Money Astrology: ఏప్రిల్ 28 ధన జ్యోతిష్యం. వారికి కెరీర్ అవకాశాలు పెరుగుతాయి
(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): జ్యోతిష్యులు వివిధ అంశాల ఆధారంగా ఒక వ్యక్తికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తుంటారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వ్యక్తుల ఆర్థిక భవిష్యత్తును విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. ఏప్రిల్ 28వ తేదీ, ఆదివారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):ఫీల్డ్లో ఆశించిన రీతిలో పనితీరు మెయింటైన్ చేస్తారు. ఆర్థిక, వాణిజ్యపరమైన పనులు చేస్తారు. పూర్వీకులు, సంప్రదాయ వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో సానుకూలత ఉంటుంది. అందరినీ కలుపుకొని వెళ్తారు. సంపద వృద్ధి చెందుతుంది. ఆర్థిక రంగం మెరుగుపడుతుంది. పరిహారం: రామాలయంలో జెండా సమర్పించండి. వృషభం (Taurus):అన్ని రంగాల్లోనూ ఎఫెక్టివ్గా పని చేస్తారు. ధైర్యం చురుకుదనాన్ని, అవగాహనను పెంచుతుంది. ఆర్థిక, వాణిజ్య రంగంలో విశిష్టమైన పనులు చేయాలనే ఆలోచన ఉంటుంది. ఫలితాలు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉంటాయి. మంచి ఆఫర్లను అందుకుంటారు. సామరస్య వాతావరణం ఉంటుంది. మీ ప్లాన్లకు బలం చేకూరుతుంది. పరిహారం- సరస్వతి అమ్మవారికి తెల్లటి పూల మాల సమర్పించండి. మిథునం (Gemini):ఓర్పు, నమ్మకంతో ముందుకు సాగుతారు. పనిలో అత్యాశ, ప్రలోభాలకు గురికావద్దు. ఆర్థిక ప్రయత్నాలలో జాగ్రత్త పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారంపై దృష్టి సారిస్తారు. దేంట్లోనూ తొందరపాటు చూపరు. రిస్క్ ఉండే పనులకు దూరంగా ఉంటారు. ప్లాన్ల అమలును పెంచుతారు. పరిహారం: ఎర్రటి ఆవుకు బెల్లం తినిపించండి. కర్కాటకం (Cancer):లక్ష్య సాధనలో విజయం సాధిస్తారు. పరిస్థితులపై నియంత్రణ కొనసాగిస్తారు. సంపద వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాలలో విజయాలు పెరుగుతాయి. ఆఫీసర్ క్లాస్ వ్యక్తులు సంతోషంగా ఉంటారు. ఆశించిన ఫలితాలు వస్తాయి. వ్యాపారాలు మెరుగుపడతాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. పరిహారం: సాయంత్రం వేళ రావి చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించండి. సింహం (Leo):కెరీర్ను జాగ్రత్తగా ప్లాన్ చేసి, పనులు మేనేజ్ చేయండి. కమర్షియల్ పనుల్లో వేగం ప్రదర్శిస్తారు. యాక్షన్ ప్లాన్స్ ఊపందుకుంటాయి. మీ ప్రతిభ, పనితీరు మెరుగుపడుతుంది. పనిలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యక్తిగత విషయాలపై దృష్టి సారిస్తారు. సహోద్యోగులతో సమన్వయం పెరుగుతుంది. పరిహారం: శివునికి నీటిని సమర్పించండి. కన్య (Virgo):వృత్తి, వ్యాపారాల్లో సుఖంగా ఉంటారు. