగా దిల్ రాజు డీల్ క్లోజ్ చేసినట్లు టాక్ నడుస్తోంది. . Photo : Twitter ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తోంది. జాన్వీ హీరోయిన్గా చేస్తోంది. భారీ అంచనాలపై వస్తున్న ఈ సినిమాపై నెక్స్ట్ లెవల్లో అంచనాలున్నాయి. రెండు పార్ట్లుగా వస్తోంది. ఇక మొదటి భాగం దసరాకు అక్టోబర్లో విడుదల కానుందని ప్రకటించారు. ఇక ఈ చిత్రం ఓటీటీ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా ఓటీటీ హక్కులని నెట్ ఫ్లిక్స్ ఏకంగా 155 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నట్టుగా ఓ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. Photo : Twitter ఈ సినిమాలో ఇప్పటికే కీలక పాత్రలో రమ్యకృష్ణని తీసుకోబోతున్నారట దర్శక నిర్మాతలు. ఎన్టీఆర్కి అత్త క్యారెక్టర్లో రమ్యకృష్ణ కనిపించనున్నారని తెలుస్తోంది. గతంలో కూడా ఇలానే ఎన్టీఆర్, రమ్యకృష్ణలు నా అల్లుడు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్గా ఈ సినిమాలో ఎన్టీఆర్ అక్క పాత్ర కోసం మంచు లక్ష్మిని ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చాలా కీలకంగా ఉంటుందట. దీనికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Twitter ఈ సినిమా ఇండియన్ భాషాల్లోనే కాకుండా.. జపనీస్, చైనీస్ ఇలా దాదాపుగా ఓ తొమ్మిది భాషాల్లో విడుదలకానుందట. అందుకు తగ్గట్లుగానే కథను రెడీ చేస్తున్నారట దర్శకుడు కొరటాల. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్కు ఇటు ఇండియాలోనే కాకుండా అటు వెస్ట్రన్ కంట్రీస్లోను క్రేజ్ ఏర్పడింది. దీంతో టీమ్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ .ఇక ఈ ఇద్దరి కాంబినేషన్లో జనతా గ్యారేజీ వచ్చి మంచి విజయం సాధించింది. ఇక రెండో సారి ఈ కాంబినేషన్లో సినిమా అనగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. Photo : Twitter ఇక ఎన్టీఆర్ హిందీలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. జై లవకుశ మూవీలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారట. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఇండియా వైడ్గా ఎంతో పాపులర్ అయ్యారు. ఎన్టీఆర్ ప్రతిష్టాత్మక వార్ 2లో సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. Photo : Twitter ఈ సినిమాలో హృతిక్ రోషన్ మరో కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా 35 కోట్ల రూపాయల పారితోషికంను అందుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా తెలుగు డబ్బింగ్ రైట్స్ విషయంలో కూడా లాభాల్లో వాటాను దక్కించుకునేలా ఒప్పందం కుదిరినట్లుగా టాక్ నడుస్తోంది. ఇక ఈ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో నటించబోతున్నాడు. Photo : Twitter ఇక ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సినిమా ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా 2022మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది. Photo : Twitter ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్లుతెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేశారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు.. Photo : Twitter
2024-05-10T06:24:38Z