Panchangam Today: నేటి పంచాంగం. శుక్రమౌడ్యమి ప్రారంభం
నేడు 2024 ఆదివారం, ఏప్రిల్ 28, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, చైత్ర మాసం, బహుళపక్షం, శుక్రమౌడ్యారంబః ఇవాళ 5 గంటల 40 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 21 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి కృష్ణ చవితి. ఉదయం 8 గంటల 20 నిమిషాల వరకూ ఉంది. తర్వాత పంచమివారం: భానువాసరెనక్షత్రం: మూల, రాత్రి తెల్లవారుజాము 4 గంటల 47 నిమిషాల వరకూ ఉంది. తర్వాత పూర్వాషాడ.యోగం: శివ, రాత్రి 2 గంటల 3 నిమిషాల వరకూ ఉంది. తర్వాత సిద్దకరణం: బాలవ, ఉదయం 8 గంటల 20 నిమిషాల వరకూ ఉంది. తర్వాత కౌలవ రాత్రి 8 గంటల 8 నిమిషాల వరకూ ఉంది. తర్వాత తైతుల.పితృతిథి: కృష్ణ పంచమిశుభసమయం: ఉ:10.41 (మిథున), రా:08.12 (వృశ్చిక), రా:11.10 (ధనస్సు), రా:12.51(మకర). అమృతకాలం రాత్రి 10 గంటల 18 నిమిషాల నుంచి 11 గంటల 55 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 51 నిమిషాల నుంచి 5 గంటల 42 నిమిషాల వరకు ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం ఉదయం 4 గంటల 30 నుంచి 6 గంటల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం రాత్రి 3 గంటల 10 నిమిషాల నుంచి 4 గంటల 47 నిమిషాల వరకూ ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.
2024-04-28T00:30:41Z
పెళ్లైన నటుడితో ఎఫైర్.. పెళ్లికాకుండానే తల్లి.. ఇద్దరు కూతుళ్లులో ఒకరు సూపర్ స్టార్..
హేమమాలిని, రేఖ, వైజయంతీమాల, జయప్రద, శ్రీదేవి బాలీవుడ్లో అడుగు పెట్టకముందు దక్షిణాది సినిమాల్లో పనిచేసింది ఈ నటి. సౌత్ సినిమా నుంచి బాలీవుడ్ లోకి వచ్చి దేశవ్యాప్తంగా ప్రజల గుండెల్లో స్థిరపడింది. రెండు పెళ్లిళ్లు చేసుకున్న దక్షిణాది సినిమా సూపర్ స్టార్తో ప్రేమలో పడి, పెళ్లి చేసుకోకుండా, ఇద్దరు కూతుళ్లకు తల్లి అయిన అతికొద్ది మంది నటీమణుల్లో ఈమె కూడా ఒకరు. ఆమె రేఖ తల్లి పుష్పవల్లి.. : Instagram@diva_the_rekha) రేఖ తల్లి పుష్పవల్లి తమిళం, తెలుగు సినిమాల్లో నటించారు. సినిమా తెరపై సంపూర్ణ రామాయణంలో సీత పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆమె 1936లో విడుదలైన ఆ చిత్రంలో సీత పాత్రను పోషించారు. అందుకు ఆమె రూ.300 రెమ్యూనరేషన్ అందుకుననారు. ఈ పాత్ర తరువాత, ఆమెకు చాలా చిత్రాలలో ఆఫర్లు రావడం ప్రారంభించాయి.: Instagram@filmypioneer) రేఖ తల్లి సినిమాల కంటే పర్సనల్ లైఫ్ కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ఆమెకు 1940లో వివాహం జరిగింది, కానీ 6 సంవత్సరాల తరువాత, ఆమె వైవాహిక జీవితం దెబ్బతింది. ఆమె తన భర్త నుండి వేరుగా జీవించడం ప్రారంభించింది. అప్పటికే ఆమెకు ఇద్దరు సంతానం. (ఫోటో క్రెడిట్: Instagram@diva_the_rekha) ఆ తర్వాత తమిళ నటుడు జెమినీ గణేశన్తో కలిసి 'మిస్ మాలిని' చిత్రంలో ప్రధాన పాత్రలో నటించడంతో పుష్పవల్లి జీవితంలో కొత్త మలుపు వచ్చింది. రేఖ తల్లి జెమిని గణేశన్ తో ప్రేమలో పడింది, కానీ నటుడికి ఇదివరకే వివాహం జరిగింది. (ఫోటో క్రెడిట్: Instagram@filmypioneer) జెమినీ గణేశన్ పుష్పవల్లికి ఎప్పుడూ భార్య హోదా ఇవ్వలేదు. కానీ రేఖ తల్లి తన జీవితమంతా అతని ప్రేయసిగా గడిపింది. వివాహం కాకుండానే జెమినీ గణేశన్ ఇద్దరు కుమార్తెలకు తల్లి అయింది, వీరిలో ఒకరు ప్రముఖ నటి రేఖ. (ఫోటో క్రెడిట్: Instagram@rekha_the_actress) రేఖ తల్లి పుష్పవల్లి 1991లో కన్నుమూశారు. ఆమె ఎక్కువగా సినిమాల్లో సహాయక పాత్రలు పోషించారు. మరోవైపు పుష్పవల్లి కూతురు రేఖ మాత్రం సినీ ప్రపంచంలో పెద్ద నటిగా ఎదగగలిగింది. (ఫోటో క్రెడిట్: Instagram@rekha_the_actress) రేఖ తనలా సినిమాల్లో నటించాలని పుష్పవల్లి కోరుకుంది. రేఖ తొలిసారి తెలుగు చిత్రం 'రంగుల రాట్నం'లో కనిపించింది. అప్పుడు ఆమె వయసు 12 సంవత్సరాలు మాత్రమే. 15 ఏళ్ల వయసులో తన తొలి బాలీవుడ్ చిత్రం 'అంజనా సఫర్'లో నటించింది. Photo : Instagram పుష్పవల్లి లాగే ఆమె కూతురు రేఖ జీవితం కూడా అల్లకల్లోలంగా మారింది. రేఖ వారి కంటే చాలా పెద్ద సినీ తార అయినప్పటికీ ఆమె మొదటి వివాహం విఫలమైంది. ఆమె చాలా ఫేమస్ అయినా 69 ఏళ్ల వయసులో కూడా ఒంటరిగానే ఉంటోంది. Photo : Instagram
2024-04-28T05:31:55Z