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు లభిస్తాయి. లాభం, విస్తరణపై దృష్టి పెడతారు. పరిశ్రమ ఉత్పత్తులు మెరుగుపడటం కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ మీ యాక్టివిటీతో ప్రభావితమవుతారు. వివిధ రంగాల్లో శుభం ఉంటుంది. పరిహారం: హనుమంతోని గుడిలో నెయ్యి దీపం వెలిగించండి. తుల (Libra):ఆఫీస్లో అవగాహన, వినయంతో పని పూర్తి చేస్తారు. పరిస్థితులపై నియంత్రణ కొనసాగిస్తారు. ఉద్యోగ వ్యాపారం సాధారణంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలపై దృష్టి సారిస్తారు. రిసెర్చ్ పనులపై ఆసక్తి చూపుతారు. అనుభవజ్ఞులతో సహవాసాన్ని పెంచుకోండి. సలహాదారులతో సన్నిహితంగా ఉండండి. పరిహారం: నల్ల కుక్కకు ఏదైనా తీపి పదార్థం ఇవ్వండి. వృశ్చికం (Scorpio):యాక్షన్ ప్లాన్స్ ముందుకు తీసుకెళ్తారు. టైమ్ మేనేజ్మెంట్పై దృష్టి సారిస్తారు. దురాశ, ప్రలోభాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఆర్థిక విషయాలపై నియంత్రణ పెరుగుతుంది. పనిలో అవగాహన పెరుగుతుంది. వర్క్లో ఓర్పు ప్రదర్శిస్తారు, అప్రమత్తంగా ఉంటారు. అతిగా ఉత్సాహం చూపకూడదు. పరిహారం: పేదవారికి తెల్లటి వస్తువులు దానం చేయండి. ధనస్సు (Sagittarius):పనుల్లో వేగం ఉంటుంది. కొత్త ప్లాన్లు రూపుదిద్దుకుంటాయి. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. వ్యాపారం బలంగా ఉంటుంది. మెరుగైన వేగంతో ముందుకు సాగుతారు. మీరు అన్నింట్లోనూ విజయాన్ని పొందుతారు. చాలా కేసులు అనుకూలంగా ఉంటాయి. మీ ప్రభావం పెరుగుతూనే ఉంటుంది. పరిహారం- పిండి, పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి. మకరం (Capricorn):ప్రొడక్టివ్ పనుల పట్ల మొగ్గు పెరుగుతుంది. ఉమ్మడి పనుల్లో ముందుంటారు. సమయం అనుకూలంగా ఉంటుంది. తీవ్రమైన విషయాలపై ఆసక్తి ఉంటుంది. స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. విజయ స్ఫూర్తితో పనులు చేస్తారు. వృత్తిపరమైన పనుల్లో మంచి పనితీరు కనబరుస్తారు. పరిహారం: పక్షికి ఆహారం ఇవ్వండి. కుంభం (Aquarius):ఆర్థిక విషయాల్లో వేగాన్ని కొనసాగిస్తారు. సానుకూల సమయంలో మంచి ప్రయోజనాన్ని పొందుతారు. వృత్తిపరమైన ప్రయత్నాలను కొనసాగిస్తారు. ఒకటి కంటే ఎక్కువ మూలాల నుండి లాభం పొందే మార్గం తెరచుకుంటుంది. కాంటాక్ట్ కమ్యూనికేషన్ మెరుగ్గా ఉంటుంది. ధైర్యం, బలం పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో పనులను వేగవంతం చేస్తారు. పరిహారం: శారీరక వికలాంగులకు సేవ చేయండి. మీనం (Pisces):ఆఫీస్లో లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేస్తారు. ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. కెరీర్ అవకాశాలు పెరుగుతాయి, తప్పకుండా ముందుకు వెళ్తారు. విజయ భావం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారంలో మెరుగ్గా రాణిస్తారు. ప్రతిచోటా శుభ ఫలితాలతో మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. పోటీ భావం పెరుగుతుంది. పరిహారం: దుర్గ గుడిలో నెయ్యి దీపం వెలిగించండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.
2024-04-27T23:30:31Z
పెళ్లైన నటుడితో ఎఫైర్.. పెళ్లికాకుండానే తల్లి.. ఇద్దరు కూతుళ్లులో ఒకరు సూపర్ స్టార్..
