త్రివిక్రమ్ ఉన్నంత వరకు వరుస హిట్లు.. చిరంజీవి సినిమా అందుకే పోయింది

టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో విజయ్ భాస్కర్ ఒకరు. స్వయం వరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలన్నీ ఈయన దర్శకత్వంలోనే వచ్చాయి. 

 

టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో విజయ్ భాస్కర్ ఒకరు. స్వయం వరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలన్నీ ఈయన దర్శకత్వంలోనే వచ్చాయి. అయితే విజయభాస్కర్ హిట్ చిత్రాల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పాత్ర ఎంతైనా ఉంది. 

   

నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి లాంటి చిత్రాలకు కథ మాటలు అందించింది త్రివిక్రమ్ శ్రీనివాసే. త్రివిక్రమ్ ఉన్నంత వరకు విజయ భాస్కర్ కి తిరుగులేదు అన్నట్లుగా చిత్రాలు బ్లాక్ బస్టర్ అవుతూ వచ్చాయి. కానీ త్రివిక్రమ్ ఫుల్ టైం డైరెక్టర్ అయ్యాక విజయభాస్కర్ కి విజయాలు తగ్గాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఫేడ్ అవుట్ అయ్యారు. 

   

విజయ్ భాస్కర్ కి వరుసగా కొన్ని ఫ్లాపులు ఎదురయ్యాయి. దీనితో ఆయన చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. విజయ భాస్కర్ దర్శకత్వం లో చివరగా తెరకెక్కిన చిత్రం మసాలా. వెంకటేష్, రామ్ హీరోలుగా తెరకెక్కిన ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. 

   

మెగాస్టార్ చిరంజీవితో విజయ భాస్కర్ జై చిరంజీవ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్విని దత్ నిర్మించిన ఈ  చిత్రం నిరాశపరిచింది. అయితే చిరంజీవితో ఓకే వైవిధ్యమైన చిత్రం చేసే అవకాశం నాకు రావడం అదృష్టం. సినిమా అంతా బాగానే ఉంటుంది. కానీ స్క్రీన్ ప్లే లోపం వాళ్ళ ఆ చిత్రం నిరాశ పరిచింది అని విజయ భాస్కర్ తెలిపారు. 

   

రీసెంట్ గా ఇంటర్వ్యూలో విజయ భాస్కర్ ఈ విషయాన్నీ వివరించారు. ఆ సినిమా కోసం యుఎస్ లో చాలా కష్టపడ్డాం. హెలికాఫ్టర్ లో కూడా ఒక యాక్షన్ సీన్ చేయాలని ప్లాన్ చేసాం. కానీ అనుమతులు లభించకపోడంతో విరమించుకున్నట్లు విజయభాస్కర్ తెలిపారు. 

   

 ఫ్యాన్స్ అంతా విజయ భాస్కర్ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. విజయ భాస్కర్ చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించేలా ఉంటాయి. త్రివిక్రమ్ ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు అని..ఆ తర్వాతే కెరీర్ డౌన్ ఫాల్ అయినట్లు ఫ్యాన్స్ చెబుతున్నారు. 

2024-04-27T10:51:06Z dg43tfdfdgfd