ఒకప్పుడు ట్రెడిషనల్ తెలుగు హీరోయిన్.. ఇప్పుడు బోల్డ్ సీన్స్, లిప్ కిస్లతో రచ్చ రచ్చ..!
నేషనల్ క్రష్ అనే పదం సినీ ఇండస్ట్రీలో తరచుగా వినిపిస్తుంటుంది. హీరోయిన్స్ తమ నటనతో ఆకట్టుకున్నప్పుడు పాపులారిటీ అమాంతం పెరిగిపోతుంది. అభిమానుల గుండెల్లో క్రష్గా గుర్తింపు పొందుతారు. శ్రద్ధ కపూర్, దిశా పటానీ, రష్మిక మందన్న వంటి హీరోయిన్స్ నేషనల్ క్రష్గా పేరు తెచ్చుకున్నారు. యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్రీకి ఈ హోదా దక్కింది. తాజాగా మరో సౌత్ బ్యూటీ ఈ జాబితాలో చేరిపోయింది. ఒకప్పుడు ట్రెడిషనల్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఆ నటి.. ఇప్పుడు బోల్డ్ సీన్స్, లిప్ కిస్లతో రెచ్చిపోతోంది. ఇలాంటి సీన్లలో నటించిన ఒక సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. తర్వాత రెమ్యునరేషన్ డబుల్ చేసింది. ఆమె ఎవరో కాదు.. కేరళ కుట్టి, తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన అనుపమ పరమేశ్వరన్. టిల్లు స్క్వేర్ మూవీతో ఆమె ఒక్కసారిగా నేషనల్ క్రష్గా గుర్తింపు పొందింది. 2015లో ప్రేమమ్తో ఎంట్రీఅనుపమ పరమేశ్వరన్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు పదేళ్లు అవుతోంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది. 2015లో మలయాళ చిత్రం ‘ప్రేమమ్’తో వెండితెరకు పరిచయం అయింది. తర్వాత కోడి, రాక్షసుడు, కార్తికేయ-2, శతమానంభవతి వంటి చిత్రాల్లో నటించింది. ఇవి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. అయినా కూడా అనుపమకు నటిగా అంతగా గుర్తింపు రాలేదు. టిల్లు స్క్వేర్తో నేషనల్ క్రష్గా గుర్తింపుఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ అయిన ‘టిల్లు స్వ్కేర్’ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇది డీజే టిల్లు మూవీకి సీక్వెల్. ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ సరసన నటించిన అనుపమ పరమేశ్వరన్, బోల్డ్ సీన్స్, లిప్ కిస్లతో రెచ్చిపోయింది. ఈ చిత్రం అటు క్లాస్, ఇటు మాస్ మూవీ లవర్స్ను ఇంప్రెస్ చేసింది. రూ.40 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద రూ.130 కోట్లు వసూలు చేసి సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. టిల్లు స్క్వేర్ మూవీలో సిద్ధు, అనుసమ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ముద్దు, రొమాన్స్ సన్నివేశాలు వైరల్ అయ్యాయి. ఈ చిత్రంలో గ్లామర్ డోస్ పెంచిన అనుపమ పాపులారిటీ అమాంతం పెరిగింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్కు సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆమెను ఇప్పుడు కొత్త నేషనల్ క్రష్గా పిలుస్తున్నారు. రెమ్యూనరేషన్ పెంపుటిల్లు స్క్వేర్ సక్సెస్తో అనుపమ దశ తిరిగింది. సినీ ఆఫర్స్ క్యూ కట్టాయి. దీంతో ఆమె పారితోషికాన్ని డబుల్ చేసినట్లు సమాచారం. గతంలో అనుపమ ఒక చిత్రానికి రూ.1 కోటి వసూలు చేసేది. ఇప్పుడు రెమ్యునరేషన్ రూ.2 కోట్లకు పెంచింది. అప్కమింగ్ సినిమాలుటిల్లు స్క్వేర్ ఇచ్చిన బూస్ట్తో అనుపమ పరమేశ్వరన్ కొన్ని అప్కమింగ్ మూవీస్కు సైన్ చేసింది. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తదుపరి చిత్రం ‘ఆక్టోపస్’తో సహా మరికొన్ని పెద్ద ప్రాజెక్ట్ల్లో నటిస్తోంది. ఆక్టోపస్ లేడీ ఓరియంటెడ్ సినిమా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పరదా పేరుతో ఓ పాన్ ఇండియన్ మూవీలో కూడా నటిస్తోంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా ‘బైసన్’ పేరుతో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్తో కూడిన ఈ చిత్రంలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ను ఎంపిక చేశారు. మారి సెల్వరాజ్ దీని డైరెక్టర్. అలాగే కొలీవుడ్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అనుపమతో ఓ యాక్షన్ మూవీ చేస్తోంది. ఏఆర్ జీవా డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ‘లాక్డౌన్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
2024-05-09T03:07:50Z