హేమమాలిని, రేఖ, వైజయంతీమాల, జయప్రద, శ్రీదేవి బాలీవుడ్లో అడుగు పెట్టకముందు దక్షిణాది సినిమాల్లో పనిచేసింది ఈ నటి. సౌత్ సినిమా నుంచి బాలీవుడ్ లోకి వచ్చి దేశవ్యాప్తంగా ప్రజల గుండెల్లో స్థిరపడింది. రెండు పెళ్లిళ్లు చేసుకున్న దక్షిణాది సినిమా సూపర్ స్టార్తో ప్రేమలో పడి, పెళ్లి చేసుకోకుండా, ఇద్దరు కూతుళ్లకు తల్లి అయిన అతికొద్ది మంది నటీమణుల్లో ఈమె కూడా ఒకరు. ఆమె రేఖ తల్లి పుష్పవల్లి.. : Instagram@diva_the_rekha) రేఖ తల్లి పుష్పవల్లి తమిళం, తెలుగు సినిమాల్లో నటించారు. సినిమా తెరపై సంపూర్ణ రామాయణంలో సీత పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆమె 1936లో విడుదలైన ఆ చిత్రంలో సీత పాత్రను పోషించారు. అందుకు ఆమె రూ.300 రెమ్యూనరేషన్ అందుకుననారు. ఈ పాత్ర తరువాత, ఆమెకు చాలా చిత్రాలలో ఆఫర్లు రావడం ప్రారంభించాయి.: Instagram@filmypioneer) రేఖ తల్లి సినిమాల కంటే పర్సనల్ లైఫ్ కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ఆమెకు 1940లో వివాహం జరిగింది, కానీ 6 సంవత్సరాల తరువాత, ఆమె వైవాహిక జీవితం దెబ్బతింది. ఆమె తన భర్త నుండి వేరుగా జీవించడం ప్రారంభించింది. అప్పటికే ఆమెకు ఇద్దరు సంతానం. (ఫోటో క్రెడిట్: Instagram@diva_the_rekha) ఆ తర్వాత తమిళ నటుడు జెమినీ గణేశన్తో కలిసి 'మిస్ మాలిని' చిత్రంలో ప్రధాన పాత్రలో నటించడంతో పుష్పవల్లి జీవితంలో కొత్త మలుపు వచ్చింది. రేఖ తల్లి జెమిని గణేశన్ తో ప్రేమలో పడింది, కానీ నటుడికి ఇదివరకే వివాహం జరిగింది. (ఫోటో క్రెడిట్: Instagram@filmypioneer) జెమినీ గణేశన్ పుష్పవల్లికి ఎప్పుడూ భార్య హోదా ఇవ్వలేదు. కానీ రేఖ తల్లి తన జీవితమంతా అతని ప్రేయసిగా గడిపింది. వివాహం కాకుండానే జెమినీ గణేశన్ ఇద్దరు కుమార్తెలకు తల్లి అయింది, వీరిలో ఒకరు ప్రముఖ నటి రేఖ. (ఫోటో క్రెడిట్: Instagram@rekha_the_actress) రేఖ తల్లి పుష్పవల్లి 1991లో కన్నుమూశారు. ఆమె ఎక్కువగా సినిమాల్లో సహాయక పాత్రలు పోషించారు. మరోవైపు పుష్పవల్లి కూతురు రేఖ మాత్రం సినీ ప్రపంచంలో పెద్ద నటిగా ఎదగగలిగింది. (ఫోటో క్రెడిట్: Instagram@rekha_the_actress) రేఖ తనలా సినిమాల్లో నటించాలని పుష్పవల్లి కోరుకుంది. రేఖ తొలిసారి తెలుగు చిత్రం 'రంగుల రాట్నం'లో కనిపించింది. అప్పుడు ఆమె వయసు 12 సంవత్సరాలు మాత్రమే. 15 ఏళ్ల వయసులో తన తొలి బాలీవుడ్ చిత్రం 'అంజనా సఫర్'లో నటించింది. Photo : Instagram పుష్పవల్లి లాగే ఆమె కూతురు రేఖ జీవితం కూడా అల్లకల్లోలంగా మారింది. రేఖ వారి కంటే చాలా పెద్ద సినీ తార అయినప్పటికీ ఆమె మొదటి వివాహం విఫలమైంది. ఆమె చాలా ఫేమస్ అయినా 69 ఏళ్ల వయసులో కూడా ఒంటరిగానే ఉంటోంది. Photo : Instagram
