వాటర్‌ఫాల్స్‪లో ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు గల్లంతు

వాటర్‌ఫాల్స్‪లో ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు గల్లంతు

పూణేలోని లోనావాలా ప్రాంతంలోని భూషి డ్యామ్ బ్యాక్ వాటర్ సమీపంలోని వాటర్ ఫాల్స్ లో ఆదివారం ఐదుగురు గల్లంతు అయ్యారు. వారిలో ఒక మహిళ,నలుగురు పిల్లలు ఉన్నారు. వారంతా ఒకే ఫ్యామిలీకి చెందినవారు. విహరయాత్రకు వెళ్లిన వీరు ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు జలపాతంలో జారిపడ్డారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వాటర్ ఫాల్స్ లో గల్లంతు అయ్యారని లోనావాలా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. 

పోలీసులు, సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. మిగిలిన వారి కోసం ఇంకా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. భూషి డ్యామ్ లోనావాలాలోని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. దీనిని ఏడాది పొడవునా చాలా మంది పర్యాటకులు సందర్శిస్తారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువ. భారీ వర్షాల సమయంలో డ్యామ్ పొంగి ప్రవహిస్తుంది. 

  ©️ VIL Media Pvt Ltd.

2024-06-30T14:03:44Z dg43tfdfdgfd