కొండగట్టుకు అయోధ్య బాలరాముడి బాణం

కొండగట్టుకు అయోధ్య బాలరాముడి బాణం

కొండగట్టు అంజన్న సన్నిధికి శనివారం రామబాణం చేరుకుంది. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన శ్రీనివాసశర్మ అనే రామభక్తుడు బంగారం, వెండితో రామ బాణాన్ని తయారు చేయించాడు. ఈ బాణాన్ని దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శింపజేసి చివరగా అయోధ్య బాలరాముని సన్నిధికి సమర్పిస్తామని శ్రీనివాస్ శర్మ తెలిపాడు.

ఇందులో భాగంగానే కొండగట్టుకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈవో చంద్రశేఖర్, ప్రధాన అర్చకుడు జితేంద్ర ప్రసాద్, స్థానచార్యుడు కపిందర్, ఉప ప్రధాన అర్చకుడు చిరంజీవి పాల్గొన్నారు. 

కొండగట్టు, వెలుగు

©️ VIL Media Pvt Ltd.

2024-06-30T03:47:00Z dg43tfdfdgfd