JANASENA: ఎమ్మెల్యేకు కారు బహూకరించిన జనసైనికులు..

శ్రీ కరాటం రాంబాబు గారి ఆధ్వర్యం లో పోలవరం జనసేన MLAకు కీ, డౌన్ పెమెంట్ కట్టి కారు బహుకరించారు జనసైనికులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆయన ఒక సామాన్య చిన్నకారు గిరిజన రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. కరాటం రాంబాబు గారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు . 2019 లో జనసేన తరుఫున ఎంఎల్ఏ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓటమిపాలైనప్పటికీ రెట్టింపు ఉత్సాహంతో ప్రజా సమస్యలపై అవిశ్రాంత పోరాటం చేశారు .

2024 ఎన్నికల్లో రాంబాబు గారి సూచన మేరకు పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద నమ్మకంతో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రజా క్షేత్రంలోకి పంపారు. అడుగడుగునా అనేక ఆటంకాలు ఎదురైనప్పటికీ తమకు అండగా ఉన్న రాంబాబు గారి ఆశీస్సులతో జన సైనికులు మొక్కవోనీ దీక్షతో అహర్నిశలు కష్టపడి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు.

---- Polls module would be displayed here ----

ఒక సామాన్య గిరిజన రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి అయినందున నిత్యం ప్రజల్లోకి తిరగడానికి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మారుమూల ఏజెన్సీ గ్రామాలను సందర్శించడానికి అనువుగా ఉండేందుకు కరాటం రాంబాబు గారి ఫ్యామిలీ & బుట్టాయగూడెం గ్రామ జనసైనికులు సేకరించిన కొంత అమౌంట్ తో ఫార్చునర్ కారు నిమిత్తం డౌన్ పేమెంట్ చెల్లించి మిగతాది ఎమ్మెల్యే జీతంలో వాయిదా పద్ధతిలో చెల్లించే విధంగా ఏర్పాటు చేసి, తమ అభిమాన ఎమ్మెల్యేకు ఫార్చునర్ కారును బహుమతిగా అందజేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు.

ఒక సామాన్య నిరుపేద రైతుని ఎమ్మెల్యేగా గెలిపించడమే కాక 175 ఎమ్మెల్యేల్లో మా ఎమ్మెల్యే ఏ మాత్రం తీసిపోడు అనే విధంగా కరాటం రాంబాబు గారి సోదరుల చేతుల మీదుగా ఈ రోజు జన సైనికుల ఆధ్వర్యంలో ఆయనకు కారును అందజేశారు.

2024-07-01T11:23:41Z dg43tfdfdgfd