2024-04-28T05:31:55Z
Panchangam Today: నేటి పంచాంగం. శుక్రమౌడ్యమి ప్రారంభం
నేడు 2024 ఆదివారం, ఏప్రిల్ 28, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, చైత్ర మాసం, బహుళపక్షం, శుక్రమౌడ్యారంబః ఇవాళ 5 గంటల 40 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 21 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి కృష్ణ చవితి. ఉదయం 8 గంటల 20 నిమిషాల వరకూ ఉంది. తర్వాత పంచమివారం: భానువాసరెనక్షత్రం: మూల, రాత్రి తెల్లవారుజాము 4 గంటల 47 నిమిషాల వరకూ ఉంది. తర్వాత పూర్వాషాడ.యోగం: శివ, రాత్రి 2 గంటల 3 నిమిషాల వరకూ ఉంది. తర్వాత సిద్దకరణం: బాలవ, ఉదయం 8 గంటల 20 నిమిషాల వరకూ ఉంది. తర్వాత కౌలవ రాత్రి 8 గంటల 8 నిమిషాల వరకూ ఉంది. తర్వాత తైతుల.పితృతిథి: కృష్ణ పంచమిశుభసమయం: ఉ:10.41 (మిథున), రా:08.12 (వృశ్చిక), రా:11.10 (ధనస్సు), రా:12.51(మకర). అమృతకాలం రాత్రి 10 గంటల 18 నిమిషాల నుంచి 11 గంటల 55 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 51 నిమిషాల నుంచి 5 గంటల 42 నిమిషాల వరకు ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం ఉదయం 4 గంటల 30 నుంచి 6 గంటల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం రాత్రి 3 గంటల 10 నిమిషాల నుంచి 4 గంటల 47 నిమిషాల వరకూ ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.
2024-04-28T00:30:41Z
ఏళ్ళకు ఏళ్లుగా పెళ్లి కావట్లేదా.. ఇక్కడ అభిషేకం నిర్వహిస్తే మీ ఇంట బాజాభజంత్రీలు మోగుతాయట
వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడి సైతం శ్రీ కేదారేశ్వర స్వామి వారి ఆలయాన్ని పోలినట్లు ఉండడం గమనించవచ్చు..చెంబుడు నీళ్లు పోస్తే చాలు కోరిన కోర్కేలు తీర్చే భోళాశంకరుడు… ఇక్కడ కొన్ని వందల సంవత్సరాలుగా పూజలందుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లికాని వారు ఇక్కడకు వచ్చి..భక్తి శ్రద్ధలతో ఆ కేదారేశ్వరుని పూజిస్తే వారికి వెంటనే మంచి జరుగుతుందని ప్రతీతి. అందుకే పెళ్లికాని యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ ఈశ్వరుడిని దర్శించుకుంటారట . కేదారేశ్వరస్వామి (కుమ్మరి గుడి) దేవాలయం..