జిమ్ తో పాటు యోగా శిక్షణ కేంద్రం ఇదే.. గర్భిణులకు ప్రత్యేకంగా..
కరోనా తరువాత చాలా మంది ఆరోగ్యం పై దృష్టి సారించారు. ఆరోగ్యం కోసం చాలా మంది డైట్, జిమ్, యోగ లాంటివి చేస్తున్నారు. ఇందులో భాగంగా చాలా జిమ్, యోగ సెంటర్స్ ను పెట్టి ప్రజలకు సర్వీస్ ఇస్తున్నారు. కరీంనగర్ కు చెందిన దీప్తి అనే మహిళ కూడా దీప్తి ఫిట్నెస్ స్టూడియో పెట్టి యోగ, జిమ్ నేర్పిస్తున్నారు. ఇవే కాకుండా గర్భిణీ స్త్రీలకు గర్భ సంస్కార్ అనే యోగ నేర్పిస్తున్నారు. ఇదే విషయంపై దీప్తి ఫిట్నెస్ స్టూడియో నిర్వహకురాలును లోకల్ 18ను పలకరించే ప్రయత్నం చేసింది. తనకు డైట్, మెడిటేషన్, యోగ అంటే ఫ్యాషన్ అని తెలిపింది. తను నేర్చుకున్న వీటిని నలుగురికి నేర్పించాలనే ప్రయత్నం చేస్తున్నాని తెలిపింది .సిటీలో ఎక్కడ లేనటువంటి తక్కువ ఫీజుతో ఈ ఫిట్నెస్ స్టూడియో ను నిర్వహిస్తున్నని అన్నారు. ఇంకా రోజు యోగా సాధన చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందన్నారు. యోగ చేయడం వలన శరీరంలో ఆక్సిజనేషన్ను ఎనేబుల్ చేస్తుంది. దీని కారణంగా శరీరం శాంతించడంతో రక్తపోటులో గణనీయమైన తగ్గింపు ఉంటుంది. యోగా అనేది ఒక వ్యక్తిని శారీరకంగా, మానసికంగా సానుకూలంగా ప్రభావితం చేసే అసంఖ్యాక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడం లేదా మీ నొప్పిని తట్టుకునే శక్తిని ఇస్తుందన్నారు. శరీరం అంతటా ఆక్సిజన్, పోషకాల మెరుగైన రవాణా. మెరుగైన రక్త ప్రవాహం ఆరోగ్యకరమైన అవయవాలు, చర్మాన్ని సౌందర్యని కూడా మెరుగు పడుతుంది. ముఖ్యంగా వీరి దగ్గరకు ఎక్కువగా గర్భిణీలు, అలాగే బ్యాక్ పెయిన్, బీపి షుగర్ ఉన్నవారు వచ్చి ఇక్కడ శిక్షణ తీసుకుంటారని తెలిపారు. ఇక్కడ మోడీటేషన్, యోగాతో పాటు ఆధ్యాత్మిక శ్లోకాలు, శ్రీరామన జపం, నూట ఎనిమిది సార్లు ఓంను పలికించడం నేర్పిస్తున్నారు. ఇంకా లేటు ఎందుకు మీరు కూడా ఈ ఫిటినెస్ స్టూడియోలో జాయిన్ కండి. తక్కువ ఫీజుతో ఎక్కువ లాభాలు నేర్పిస్తున్న ఈ స్టూడియో పాస్పోర్ట్ ఆఫీస్ పక్కన, ఎదురుగా బి ఎస్ కే గోల్డ్ షాప్, కరీంనగర్. మీరు కూడా ఈ స్టూడియోలో జాయిన్ అవ్వండి.. ఆరోగ్యాని కాపాడుకోండి.
2024-05-08T13:36:14Z
Panchangam Today: ఉదయం 10గంటలకు ఏం చేసిన శుభమే
Panchangam Today: నేడు 2024 గురువారం, మే 9, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖ మాసం, వసంత ఋతువు, శుక్ల పక్షం,వైశాఖస్నానారంభః ఇవాళ 5 గంటల 35 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 37 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి శుక్ల పాడ్యమి ఉదయం :6గంటల .21నిమిషాల వరకు..విదియ రాత్రి :4గంటల 18నిమిషాల వరకు కలదు. తదుపరి: తదియ.వారం: బృహస్పతివాసరె నక్షత్రం: కృత్తిక , ఉదయం 11గంటల 58నిమిషాల వరకు కలదు.తదుపరి రోహిణి.యోగం: శోభన , మధ్యాహ్నం: 2గంటల 44నిమిషాల వరకు కలదు.తదుపరి: అతిగండకరణం: బవ, ఉదయం :6గంటల 21నిమిషాల వరకు కలదు. బాలవ సాయంత్రం:5గంటల 20నిమిషాల వరకు కలదు. తదుపరి: తైతుల అమృతకాలం ఉదయం 9 గంటల 44 నిమిషాల నుంచి 11 గంటల13 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం ఉదయం:10 గంటలు 05నిమిషాల నుంచి 10గంటల 56నిమిషాల వరకు.మధ్యాహ్నం:3గంటల 11నిమిషాల వరకు కలదు. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం మధ్యాహ్నం :ఒంటి గంట 30నిమిషాల నుండి 3గంటల వరకు కలదు. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం ఉదయం:6 గంటల నుండి 7గంటల 30నిమిషాల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం రాత్రి :3గంటల .12నిమిషాల నుండి 4గంటల 44నిమిషాల వరకు ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.
2024-05-08T21:06:43Z