Actress: ఒకప్పుడు పిల్లల డైపర్లు మార్చింది.. ఇప్పుడు సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటుంది..
సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ సెలబ్రిటీలు కొందరు ఎంతో కష్టపడి పైకి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గరి నుంచి లెక్కపెడితే, ఈ లిస్టు చాలా పెద్దగా ఉంటుంది. అలాగే కొందరు హీరోయిన్లు కూడా కెరీర్ ప్రారంభంలో అవమానాలను ఎదుర్కొని, చిన్న చిన్న ఉద్యోగాలు చేసి వచ్చి పాపులర్ అయ్యారు. వారిలో ఒక హీరోయిన్, ఏకంగా ఏడు రూ.100కోట్ల సినిమాల్లో నటించి గోల్డెన్ లెగ్గా గుర్తింపు పొందింది. అయితే ఆమె అనుకోకుండా ఈ రంగంలోకి వచ్చింది. ఒకప్పుడు ప్రీ-స్కూల్ టీచర్గా పనిచేసి, స్కూల్ పిల్లల డైపర్లు మార్చిన ఆ యువతి, నేడు పాపులర్ బాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకొని లగ్జరీ లైఫ్ గడుపుతోంది. బాలీవుడ్ను శాసిస్తున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు, కియారా అద్వానీ. మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’, రామ్ చరణ్తో ‘వినయ విధేయ రామ’ సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్కు పరిచయమైన కియారా అద్వానీ, ఒక ఫ్లాప్తో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె అనేక హిట్స్, బ్లాక్బస్టర్స్తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే సినిమా పరిశ్రమకు రాకముందు తాను పిల్లలకు డైపర్లు మార్చేదాన్నని కియారా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. రేడియో సిటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఉదయం 7 గంటలకు ప్రీస్కూల్కి వెళ్లి పిల్లల కేరింగ్ చూసుకునేదాన్ని. చిల్డ్రన్ మేనేజ్మేంట్ కోసం చేయాల్సినవన్నీ చేశాను. నర్సరీ రైమ్స్ పాడాను, వారికి లెటర్స్, నంబర్స్ నేర్పించాను. వారి డైపర్లను కూడా మార్చాను.’ అని చెప్పింది. ఆ సినిమాతో గుర్తింపుఅయితే ఇప్పుడు ఈ నటి బాలీవుడ్ను ఏలుతోంది. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని బయోపిక్ ‘M.S ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’ సినిమాలో సాక్షి పాత్రతో యావత్ దేశాన్ని ఇంప్రెస్ చేసింది. ఈ స్పోర్ట్స్ డ్రామాలో కియారా, సుశాంత్ సింగ్ రాజ్పుత్తో రొమాన్స్ చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యి, ప్రపంచవ్యాప్తంగా రూ.215.50 కోట్లు వసూలు చేసింది. ధోని భార్య రోల్తో ఆకట్టుకున్న కియారా, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. రూ.100కోట్ల హీరోయిన్షాహిద్ కపూర్, కియారా జంటగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ మూవీ రూ.377 కోట్లు వసూలు చేసింది. దిల్జిత్ దోసాంజ్, అక్షయ్ కుమార్తో కలిసి నటించిన ‘గుడ్ న్యూజ్’ (Good Newzz) సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 316 కోట్లు రాబట్టింది. ఆమె లీడ్ హీరోయిన్గా నటించిన ‘సత్యప్రేమ్ కి కథ’ రూ. 125.8 కోట్లు, ‘భూల్ భూలయ్యా’ రూ. 265.5 కోట్లు, ‘జగ్జగ్ జీయో’ రూ. 139.5 కోట్లు వసూలు చేశాయి. తెలుగు సినిమా ‘భరత్ అనే నేను’ కూడా ప్రపంచ వ్యాప్తంగా రూ.225 కోట్లు రాబట్టింది. ఇప్పుడు బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో కియారా ఒకరు. ప్రతి సినిమాకు ఆమె రెమ్యునరేషన్ రూ.8 కోట్లు. కియారా నెట్ వర్త్ రూ.40కోట్ల వరకు ఉంటుందని అంచనా. రానున్న సినిమాలుబాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను కియారా పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత కూడా ఆమె వరుసగా సినిమాల్లో నటిస్తోంది. రామ్ చరణ్కు జోడీగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. రూ.450 కోట్ల బడ్జెట్తో తీస్తున్న ఈ సినిమా, ఈ ఏడాది థియేటర్లలోకి రానుంది. ఫర్హాన్ అక్తర్ ‘డాన్ 3’లో ఆమె లీడ్ హీరోయిన్. హృత్రిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబో మూవీ ‘వార్-2’లో కూడా కియారా నటిస్తోంది.
2024-04-29T07:05:49Z