TTD: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మండుటెండల్లో చల్లటి మాట
తిరుమల తిరుపతి దేవస్థానంలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఎండాకాలంలో చల్లటి మాట చెప్పారు దేవస్థానం ఈవో. తాజాగా డయల్ యువర్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పారు. తిరుపతి ఎప్పుడు చూసినా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉంటుంది. ప్రతి రోజు లక్షలాది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం భక్తులు ఇక్కడకు వస్తుంటారు. నిత్యం గోవింద నామ స్మరణంతో తిరుమల కొండలు మారుమోగుతుంటాయి. జనరల్ గా శ్రీవారి దర్శనం అంటే అదో పెద్ద టాస్క్. గంటలు గంటలు క్యూ లైన్లలో నిలబడి వెయిటింగ్ హాల్స్ లో వెయిట్ చేస్తే గానీ చివరకు వెంకటేశుడి దర్శనం లభించదు. సాధారణ ప్రజలకు ఓ లైన్, ప్రత్యేక దర్శనాలకు మరో లైన్.. అదేవిధంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు మరో స్పెషల్ దారి.. ఇలా పలు మార్గాల్లో శ్రీవారి దర్శనాలు కల్పిస్తుంటారు. అయితే ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమలకు సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సామాన్యులకు మేలు కలిగేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఆంక్షలు విధించి చాలా రోజులైంది. అయితే ఇప్పుడు వేసవి రద్దీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నామని, కేవలం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు పరిమితం చేశామని ఆలయ ఈవో అన్నారు. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో తెలిపారు. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు ఆలయ మాడ వీధుల్లో చలువ పందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం మరిన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు.
2024-05-04T01:54:30Z
ఈ తేదీల్లో జన్మించిన వారికి సాక్ష్యాత్తు లక్ష్మీదేవి కటాక్షం.. బై బర్త్ వీరు మహారాజులే!
జ్యోతిష్యశాస్త్రం మాదిరిగానే సంఖ్యా శాస్త్రం కూడా ప్రజల జీవితంపై ప్రభావం చూపుతుందని చాలామంది నమ్ముతారు. సంఖ్యాశాస్త్రం (Numerology) అనేది వ్యక్తుల జీవితాలపై సంఖ్యలు చూపించే ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది. పుట్టిన తేదీ ఆధారంగా ఒక వ్యక్తి లక్షణాలు, సామర్థ్యాలు, ధోరణుల గురించి సమాచారాన్ని అందిస్తుంది. న్యూమరాలజీ ఆరోగ్యం, సంపద గురించి కూడా చాలా విషయాలను తెలియజేస్తుంది. న్యూమరాలజిస్టుల ప్రకారం, నిర్దిష్ట తేదీల్లో పుట్టిన కొంతమంది వ్యక్తులు సంపదను ఆకర్షించే లక్షణాలతో జన్మిస్తారు. ఆర్థిక విషయాల్లో మంచి నిర్ణయాలు కూడా తీసుకోగలరు. నెలతో సంబంధం లేకుండా ఈ తేదీల్లో జన్మించిన వారు డబ్బు బాగా సంపాదిస్తారు. మరి సహజంగా సంపద, విజయాన్ని ఆకర్షించే సామర్థ్యం ఉన్న ఆ వ్యక్తులు వారెవరో చూద్దాం. 13వ తేదీన జన్మించిన వ్యక్తులువీరికి అద్భుతమైన ఆర్థిక విశ్లేషణ నైపుణ్యాలు ఉంటాయి. 13వ సంఖ్య ఇండిపెండెంట్ నంబర్ 1, ప్రాక్టికల్ నంబర్ 3 లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ కలయిక కారణంగా వీరు ఆర్థిక అంశాలను చక్కగా విశ్లేషించగలరు, సరైన నిర్ణయాలు తీసుకోగలరు. 4వ తేదీ4వ తేదీన జన్మించిన వ్యక్తులు తరచుగా ఆర్థిక తెలివితేటలను ప్రదర్శిస్తారు. 4వ సంఖ్య వాస్తవికత, కష్టపడి పనిచేయడం, సున్నితమైన ప్రణాళికతో సంబంధం కలిగి ఉంటుంది. వీరు బడ్జెటింగ్, సేవింగ్, డబ్బును సమర్థవంతంగా నిర్వహించడంలో రాణిస్తారు. ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి కచ్చితమైన ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తారు. డబ్బు విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు. 8వ తేదీఈ తేదీన జన్మించిన వ్యక్తులు సహజంగా సంపద వైపు ఆకర్షితులవుతారు. 8వ సంఖ్య సంపద, విజయం, ఆర్థిక నైపుణ్యంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ వ్యక్తులకు డబ్బు గురించి మంచి అవగాహన ఉంటుంది. దీర్ఘకాలిక ఆర్థిక విజయం సాధించడానికి వనరులను ఎలా ఉపయోగించాలో వీరికి బాగా తెలుసు. 17వ తేదీనెలలో 17వ తేదీన పుట్టినవారు ఆర్థిక విషయాల్లో వ్యూహాత్మకంగా ఆలోచిస్తారు. 17వ సంఖ్య లోతైన ఆలోచన కలిగిన 7వ సంఖ్య.. జ్ఞానానికి సంపదకు సంబంధించిన 8వ సంఖ్య శక్తిని కలిగి ఉంటుంది. ఈ కలయిక వీరికి దీర్ఘకాలిక ఆర్థిక వ్యూహాలను రూపొందించడం, వారి ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. (Disclaimer: ఈ ఆర్టికల్లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)
2024-05-04T04:54:59Z