నిజామాబాద్కు చెందిన ఓ వ్యక్తి రెచ్చిపోయాడు.. వద్దని చెప్పినా వినకుండా తనకు నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తమ్ముడిపై కోపం పెంచుకున్నాడు. తమ్ముడి భార్య అమ్మమ్మ ఇంటికి నిప్పంటించాడు. నిజామాబాద్ శాంతినగర్కు చెందిన మజర్, అమర్ అన్నదమ్ములు. ప్లంబింగ్ పనిచేసుకునే అమర్కు ఏడాది కిందట హైదరాబాద్కు చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. అమ్మాయికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో అన్న మజార్ వీరి పెళ్లికి నిరాకరించాడు. ఆ యువతిని తన తమ్ముడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మజర్ ఏడాది నుంచి అడ్డుకుంటున్నాడు. అయినా వినకుండా అమర్ శుక్రవారం పెళ్లి చేసుకున్నాడు. తమ్ముడి పెళ్లి విషయం తెలిసిన అన్న కోపం పెంచుకున్నాడు.
నూతన దంపతులు నిజామాబాద్ శాంతినగర్లో అమ్మాయి అమ్మమ్మ ఇంట్లో ఉన్నారని తెలిసి శుక్రవారం అర్ధరాత్రి మజర్ తన స్నేహితులు సల్మాన్, ఇలియాస్, సమీర్, ఇమ్రాన్లతో కలిసి వెళ్లి ఆ ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పెళ్లికి వచ్చిన కానుకలు మంటల్లో కాలిబూడిదయ్యాయి.. వాటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటాయంటున్నారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపైకేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది.
ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్స్టైల్ అప్డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి. 2024-04-28T03:04:44Z dg43tfdfdgfd