జగిత్యాల, జూన్ 28 : జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్కు చెందిన వడ్లకొండ మల్లేశ్ వారం క్రితం ఓమన్-యూఏఈ సరిహద్దులో తప్పిపోయాడని, అతను క్షేమంగా వచ్చేలా చూడాలని కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. మల్లేశ్ 15 రోజుల క్రితం దుబాయ్ వెళ్లగా ఓమన్-యుఏఈ సరిహద్దులో అక్రమంగా దాటుతుండగా పుజీరా, యూఏఈ జైల్లో వేసినట్టు తమకు తెలిసిందని అన్నారు. మల్లేశ్ కుటుంబ సభ్యుల విజ్ఞప్తితో స్పందించిన జీవన్రెడ్డి.. అతని ఆచూకీ తెలుసుకొని, క్షేమంగా రప్పించేలా చూడాలని కోరుతూ మసట్, దుబాయ్లోని భారత రాయబారులకు, కేంద్ర విదేశాంగ మంత్రికి, ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు కలెక్టర్, ఎస్పీకి ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు.
2024-06-28T22:52:04Z dg43tfdfdgfd