ఈ స్వామి వారికి మహిమాన్వితమైన శక్తులు ఉన్నాయని, ఇక్కడ పెళ్లి కాని వారు స్వామి వారికి భక్తిశ్రద్ధలతో అభిషేకాలు చేస్తే పుణ్య ఫలంతో పాటు గండాలు తొలగి వివాహం జరుగుతుందని, భక్తుల ప్రగాఢ విశ్వాసమని ఆలయ అర్చకులు అప్పాల భీమా శంకర శర్మ తెలిపారు. ఆలయ పూర్తి వివరాల లోకి వెళితే ... మన దేశం ఎన్నో సంస్కృతి సంప్రదాయాలకు నెలవు. మన దేశంలో ఉన్న ప్రతి ప్రసిద్ధ దేవాలయానికి ఓ చరిత్ర, ప్రాముఖ్యత, విశిష్ఠత ఉంటాయి. అలాగే, ఈ కేదారేశ్వరస్వామి వారికి మహిమాన్వితమైన శక్తులు ఉన్నాయని, ఇక్కడ పెళ్లి కాని వారు స్వామివారికి భక్తిశ్రద్ధలతో అభిషేకాలు చేస్తే పుణ్య ఫలంతో పాటు గండాలు తొలగి వివాహం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉందో చూద్దాం…రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఈ దేవాలయం కొలువై ఉంది. ఈ ఆలయం జైనుల కాలం నాటిదని…ఆ దేవాలయంపై దర్శనమిస్తున్న రాతి శిల్ప కళ చెప్పకనే చెబుతోంది. చాళుక్య రాజులు దీనిని కట్టించారు. ఈ ఆలయంలో లింగరూపేడైన కేదారేశ్వర స్వామి వారి లింగంపై బ్రహ్మ సూక్తం ఉంటుందని, అతి ప్రాచీన శివలింగాలపై మాత్రమే ఈ బ్రహ్మ సూక్తం ఉంటుందని అర్చక స్వాములు చెబుతున్నారు. కేదారేశ్వర ఆలయ మతి పురాతనమైన ఆలయమని, ఆలయ రాతి గోడలపై అనేక రకాల దివ్యమూర్తుల ప్రతిమలు చెక్కారు. ఈ ప్రతిమలు కళానైపుణ్యం చూస్తుంటే అబ్బురపడాల్సిందే. ఆలయం మొత్తం వివిధ దేవతామూర్తులతో కనివిందు చేస్తుంది. ఆలయానికి ఆనుకుని ఉన్న అతి పురాతన విగ్రహాలు చూస్తే జైనుల శిల్ప కళ మనకు దర్శనమిస్తోంది. స్వామివారి ఆలయ ప్రధాన ద్వారం వద్ద రాతితో చెక్కబడిన శిలాశాసనం కనువిందు చేస్తుంది. ఈ శాసనంపై శివలింగం, నంది, గోమాతలతో కలిగిన శాసనం ఉంది. స్వామివారి ఆలయానికి ఉత్తరాన విష్ణుమూర్తి, దక్షిణాన బ్రహ్మదేవుని విగ్రహాలు అత్యంత శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. ఆలయం మొత్తం రాతితో నిర్మించారు. ఆలయ గోపురంపై దేవ దేవుళ్ళ విగ్రహాలు, రథ చక్రాలు, నటరాజ విగ్రహం, నంది, అమ్మవార్ల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయ ఆవరణంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ముందుగా ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం కేదారేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం విశేషం. స్వామివారిని ప్రతిరోజు అధిక సంఖ్యలో స్థానిక భక్తులు దర్శించుకుంటారు. ప్రస్తుతం ఈ దేవాలయం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉంది. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు గతంలో ఈ ఆలయం తెలియకపోవడంతో భక్తుల తాకిడి తక్కువగానే ఉండేది. కానీ ప్రస్తుతం భక్తులకు తెలిసేలా స్థానిక ప్రజలు హిందూ సంఘాలు ఆలయ విశిష్టతను తెలియజేస్తున్నారు. మహా శివరాత్రి రోజు స్థానిక భక్తులు కేదారేశ్వర స్వామి వారిని అధిక సంఖ్యలో దర్శించుకొని అభిషేక పూజలు నిర్వహిస్తున్నారని ఆలయ అర్చకులు తెలిపారు.
2024-04-27T10:13:46Z