రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబానీ చిన్న కుమారుడు ఆనంద్ అంబానీ,ఎన్కోర్ హెల్త్కేర్ సీఈవో విరెన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ వివాహం జూలై 12న ముంబైలో జరగనుంది. ముంబైలోని బాంద్రాలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 12న వీరి పెళ్లి చాలా గ్రాండ్ గా జరగబోతోంది. ఈ పెళ్లికి దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. ఇటీవల, ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో మొదటి ఆహ్వానాన్ని అందించారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, ఇతర సెలబ్రిటీలకు కూడా పెళ్లికి ఆహ్వానం అందింది.
అయితే ఈ ఏడాది మార్చిలో గుజరాత్ లోని జామ్నగర్లోని రిలయన్స్ గ్రీన్స్ కాంప్లెక్స్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ప్ 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిరధ మహారథులందరూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
2024-06-28T17:12:35Z dg43tfdfdgfd